Category Archives: యూదులు

Permalink to single post

దైవ ప్రణాళిక: యూదుల పాత్ర అన్యుల స్థానం

దేవుడు అందరికి దేవుడు

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] నరులందరిని ఒకే స్వరూపమందు ఒకే పోలికచొప్పున సృష్టించి వారందరికి ఒకే అశీర్వాదాన్ని అధికారాన్ని అనుగ్రహించి వారందరితో ఒకే సార్వత్రికనిబంధననుకూడా చేశాడు. ఆయన అందరికీ దేవుడు మరియు నాధుడు. ఆయనలో పక్షపాతంలేదు. అందుకే అందరినీ ప్రేమించి ఎవరూ నశించడం యిచ్చయించక అందరు మారుమనస్సు పొంది రక్షించబడాలని ఉద్దేశిస్తున్నాడు. అంతమాత్రమేగాక మెస్సయ్య అయిన యషువనందు అందరికి చాలిన రక్షణను సిద్ధపరచి దాన్ని అందరికి అందుబాటులో అంటే కేవలం విశ్వాసదూరములోనే వుంచాడు.  

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] కేవలం యూదులకు మాత్రమే కాదు సర్వశరీరులకు నాధుడు మరియు దేవుడు:

“కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో యిట్లనెను సర్వలోకనాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక” (యెహోషువ.3:9-10)

 సర్వలోకనాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.”(యెహోషువ.3:13)

“సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కు దువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.” (మీకా.4:13) 

“అతడు నాతో ఇట్లనెనుఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.” (జెకర్యా.6:5)

“వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి.” (సం.కాం.16:22)
“అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము.”
(సం.కాం.27:15)

“నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.” (యెషయా.54:5)

“నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?” (యిర్మీయా.32:27) 

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] కేవలం యూదులను మాత్రమేకాదు నరులందరిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించాడు:

“దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.” (ఆది.కాం.1:26-27)

“ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను; మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.” (ఆది.కాం.5:1-2)

“నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆది.కాం.9:6)

“దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.” (యాకోబు.3:9)

దేవుడు నరులందరిని ఆశీర్వదించి వారందరితో ఒక వాగ్ధానం చేశాడు:

మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి.” (ఆది.కాం.9:1)

మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.” (ఆది.కాం.9:8-10)

దేవుని నైతిక గుణలక్షణాలు

దేవుడు ప్రేమాస్వరూపి

ప్రభువైన దేవుని నైతిక గుణలక్షణాలలో ప్రేమ అతి ప్రాముఖ్యమైనది. ఉత్కృష్టమైన ప్రేమ త్యాగముతో ముడిపడి వుంటుంది. కృపాకనికరాలు ప్రేమలోని రెండు విభాగాలు. పరమతండ్రి తన సహజ గుణలక్షణమైన ప్రేమను తన స్వరూపమందు తన పోలికచొప్పున తానే సృష్టించిన మానవులందరికి పంచేవాడు. ఆ కారణాన్నిబట్టే ఆయన మానవుల కొరకు సిద్ధపరచిన రక్షణ అన్నది ఏ కొద్దిమంది కొరకో సిద్ధపరచబడింది కాదు. అది అందరి కొరకు ఏర్పాటుచేయబడిన దేవుని బహుమానము:

అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను.” (ని.కాం.34:6-7)

అందుకు యెహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడి పోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే; అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా [חוּס/khoos = to pity; look upon with compassion]? అని యోనాతో సెలవిచ్చెను.” (యోనా.4:10-11)

ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై” (తీతుకు.2:11)

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను.3:16)

నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.” (1యోహాను.2:1-2)

కాబట్టి మీరు వెళ్లి, సమస్తజనులను [గ్రీకు మూల పదం: ἔθνος/ఎత్నోస్ = జాతి/ప్రజ/జనాంగము] శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు” (మత్తయి.28:19)

మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.” (మార్కు.16:15-16)

యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.” (రోమా.10:12)

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.” (రోమా.1:16)

మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?” (రోమా.9:23-24)

దేవుడు పక్షపాతి కాదు

దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనము [గ్రీకు మూల పదం: ἔθνος/ఎత్నోస్ = జాతి/ప్రజ/జనాంగము] లోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపో.కా.10:34-35)

దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పునొందుదురు.” (రోమా.2:11-12)

ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.” (అపో.కా.17:30)

ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు.” (1తిమోతి.2:3-4)

కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (2పేతురు.3:9)

ప్రభువైన దేవుని [అదొనై ఎలోహిం] యొక్క రక్షణతోకూడిన ఆశీర్వాదాల ప్రణాలిక కేవలం యూదులకు మాత్రమేగాక భూలోకములోని వంశాలన్నింటికి చెందినది:

నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు [హీబ్రూ మూలపదము: מִשְׁפָחָה/mishpawkhaw/మిష్పఖ = a clan/కుటుంబాల సమూహము/తెగ] నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా” (ఆది.కాం.12:3) = (అపో.కా.3:25-26)

అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ]. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును [גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] ఆశీర్వదింపబడును.” (ఆది.కాం.18:18)

మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని నములన్నియు [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] నీ సంతానమువలన [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.” (ఆది.కాం.22:18) = (గలతి.3:8)  “ఏలయనగా నీకును నీ సంతానమునకును [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఇచ్చెదను. నీ సంతానమువలన [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] సమస్త భూలోకములోని సమస్త జనులు [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ] ఆశీర్వదింపబడుదురు.” (ఆది.కాం.26:4) = (గలతి.3:16)

నీ సంతానము [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు [హీబ్రూ మూలపదము: מִשְׁפָחָה/mishpawkhaw/మిష్పఖ = a clan/కుటుంబాల సమూహము/తెగ] నీ మూలముగాను నీ సంతానము [זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] మూలముగాను ఆశీర్వదింపబడును.” (ఆది.కాం.28:14) = (ప్రకటన.7:9)

భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ] నీ రక్షణ తెలియబడునట్లును” (కీర్తన.67:2) = (తీతుకు.2:11)

యెహోవా తన రక్షణను వెల్లడిచేసి యున్నాడు అన్యజనుల [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ] యెదుట తన నీతిని బయలుపరచియున్నాడు.ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి.” (కీర్తన.98:2-4)

సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.” (యెషయా.52:10) = (లూకా.3:6)

విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను [נֵכָר/నెకార్] నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు [עַם/అం] ప్రార్థనమందిరమన బడును. ఇశ్రాయేలీయులలో వెలివేయబడినవారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికిపైగా ఇతరులను కూర్చెదను.” (యెషయా.56:6-8)

వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను [כָּל־ הַגּוֹיִ֖ם/కాల్ హగ్గోవ్యిం–హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] ఆయా భాషలు మాట లాడువారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనులయొద్దకును [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపెదను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదను వారు జనములలో [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చు చున్నాడు. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు [כָל־ בָּשָׂר/కాల్ బాసార్] వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా.66:18-23)  

అన్యజనుల ప్రవేశం

వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.” (ద్వి.కాం.32:21)

ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును. అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి కొందురు వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును. సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.” (యెషయా.19:19-25)

నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.” (యెషయా.65:1)

నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు.” (యెహెజ్కేలు.16:60-61)

తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతునుఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు.2:28 -32)

సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులోనుండి భక్తిహీనతను తొలగించును; నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.” (రోమా.11:25-27)

అబ్రహాము మరియు యూదులు

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] అబ్రహాము మానవులందరిలో గొప్పవాడని లేక ప్రత్యేకమైనవాడని లేక నీతిమంతుడని ఎన్నుకోలేదు. తన సార్వభౌమత్వము, చిత్తము, మరియు స్వాతంత్ర్యమును బట్టి అబ్రహామును ఎన్నుకున్నాడు. ప్రభువైన దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు గనుక అబ్రహాము గొప్పవానిగా మరియు ప్రత్యేకమైనవ్యక్తిగా మారాడు.      

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] అబ్రహామును ఎన్నుకోవడములోని ఉద్దేశము కేవలము అబ్రహామును మరియు ఆయన సంతానాన్ని [ఇశ్రాయేలీయులు/యూదులు] మాత్రమే ఆశీర్వదించాలని లేక రక్షించాలని కాదు. సర్వశరీరులకు దేవుడైన ప్రభువు తాను సృష్టించిన మానవులందరిని ఆశీర్వాదించి అందరిని రక్షించాలన్న బృహత్ప్రణాళికతో అబ్రహామును ఎన్నుకొని ఆయన సంతానముద్వారా తన బృహత్ప్రణాళికను నెరవేర్చ సంకల్పంచినట్లు లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా అబ్రహాము సంతానమును ఎన్నుకొని వారిపట్ల వ్యవహరించిన తన విధానముద్వార ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] తననుతాను మానవాళికి ప్రత్యక్షపరచుకోవటం జరిగింది. క్రింది లేఖనాలే యిందుకు సాక్ష్యం: 

నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు [హీబ్రూ మూలపదము: מִשְׁפָחָה/mishpawkhaw/మిష్పఖ = a clan/కుటుంబాల సమూహము/తెగ] నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా” (ఆది.కాం.12:3) = (అపో.కా.3:25-26)

అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ]. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును [גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] ఆశీర్వదింపబడును.” (ఆది.కాం.18:18)

మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] నీ సంతానమువలన [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.” (ఆది.కాం.22:18) = (గలతి.3:8)  

ఏలయనగా నీకును నీ సంతానమునకును [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఇచ్చెదను. నీ సంతానమువలన [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] సమస్త భూలోకములోని సమస్త జనులు [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ] ఆశీర్వదింపబడుదురు.” (ఆది.కాం.26:4) = (గలతి.3:16)

నీ సంతానము [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు [హీబ్రూ మూలపదము: מִשְׁפָחָה/mishpawkhaw/మిష్పఖ = a clan/కుటుంబాల సమూహము/తెగ] నీ మూలముగాను నీ సంతానము [זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] మూలముగాను ఆశీర్వదింపబడును.” (ఆది.కాం.28:14) = (ప్రకటన.7:9)

పై కారణాన్నిబట్టి యూదులు గొప్పవారని లేక ప్రత్యేకమైనవారని లేక నీతిమంతులని ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] వారిని ఎన్నుకోలేదు అన్నది ప్రస్పుటమవుతున్నది. ప్రభువైన దేవుడు వారిని ఎన్నుకోవటాన్నిబట్టి వారు ప్రత్యేకమైన ప్రజగా గొప్పవారిగా మారారు. అయితే శోచనీయమైన విశయం ఏమిటంటే యూదులు పదేపదే తమ తిరుగుబాటుతనముతో అవిశ్వాసముతో ప్రభువైన దేవునితో చేయబడిన నిబంధనను కాలరాచి తమ కివ్వబడిన ప్రత్యేకతను గొప్పతనాన్ని పోగొట్టుకున్నారు. దాని పర్యవసానమే ఇశ్రాయేలీయులు లేక యూదులు ప్రపంచములో చెదరగొట్టబడటము.      

యూదులు తమ దేశములోనుండి అన్యదేశాలలోకి చెదరగొట్టబడటము అన్నది చరిత్రలో రెండుసార్లు సంభవించిన సంఘటన. 586 క్రీ.పూ. లో మొదటిసారిగా బబులోనురాజు నెబుకద్నెజర్ యూదులను చెరపట్టి తీసుకువెల్లాడు. 70 సంవత్సరాల తరువాత యూదులు తిరిగి తమ దేశానికి రావడం మొదలైంది. అటుతరువాత రెండవసారిగా 70 క్రీ.శ. లో రోమా సైన్యాధిపతి టైటస్ ఆధ్వర్యములో యెరూషలేములోని దేవుని మందిరము ద్వంసము చేయబడి లక్షకు పైగా యూదులు ఊచకోతకు గురికాగా మిగతా యూదులు యితరదేశాలకు చెదరగొట్టబడ్డారు.  

రెండు పర్యాయాలు సంభవించిన యూదులు చెదరగొట్టబడటము అన్నది దేవుని సంకల్పములో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ సంఘటన యొక్క రెండు సందర్భాలమధ్య ఒక విశిష్టమైన ప్రవచన నెరవేర్పును చూస్తాము. అది వాగ్ధానము చేయబడిన మెస్సయ్య యొక్క మొదటి ఆగమనము!  

మెస్సయ్య

మెస్సయ్య అంటే అభిషిక్తుడు. పాతనిబంధన లేఖనాల బోధ ప్రకారం ప్రవక్తలు, యాజకులు, మరియు రాజులు అభిషేకించబడినవారై తమకివ్వబడిన పాత్రలలో బాధ్యతలను నిర్వర్తించేవారు.

పాతనిబంధన లేఖనాలు [తనాఖ్] రాబోవు మెస్సయ్య ఇశ్రాయేలీయుల వంశానికి మోషేవంటి ప్రవక్తగా విచ్చేయబోతున్నాడన్న సత్యాన్ని మోషే కాలములోనే ప్రకటించాయి (ద్వి.కాం.18:15-19). ఇంకా, ఆయన తన ప్రజలపక్షంగా ప్రయశ్చిత్తార్థ బలిగా తననుతానే అర్పించుకొని మృత్యుంజయుడై (యెషయా.52:13-53:12; దానియేలు.9:26-27) మెల్కీసెదెకు క్రమములో వారిని పవిత్రపరచబోతున్న యాజకుడని (కీర్తన.110:4), అంతమాత్రమేగాక తన ప్రజలైన యూదులతోపాటు భూలోకములోని జనులందరిని పాలించే రారాజు (యెషయా.9:6-7; జెకర్యా 9:9-11; మీకా.5:2) అన్నది లేఖనాలు నిర్ద్వంద్వంగా సాక్ష్యమిస్తున్నాయి.

పాతనిబంధన గ్రంథము లేక తనాఖ్ గ్రంథములోని లేఖనాలలో భవిష్యవాణిద్వారా వాగ్ధానము చేయబడిన మెస్సయ్య పాత్ర ఈరకంగా అభిషేకాలతో కూడిన మూడు పాత్రల సమిష్టి నెరవేర్పు అన్నది లేఖన బోధ.

దైవసుతుడైన మెస్సయ్యను పాతనిబంధన లేఖనాలు ‘దేవుని సేవకుడు,’ ‘దేవుని కుమారుడు,’ ‘దేవుని వాక్కు,’ ‘నిబంధన దూత’ అంటూ సందర్భానుసారంగా ప్రత్యేకమైన బిరుదులతో పేర్కొనడం గమనార్హమైన విశయం.   

మెస్సయ్య ప్రారంభములో ప్రవక్తగా దైవసందేశాన్ని బోధిస్తూ పరమతండ్రి నిర్ణయించిన సమయములో మానవాళి తరపున యాజకునిగా తన్నుతాను పాపపరిహారార్థబలిగా అర్పించుకున్నాడు. ఇది భూలోకపు చట్టాలను ప్రతిబింబిస్తూ ప్రభుత్వాల అధికారాన్ని నిర్ధారిస్తూ నెరవేర్చబడిన కార్యం ఎంతమాత్రము కాదు. ప్రభువైన దేవుని చట్టపరిధిలో ఆయన నిత్యసంకల్పాన్ని బట్టి ఆయన ఆధ్వర్యములో వాస్తవరూపం దాల్చిన రక్షణకార్యం!

మృత్యుంజయుడైన మెస్సయ్య పరమతండ్రి యొక్క నియామక కాలములోనే రాజుగా భూలోకమంతటిని పాలించటానికి తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయ!

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. జీవవృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.” (ప్రకటన.22:12-14)

Permalink to single post

‘యూదులు’ అంటే ఎవరు?

‘యూదుడు’ లేక ‘యూదులు’ అన్న పదం ‘యూదా’ అన్న హీబ్రూ నామవాచక పదములోనుండి వచ్చింది.

దేవుని స్నేహితుడుగా అలాగే విశ్వాసులకు తండ్రిగా పేరుప్రఖ్యాతులు పొందిన హెబ్రీయుడైన అబ్రహాముకు దేవుని వాగ్ధాన ఫలితంగా ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకు ఏశావు మరియు యాకోబు అనే యిరువురు కుమారులు జన్మించారు. వారిలో చిన్నవాడైన యాకోబును దేవుడు యెన్నుకొని ఆశీర్వదించాడు.

ఇశ్రాయేలు అనే పేరును పొందిన యాకోబుకు పన్నేండుమంది కుమారులు ఒక కుమార్తె జన్మించారు. యాకోబు లేక ఇశ్రాయేలు యొక్క పన్నెండుమంది కుమారులలోని నాలుగవకుమారుని పేరు యూదా.       

ఇశ్రాయేలు యొక్క పన్నెండుమంది కుమారుల సంతానము పన్నెండు గోత్రాలుగా విస్తరించింది. వీరందరిని అంటే పన్నెండు గోత్రాలలోని యాకోబు సంతానమంతటిని సర్వసాధారణముగా ‘ఇశ్రాయేలీయులు’ అంటూ బైబిలు పేర్కొంటుంది. 

రెండు రాజ్యాల ప్రారంభం

ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల సమిష్టి రాజ్యాన్ని పాలించిన చివరి రాజు సొలొమోను మరణము [930 క్రీ.పూ.]తరువాత ఇశ్రాయేలు రాజ్యము రెండు రాజ్యాలుగా అంటే ఉత్తరరాజ్యం మరియు దక్షిణరాజ్యంగా విడిపోయింది. పది గోత్రాలతో కూడిన ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలురాజ్యము అని రెండు గోత్రాలతో కూడిన దక్షిణ రాజ్యాన్ని యూదారాజ్యము అని పేర్కొంటారు. యూదా రాజ్యము ప్రధానంగా యూదా గోత్రము మరియు బెన్యామీను గోత్రము కలిపి ఏర్పరచబడినా వారితోపాటు లేవీయ గోత్రములోని కొందరు అలాగే షిమియోను గోత్రీకులు కొందరు కలిసారు. 

యూదా రాజైన ఆసా యేలుబడిలో [911-870 క్రీ.పూ.] ఉత్తర రాజ్యములోని ఎఫ్రాయిము, మనష్షే, మరియు షిమియోను గోత్రాలలోని అనేకమంది భక్తిపరులు వలసవచ్చి దక్షిణరాజ్యమైన యూదారాజ్యములో స్థిరపడ్డారు (2ది.వృ.15:9).     

రెండు రాజ్యాల చెఱ

722 క్రీ.పూ. లో ఉత్తరరాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యం అంటే పది గోత్రాల రాజ్యాన్ని అష్షూరీయులు జయించి ఆ గోత్రాలవారిని దాసులుగా తీసుకువెళ్ళారు. ఆ సందర్భములో కొందరు దక్షిణరాజ్యమైన యూదారాజ్యములోకి పారిపోవటము జరిగింది. మొదటి శతాబ్ధములో యెరూషలేములో ఆషేరు వంశములోనుండి వచ్చిన అన్న అను ఒక ప్రవక్తి యొక్క ఉనికి దీని పర్యవసానమేనని గ్రహించవచ్చు (లూకా.2:36-38). మరికొందరు ఉత్తర రాజ్యవాసులు అష్షూరీయులను తప్పించుకొని తమదేశములోనే జీవనం కొనసాగించారు. అయితే, అధిక సంఖ్యాకులు మాత్రం అష్షూరీయులచేతిలో బందీలుగా మారి వారికి దాసులుగా తీసుకువెళ్ళబడ్డారు. అలా వెళ్ళిన వారిలో అధికశాతం కాలక్రమంలో భూమి నలుమూలలకు చెదిరిపోవడం జరిగింది. 

ఉత్తర రాజ్యములోని ఇశ్రాయేలీయులను బందించి దాసులుగా తీసుకువెళ్ళిన అష్షూరీయులు ఉత్తర రాజ్య భూబాగమైన ఉత్తర పాలస్తీనా ప్రాంతములోకి తాము జయించిన అనేక అన్యజాతి ప్రజలను తెచ్చి స్థిరపరచారు. ఆ అన్యజాతులవారికి ఇశ్రాయేలు మతాన్ని బోధించేందుకు అష్షూరీయులు తాము దాసులుగా తీసుకువెళ్ళిన కొందరు లేవీయులను ఉత్తర పాలస్తీనాకు తిరిగి పంపించారు. ఈరకంగా తిరిగి వచ్చిన లేవియులు కాలక్రమములో పాలస్తీనాలో స్థిరపడిన అన్యజాతీయులను యూదామతములోకి మార్చారు (2రాజులు.17:24-41; ఎజ్రా.4:1-6). సమరయులు అలాంటివారికి చెందినవారే.            

586 క్రీ.పూ. లో దక్షిణరాజ్యాన్ని అంటే ప్రధానంగా యూదా మరియు బెన్యామీను గోత్రాలతో ఏర్పడినా కాలక్రమేణా మరికొన్ని యితర గోత్రాల వారికి కూడా ఆశ్రయముగా మారిన యూదారాజ్యాన్ని బబులోను రాజు నెబుకద్నెజరు జయించి అధిక సంఖ్యాకులను దాసులుగా బబులోనుకు తీసుకువెళ్ళాడు. వారిలోని ముఖ్యులు తిరిగి 444/5 క్రీ.పూ.లో తిరిగి తమ స్వదేశమైన యూదయకు వచ్చారు. 

దక్షిణ రాజ్యమైన యూదారాజ్యములోనివారు ప్రధానంగా పాలస్తీనాలోని యూదయ ప్రాంతవాసులు గనుక చెఱలోనున్నప్పుడు వారిని కల్దీయులు యూదులు అంటూ సంబోధించటం మొదలయ్యింది. కొంతకాలానికే ఆ ప్రాంతములోనుండి చెఱపట్టబడిన వచ్చినవారందరికి సమిష్టిగా యూదులు అన్న పేరు స్థిరపడిపోయింది.

యూదులు అన్న పేరుతో మొదట గుర్తించబడినవారు యూదా గోత్రపువారే అయినా కాలక్రమేణా వారితోపాటు బెన్యామీను గోత్రపువారు, లేవీయ గోత్రపువారు, షిమ్యోను గోత్రపువారు అలాగే ఆసా పరిపాలనలో ఉత్తర రాజ్యములోనుండి వలసవచ్చిన ఎఫ్రాయీము మరియు మనష్షే గోత్రపువారు అంతేగాక అష్షూరీయుల దాడినుండి తప్పించుకొని పారిపోయి వచ్చి దక్షిణ రాజ్యములో స్థిరపడిపోయిన ఉత్తర రాజ్యములోని పది గోత్రాల సంబంధికులుకూడా యూదా గోత్రపువారితో కలిసి యూదులుగా గుర్తించబడ్డారు.  

భావ విస్తరణ

445 క్రీ.పూ.లో బబులోను చెరలోనుండి విడిపించబడి తిరిగి స్వదేశమైన యూదయకు మరలివచ్చిన దక్షిణదేశవాసులను లేఖనాలు ఇశ్రాయేలీయులుగాకూడా గుర్తిస్తున్నాయి (ఎజ్రా.2:1-2, 70; 3:1; నెహెమ్యా.1:1-6; 7:73; 11:3, 20). ఈ నేపథ్యములో క్రమక్రమంగా ఇశ్రాయేలీయులు మరియు యూదులు అన్న పదాలు రెండు ఒకదానికొకటి పర్యాయపదాలుగా మారిపోయాయి అన్నది ప్రస్పుటమవుతున్నది.  

మొదటిశతాబ్దములో మెస్సయ్య ఆగమనానికల్లా యూదులన్నా ఇశ్రాయేలీయులన్నా ఒకే భావం వ్యక్తపరచబడేది. అందుకే మెస్సయ్య ‘యూదుల రాజు ‘ (మత్తయి.2:2; మార్కు.15:2) లేక ‘ఇశ్రాయేలు రాజు ‘ (మత్తయి.27:42; యోహాను.1:49; 12:13) అన్నది లేఖన బోధ. 

“ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి” (అపొ.కా.2:5). అపోస్తలుడైన పేతురు పెంతెకోస్తు దినాన యెరూషలేములో కాపురమున్న ఆ యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ పలికిన మాటలు (అపొ.కా.2:14-36):

యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్తజనులారా, యిది మీకు తెలియునుగాక…ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి…దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను…మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.

పేతురు పలికిన పై మాటలలో ఒకే భావాన్ని వ్యక్తపరచటానికి ‘యూదులు’ మరియు ‘ఇశ్రాయేలువారు’ అన్న రెండు పదాలను మార్చిమార్చి వాడటాన్ని గమనించవచ్చు. నిజానికి పేతురు తన ప్రసంగాన్ని యూదులను ఉద్దేశించి పలుకుతూ వారిని ఇశ్రాయేలువారలారా అంటూ కూడా సంబోధిస్తున్నాడు. కారణం? యూదులు అన్నా లేక ఇశ్రాయేలీయులు అన్న ఒకే భావం గనుక!  

కాలక్రమములో యూదులు అన్న పదప్రయోగము యొక్క భావము అంచెలంచెలుగా విస్తరించిన విధానము:

  • యూదా గోత్రపువారు
  • యూదా గోత్రము మరియు బెన్యామీను గ్రోత్రము
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము మరియు లేవి గోత్రము
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము, లేవీ గోత్రము మరియు షిమ్యోను గోత్రము
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము, లేవీ గోత్రము, షిమ్యోను గోత్రము మరియు ఎఫ్రాయీము మనష్షే గోత్రాలు
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము, లేవీ గోత్రము, షిమ్యోను గోత్రము, ఎఫ్రాయీము మనష్షే గోత్రాలు మరియు ఉత్తరరాజ్యములోని పది గోత్రాలలోనుండి వలసవచ్చిన పదిగోత్రాల శేషము
  • పన్నెండు గోత్రాలు లేక ఇశ్రాయేలీయులు

మెస్సయ్య ప్రజలు

మెస్సయ్య అయిన యషువ “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును” (మత్తయి.1:21). ఆయన ప్రజలు ఇశ్రాయేలీయులు లేక యూదులు. ఆ కారణాన్ని బట్టే ఆయన “ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్రెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకు నేను పంపబడలేదు” అని తన పరిచర్య యొక్క అర్దభాగములో ప్రకటించాడు (మత్తయి.15:24). అయితే, లేఖనాలు ఆయన “తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు” (యోహాను.1:11) అంటూ ఘోషిస్తున్నాయి. ఇందునిమిత్తమే చివరికి మెస్సయ్య యూదులతో/ఇశ్రాయేలియులతో తెగేసి ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది, “కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.” (మత్తయి.21:43).

ఈ నేపథ్యములో మెస్సయ్య తన మరణపునరుత్థానాలతదుపరి తన శిష్యులకు ఆజ్ఙాపించాడు: కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి (మత్తయి.28:19); మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి (మార్కు.16:15); యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడును (లూకా.24:47).             

ఇశ్రాయేలు ప్రజలలోని ఉత్తర రాజ్యనివాసులలో అధికశాతం ప్రజలు అష్షూరు రాజులచేత చెరపట్టబడి ప్రపంచ దేశాలన్నిటిలోకి చెదరగొట్టబడ్డారు. గత 2700 సంవత్సరాల కాలములో వారు తిరిగి తమ స్వదేశమైన ఉత్తర పాలస్తీనాకు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. అయితే, ప్రభువైన దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తలద్వారా వారిని తిరిగి తమ స్వదేశములో సమకూరుస్తాను అంటూ అనేక పర్యాయాలు వాగ్ధానము చేశాడు (యిర్మీయ.23:3; 31:7-8; 32:37; యెషయా.11:11-12,16). ఈ వాగ్ధానాల నెరవేర్పు మెస్సయ్య యొక్క రెండవ రాకడ సందర్భములో నెరవేర్చబడబోతున్నాయి. 

సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును; నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.” (రోమా.11:25-27)