Category Archives: మెస్సయ్య

Permalink to single post

మెస్సయ్య: దేవుని మర్మము

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] నరుడు. కాని, ఆయన  కేవలం ఒక నరుడు మాత్రమే అయితే వచ్చే సమస్యలు:

i. పాపులలో ఒకనిగా అయ్యుండేవాడు [1రాజులు.8:46; కీర్తన.14:2-3; 143:2; ప్రసంగి.7:20; రోమా.3:23; 5:12]

ii. దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండగలిగేవాడు కాదు [1సమూయేలు.2:25; యోబు.9:32-33; కీర్తన.49:7-9; యెహెజ్కేలు.14:14,20;]

iii. ఒక్క మానవున్నికూడా రక్షించలేకపోయేవాడు [కీర్తన.49:7-9] 

iv. మానవ జన్మకు ముందు ఉనికిని కలిగి ఉండేవాడు కాదు [మీకా.5:2; యోహాను.3:13; 6:38, 46, 51, 62; 8:23, 58; హెబ్రీ.7:3, 10:5; 1యోహాను.1:1-2; ]

v. దేవుని మందిరముకన్నా గొప్ప స్థానాన్ని కలిగివుండేవాడు కాదు [మత్తయి.12:6] 

vi. దేవునిగా గుర్తించబడేవాడు కాదు [యోహాను.1:1,14, 20:28; హెబ్రీ.1:8]

vii.దేవునికి చెందిన ఘనత, ఆరాధన అందుకునేవాడు కాదు [మత్తయి.28:9,17; ప్రకటన 5:8-14]

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] నరుడు. అయితే, అంతేగాక ఆయన అదే సమయములో క్రిందివన్నీకూడా అన్నది మరువకూడదు:

i. దేవుని రూపం [*μορφή/మోర్ఫె = form (ఫిలిప్పీ.2:6)] 

ii దేవుని ప్రతిరూపం [+εἰκών/ఎయికోన్ = image (2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15)]

iii దేవుని శక్తి [1కొరింథి.1:24] 

iv. దేవుని జ్ఙానం [1కొరింథి.1:24]

v. దేవుని వాక్కు [యోహాను.1:1,14]

vi. దేవుని మహిమాతేజస్సు [హెబ్రీ.1:3]

vii.దేవుని కుమారుడు [సామెతలు.30:4; యోహాను.3:16; 1యోహాను.3:8] 

ఒకే వ్యక్తిలో కేంద్రీకృతమైయున్న పై విభిన్న వాస్తవాల సమాహారాన్నిబట్టి క్రీస్తుగా వచ్చిన యేసు దేవుని మర్మమై [μυστήριον/ముస్టెరిఒన్ = mystery] యున్నాడు:

నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.” (కొలొస్సీ.2:1). 

ఈ లేఖన సత్యాన్ని గ్రహించటానికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం (1కొరింథి.2:14). దేవుని సంబంధులైనవారు పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్న గ్రహింపులో ఎదుగుతున్న తరుణములో తమ గ్రహింపుకు అతీతమైన లేఖన సత్యాలను తిరస్కరించక మరియు తప్పుబట్టక విశ్వాసముతో స్వీకరించగలుగుతారు.

పై లేఖనాల వెలుగులో నిజవిశ్వాసులు, దైవసంబంధులు ప్రభువైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యెడల సరియైన దృక్పథాన్ని కలిగి వుండటమేగాక ఆయనను వాక్యాధారమైన విధానములోనే ఘనపరచగలరు.

ఈ సందర్భంగా నిజీవిశ్వాసులు జ్ఙాపకముంచుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విశయం, తండ్రిని ఒకవిధంగా కుమారుని మరొకవిధంగా ఘనపరచమన్నది లేఖన బోధ కాదు అన్న సత్యం. తండ్రిని ఏవిధంగా ఘనపరచాలో అదేవిధంగా కుమారుని ఘనపరచాలి అన్నది లేఖనము యొక్క సుస్పష్టమైన బోధ మరియు ఆజ్ఙ. ఈ ఆజ్ఙను అతిక్రమించినవాడు తండ్రిని అగౌరపరచినవాడవుతాడు. అలాంటివాడే దుర్బీజుడు మరియు క్రీస్తు/మెస్సయ్య విరోధి:

తండ్రిని ఘనపరచునట్లుగా [καθὼς/కాతొస్ = same as; just as; even asఅందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.” (యోహాను.5:23)

గమనిక:
*మోర్ఫె [μορφή] = రూపం [form]; ఆకారం [shape]; బయటికి అగుపడునది [outword appearance]:

  • బయటికి అగుపడునది [outword appearance] మర్కు.16:12 
  • రూపం [form] ఫిలిప్పీ.2:6
  • ఆకారం [shape] ఫిలిప్పీ.2:7

+ఎయికోన్ [εἰκών] = బొమ్మ/చిత్రము/చిహ్నం [ikon]; ప్రతిబింబము/ప్రతిరూపం [image]; ప్రాతినిథ్యము [representation]:

  • బొమ్మ/చిత్రము/చిహ్నం [ikon] మత్తయి 22:20; రోమా.1:23; ప్రకటన.13:14
  • ప్రతిబింబము [image] 2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15
  • ప్రాతినిథ్యము [representation] రోమా.8:29; 1కొరింథీ.11:7, 15:49; 2కొరింథీ.3:18; కొలొస్సీ.3:10 
Permalink to single post

మెస్సయ్య మరణం: క్రైస్తవేతరుల కొరకైన వివరణ

సృష్టికర్త మహోన్నత నామములో మీకు శుభము, సమాధానము, సత్యము, మోక్షము కలుగును గాక!

ప్రపంచములోని క్రైస్తవులు ముఖ్యముగా సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలును [పాతనిబంధన గ్రంథాలు + క్రొత్తనిబంధన గ్రంథాలు] విశ్వసించే వారు బైబిలులోని సందేశాన్ని ఆధారం చేసుకొని ప్రతి సంవత్సరము ఏప్రెలు మాసములో రెండు దినాలను ప్రత్యేకమైన దినాలుగా గుర్తించి వాటిని శ్రద్ధాభక్తులతో గడుపుతుంటారు. 

ఈ రెండు దినాలు ప్రభువైన యేసు క్రీస్తు [యషువ హ మషియాఖ్] వారి శ్రమలతోకూడిన మరణమును అటుతరువాత ఆయన పునరుత్థానమును అంటే మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచిన సందర్భాలను పురస్కరించుకొని జరుపుకునే దినాలు. 

నిజానికి యేసు [యషువ] ప్రభువు యొక్క ఘోర మరణము మానవాళి ప్రాయశ్చిత్తార్థము అంటే మానవుల పాపాలను క్షమించే ప్రక్రియకు ఆధారభూరితంగా వుండేందుకై సృష్టికర్త తానే నిర్వర్తించిన కార్యం అన్నది బైబిలు బోధ యొక్క సారాంశము.     

అయితే, యిక్కడ క్రైస్తవేతరులకు మూడు రకాల ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజం. 

మొదటి రకానికి చెందిన ప్రశ్నలు ఇలా వుంటాయి:

ఇది అవసరమా?
సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త సర్వశక్తిమంతుడు. ఆయనే సర్వాధికారి, సార్వభౌముడు. మానవులను క్షమించాలనుకున్నా లేక శిక్షించాలనుకున్నా దాన్ని ఆయన తక్షణం నిర్వర్తించగలడు. ఆయనను ప్రశించే వారెవరూ లేరు. అలాంటి సృష్టికర్త యేసు క్రీస్తు లేక యషువ మషియాఖ్ వారి ఘోరమరణాన్ని ఆధారం చేసుకొనే మానవులను క్షమించాలా?
ఒక పాపిని క్షమించటానికి సృష్టికర్తకు ఈసా వారి మరణం ఆవశ్యకమా?
ఆయన మరణం లేకపోతే సృష్టికర్త పాపులను క్షమించే స్థితిలో లేడా? 

రెండవ రకానికి చెందిన ప్రశ్నలు వచ్చేసి యిలావుంటాయి:

ఇది న్యాయమా?
ఒక పాపిని దుష్టుని అపరాధిని కాపాడటానికి ఒక అమాయకుని నీతిమంతుని నిరపరాధిని శిక్షించటమన్నది న్యాయమేలా అవుతుంది?
అలాంటి విధానాన్ని లోకములోని ఏ చట్టమైనా లేక న్యాయవ్యవస్థ అయినా ఒప్పుకోదే! అందరికంటే అత్యున్నతమైన న్యాయవర్తనుడుగా వున్న సృష్టికర్త పాపులైన మానవులను క్షమించటానికి పరిశుద్దుడు ఏపాపమెరుగని మెస్సయ్య వారిని ఘోరంగా శిక్షించటమన్నది ఏరకంగా న్యాయమవుతుంది? 

ఇక మూడవ రకానికి చెందిన ప్రశ్నలగురించి అలోచిస్తే అవి యిలా వుంటాయి:

ఇది పాపాన్ని సమర్దించటము కాదా?
తప్పు చేసినవారికి శిక్షవిధించకపోగా వారి స్థానములో నీతిమంతుని శిక్షించటమన్నది గొప్ప అన్యాయమన్నది అటుంచి, అలాంటి విధానమన్నదే తప్పుచేసినవారిని సమర్ధించి వారిని పాపములో కొనసాగటాన్ని పురికొల్పుతుంది, కాదా?
అది పాపము చేయటానికి  ఫ్రీప్యాస్ ను అందించటములాంటిదే కదా?
ఆవిధానములో క్షమాపణను అందుకున్న వ్యక్తులు యిక పాపము చేయటానికి భయపడక పోగా పైపెచ్చు యింకా ఘోరమైన పాపాలను చేయటానికి ప్రయత్నించరా?      

ఈ వ్యాసంద్వారా నేను ఈ ప్రశ్నలకు విస్పష్టమైన జవాబులను మీముందు వుంచబోతున్నాను. అయితే, ముందస్తుగా సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు ప్రబోధాల ప్రకారము సృష్టికర్తకున్న ప్రధాన గుణలక్షణాలు ఏవి? మానవజాతికి ప్రాప్తించిన విపత్తు ఏమిటి? యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యొక్క ఘోర మరణానికున్న ఆంతర్యమేమిటి? అన్న మూడు ప్రాముఖ్యమైన అంశాలను వివరిస్తాను. ఆ వివరణ వెంటనే క్రైస్తవేతరుల ప్రశ్నలకు జవాబులను మీముందుంచబోతున్నాను.

బైబిలులో తననుతాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్తకు అనేక గుణలక్షణాలున్నయి. వాటిలొ ప్రధామైనవి మూడు నైతిక గుణలక్షణాలు. అవి, పరిశుద్ధత, న్యాయతత్వం, ప్రేమ. 

మొదటిది పరిశుద్ధత అనే గుణలక్షణం. ఇది అనేక కోణాలలో వ్యక్తీకరించబడింది. ప్రత్యేకత, పవిత్రత, సంపూర్ణత, ఆత్మీయ వెలుగు మొదలైన కోణాలు మచ్చుకు కొన్ని. ఈ గుణలక్షణాని బట్టి అపవిత్రతకు అసంపూర్ణత్వానికి అలాగే ఆత్మీయ అంధకారముతోకూడిన వాటికి లేక వ్యక్తులకు సృష్టికర్త సన్నిధిలో ఎలాంటి స్థానం లేదు. 

రెండవది న్యాయతత్వం అనే గుణలక్షణం. ఈ గుణలక్షణాన్నిబట్టి సృష్టికర్తలో పక్షపాతానికి తావులేదు. మంచికి ఈవులను చెడుకు శిక్షను అందించటమన్నది న్యాయతత్వానికున్న ఒకానొక ప్రధాన లక్షణం. సృష్టికర్త న్యాయవ్యవస్థలో నిజమైన పశ్చత్తాపానికి క్షమాపణ వుంది. అయితే, దాన్ని పొందటానికి చేయబడిన చెడుకు కేవలము పశ్చత్తాపపడితే సరిపోదు. పశ్చత్తాపముతోపాటు జరిగిన నష్టానికి తగిన వెల చెల్లించడముద్వారానె సాధ్యపడుతుంది. [సం.కాం.5:5-8]      

దేవుని న్యాయవ్యవస్థలో క్షమాపణ అన్నది పాపాన్ని పట్టించుకోకపోవడంద్వారానో లేక దాన్ని దాచిపెట్టడంద్వారానో లేక దాన్ని అమోదించడంద్వారానో కలుగదు; అది కేవలం పాపముద్వారా సంభవంచిన నష్టానికి తగిన వెలచెల్లించటముద్వారానే కలుగుతుంది. ఆ వెలను ఆ పాపాన్ని చేసిన వ్యక్తి అయినా చెల్లించాలి లేక ఆవ్యక్తి పక్షంగా పాపరహితుడైన మరొక వ్యక్తి అయినా స్వచ్ఛందంగా చెల్లించాలి. [యెషయా.53:8-11] 

ఇక మూడవ గుణలక్షణం ప్రేమ. ఈ గుణలక్షణానికి అనేక విభాగాలు వున్నాయి. అందులో ఒకటి తననుతాను అర్పించుకోవటం. ప్రేమ యొక్క అత్యుత్తమ వ్యక్తీకరణ అన్నది స్వీయత్యాగం ద్వారానే సాధ్యపడుతుంది. సృష్టికర్త యొక్క ప్రేమాతత్వం ఊహాతీతమైనది. అత్యుత్తమమైన అత్యున్నతమైన ప్రేమకు ఆయనే ప్రతిరూపం. 

ఇక మానవులకు ప్రాప్తించిన విపత్తుగురించి చూస్తే సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు వివరణప్రకారము మానవులు ఆలోచనలద్వారా, మాటలద్వార, క్రియలద్వారా అపవిత్రతను దుర్నీతిని సంపాదించుకొని పరిశుద్ధుడైన సృష్టికర్తకు వ్యతిరేకమైన దిశలో జీవిస్తూ ఆయన సన్నిధిలోకి వెళ్ళే అర్హతను కోల్పోయారు. అంతమాత్రమేగాక సృష్టికర్త యొక్క న్యాయతత్వాన్నిబట్టి తమ చెడు జీవితానికి తగిన ఫలాన్ని/శిక్షను పొందబోతున్నారు. ఇది పరిశుద్ధుడైన సృష్టికర్త సన్నిధికి దూరంగా ఆయా వ్యక్తులకు వారివారి పాపాలకు తగిన మోతాదులోనే అమలుకాబోతున్న ప్రక్రియ.    

చివరగా యేసు [యషువ] ప్రభువు పొందిన ఘోర మరణము యొక్క పరమార్థం ఏమిటి అని ఆలోచించాలి. బైబిలు వివరణ ప్రకారం తమ అపవిత్రతచేత దుర్నీతిచేత పరిశుద్ధుడు న్యాయవంతుడు అయిన సృష్టికర్త సన్నిధిలోకి ప్రవేశించే అర్హత కోల్పోయి నిత్యశిక్షకు పాత్రులయ్యారు మానవజాతి అంతా. అయితే, ప్రేమతత్వమనే నైతిక గుణలక్షణాన్ని కలిగివున్న సృష్టికర్త మానవులందరిని ప్రేమించేవాడు కనుక మానవులకు దాపురించిన విపత్తులోనుండి కాపాడి వారికి పరిశుద్ధతను నీతిని ఆపాదించి తద్వారా వారు తన సన్నిధిలో నిత్యమోక్షాన్ని అనుభవించే భాగ్యాన్ని పొందేందుకు వీలైన ప్రణాలికను విరచించాడు.

ఆ ప్రణాలికలో భాగంగా ఒకవైపు తన న్యాయతత్వాన్ని తృప్తిపరచే వెలను చెల్లించి మరొకవైపు తన పరిశుద్ధత ఆశిస్తున్న స్థాయిలో నీతిని సిద్ధపరిచి మానవాళికి మోక్షప్రాప్తిని అందుబాటులోకి తెచ్చాడు. మానవులకసాధ్యమైన ఈ రెండింటిని తన అంశతో ఈలోకములో జన్మించిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యొక్క జీవితం, శ్రమలు, మరియు మరణాలద్వారా సాధించి పెట్టాడు. ఇందులో సృష్టికర్త యొక్క స్వీయత్యాగం వుంది. ఇది మానవాళిపట్ల సృష్టికర్త చూపిన ప్రేమాత్యాగం!  

ఇదంగా వాస్తవంగానే మానవాళి రక్షణకొరకు సృష్టికర్త తానే స్వయంగా ఏర్పాటు చేసిన బృహత్ప్రణాళిక అన్నదానికి తిరుగులేని ముద్రగా యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మానవాళి కొరకైన పాపప్రయశ్చిత్తార్థ మరణము పొంది అటుతరువాత అంతకు ముందు అనేక పర్యాయాలు తానే స్పష్టీకరించిన విధంగా మూడురోజులలో మరణాన్ని జయించి తిరిగి సజీవుడుగా లేచాడు!
[మత్తయి.17:22-23; 28:1-20; మార్కు.9:31; 16:1-20; లూకా.18:31-33; 24:1-53; యోహాను.10:18; 20:1-31]

అపవిత్రతతో దుర్నీతితో వున్న ఏ వ్యక్తి అయినా తన దుస్థితిని గుర్తించి పశ్చత్తాపహృదయముతో మానవాళియెడల సృష్టికర్త యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] నందు నెరవేర్చిన ప్రేమాత్యాగాన్ని విశ్వసించి ఆయనను క్షమాపణ వేడుకుంటే ఆ వ్యక్తి ఆంతర్యములో తిరిగి జన్మించినవాడై మోక్ష ప్రాప్తిని పొందగలడు. అలాంటివ్యక్తి ఈ లోకములో క్రొత్త జీవితాన్ని ప్రారంభించి క్రొత్త స్వభావములో ఎదుగుటకు మొదలుబెడుతాడు.  

ఇక ఈ అంశానికి సంబంధించి క్రైస్తవేతరులకు వచ్చే ప్రశ్నలను గురించి ఆలోచిద్దాం.

మొదటి రకానికి చెందిన ప్రశ్న. 

సృష్టికర్త సార్వభౌముడు గనుక మానవులను క్షమించి మోక్షాన్ని ప్రసాదించటానికి ఆయనకు అడ్డేమిటి? ఇందుకుగాను యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] లోకములోకి రావటము, శ్రమలను అనుభవించటము, మరణించటము, తిరిగిలేవటము అనే సుధీర్ఘ ప్రణాళిక యొక్క ఆవశ్యకత సృష్టికర్తకు వుందా?

సంపూర్ణదైవగ్రంథమైన బైబిలు బోధ ప్రకారము వుంది! ఎందుకంటే…

ఒక పాపిని క్షమించి మోక్షాన్ని అనుగ్రహించటమన్నది తనకున్న సార్వభౌమత్వముద్వారా సృష్టికర్త చేయగలడు అని భావిస్తే అదే కారణాన్నిబట్టి ఆయన ఏపాపమెరుగని ఒక నీతిమంతుని శిక్షించి నరక ప్రాప్తుని చేయగలగాలి. అలాంటి ప్రవృత్తి చపలచిత్తానికి మరియు అన్యాయానికి తిరుగులేని నిదర్శనం. ఈ దుర్గుణాలు సృష్టికర్తకు వుండవు వుండకూడదు.        

నిజమైన సృష్టికర్త పాపులైన మానవులను కాపాడి మోక్షాన్ని అనుగ్రహించాలన్న ప్రేమ తపనను కలిగినవాడు గనుక ఆయన ఆ కార్యాన్ని పరిశుద్ధత మరియు న్యాయతత్వం అనే తన ప్రవృత్తులకు వ్యతిరేకంగా కాకుండా వాటి పరిధులలోనే సాధించటానికి సుధీర్గమైన ప్రణాళిక అవసరత వుంది. ఆ ప్రణాళికలో భాగంగా మానవుల పాపాల ఫలితమైన నష్టానికి తగిన వెలను తానే చెల్లించి తన న్యాయతత్వాన్ని తృప్తిపరచాడు. అది ప్రభువైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] వారి శ్రమలతోకూడిన మరణములో నెరవేర్చబడింది. 

రెండవ రకానికి చెందిన ప్రశ్న.

పాపులను తప్పించటానికి ఏపాపమెరుగని నీతిమంతుడైన యేసు[యషువ]ను శిక్షించటము అన్యాయం కాదా?

నిజానికి ఒక అపరాధిని శిక్షనుంచి తప్పించటానికి ఒక నిరపరాధిని శిక్షకు గురిచేయటమన్నది నిరాపేక్షంగా అన్యాయమే. అయితే పాపులను రక్షించే ప్రణాళికలో భాగంగా యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యొక్క శ్రమలతో కూడిన మరణముద్వారా సృష్టికర్త జరిగించిన కార్యం అలాంటిది కాదు. దైవాంశసంభూతుడైన యేసు క్రీస్తు [యషువ హ మషియాఖ్] దైవ ప్రణాళికలోని ప్రతిక్షేపణా [substitution] పాత్రను పోశించి మానవులకు విమోచనను సంపాదించి వారు మోక్షాన్ని పొందే మార్గాన్ని సుగమం చేయటానికి తన యిచ్చపూర్వకంగా వచ్చాడు. మరోవిధంగా చెప్పలంటే మానవుల పాపాలకు తగిన శిక్షను విధించింది ఆయనే, ఆ శిక్షకు తగిన వెలను చెల్లించింది కూడా ఆయనే!   

మూడవ రకానికి చెందిన ప్రశ్న.

ఇది పాపాన్ని సమర్దించి దుష్టులు దుర్మార్గములోనే కొనసాగటాన్ని ప్రోశ్చహించటము కాదా?  

ఏభేదం లేకుండా ఏనియమం లేకుండా చేసిన పాపాలకు ఎవరు ఏవెల చెల్లించకుండానే పాపులందరిని ఏకపక్షంగా క్షమించి మోక్షం ప్రసాదిస్తే తప్పకుండా అది పాపాన్ని సమర్దించి దుష్టులు దుర్మార్గములోనే కొనసాగటాన్ని ప్రోశ్చహించటమవుతుంది. కాని, యషువ మషియాఖ్ [యేసు క్రీస్తు] నందు సృష్టికర్త నిర్వర్తించిన రక్షణకార్యం అన్నది అలాంటిది ఎంతమాత్రము కాదు.

తమ దుర్నీతిని అపవిత్రతను గుర్తించి పశ్చత్తాపపడి తమ స్వంతనీతిపై లేక భక్తిపై ఆధారపడకుండా యషువ మషియాఖ్ [యేసు క్రీస్తు] నందు సృష్టికర్త తానే నిర్వర్తించిన రక్షణకార్యమందు విశ్వాసముంచి ఆయనను క్షమాపణ వేడుకున్న పాపులకు మాత్రమే క్షమాపణ మోక్షము.

ఆరకంగా దైవానుగ్రహాన్ని పొందిన వ్యక్తులు క్రొత్త జీవితాన్ని సృష్టికర్తకు అంగీకారమైన రీతిలో ఆయన ఆత్మసహాయముతో జీవిస్తూ ఆయన లేఖనాలైన బైబిలు [పాతనిబంధన గ్రంథాలు + క్రొత్తనిబంధన గ్రంథాలు] వెలుగులో కొనసాగాలి.   

Permalink to single post

మెస్సయ్యనందు అన్యులు పొందే మేలు

ప్రభువైన దేవుడు [అదోనాయ్ ఎలోహిం] నరులందరిని ఒకే స్వరూపమందు ఒకే పోలిక చొప్పున సృష్టించి వారందరికి ఒకే అశీర్వాదాన్ని అధికారాన్ని అనుగ్రహించి వారందరితో ఒకే సార్వత్రిక నిబంధనను కూడా చేశాడు. ఆయన అందరికీ దేవుడు మరియు నాధుడు. ఆయనలో పక్షపాతం లేదు. అందుకే అందరినీ ప్రేమించి ఎవరూ నశించడం యిచ్చయించక అందరు మారుమనస్సు పొంది రక్షించబడాలని ఉద్దేశిస్తున్నాడు. అంతమాత్రమేగాక మెస్సయ్య అయిన యషువనందు అందరికి చాలిన రక్షణను సిద్ధపరచి దాన్ని అందరికి కేవలం విశ్వాసదూరములోనే వుంచాడు.  

“దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.” (ఆది.కాం.1:26-28)

“ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను; మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.” (ఆది.కాం.5:1-2) 

“నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆది.కాం.9:6)

“దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.” (యాకోబు.3:9)

“మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతికప్పగింపబడి యున్నవి.” (ఆది.కాం.9:1)

“మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.” (ఆది.కాం.9:8-10)

“కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో యిట్లనెను సర్వలోకనాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక” (యెహోషువ.3:9-10) 

సర్వలోకనాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.”(యెహోషువ.3:13)

“సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కు దువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.” (మీకా.4:13) 

“అతడు నాతో ఇట్లనెనుఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.” (జెకర్యా.6:5)

“వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి.” (సం.కాం.16:22)

“అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము.” (సం.కాం.27:15)

“నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.” (యెషయా.54:5)

“నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?” (యిర్మీయా.32:27)

దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనము [గ్రీకు మూల పదం: ἔθνος/ఎత్నోస్ = జాతి/ప్రజ/జనాంగము] లోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపో.కా.10:34-35)

దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పునొందుదురు.” (రోమా.2:11-12)

“ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.” (అపో.కా.17:30)

“ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు.” (1తిమోతి.2:3-4)

“కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (2పేతురు.3:9)

“ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై” (తీతుకు.2:11)

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను.3:16)

“నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.” (1యోహాను.2:1-2)

“కాబట్టి మీరు వెళ్లి, సమస్తజనులను [గ్రీకు మూల పదం: ἔθνος/ఎత్నోస్ = జాతి/ప్రజ/జనాంగము] శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు” (మత్తయి.28:19)

“మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.” (మార్కు.16:15-16) 

యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.” (రోమా.10:12)

“సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.” (రోమా.1:16)

“మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?” (రోమా.9:23-24)

« Older Entries