Category Archives: యూదుమతస్తుల ప్రశ్నలు

Permalink to single post

యూదుమతస్తుల ప్రశ్నలు-10

ధర్మశాస్త్రము నిత్యమైనది- శాశ్వతమైనది???

??2రాజులు 17:37: మరియుఇతర దేవతలను పూజింపక మీరు బ్రదుకు దినములన్నియు మోషే మీకు వ్రాసియిచ్చిన కట్టడలను విధులను, అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను.

??ద్వితియోపదేశకాండము 7:11: కాబట్టి నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము, అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచు కొనవలెను.

??ద్వితియోపదేశకాండము 6: 2

నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్ని టను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవు డైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్ట డలు విధులు ఇవే.

??ద్వితియోపదేశకాండము 6: 17

మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను.

??ద్వితియోపదేశకాండము 6: 25

మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనునప్పుడు మనకు నీతి కలుగును.

????????

????కీర్తనలు 111: 7

ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి.

?కీర్తనలు 111:8: అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి.

??కీర్తనలు 119:142: నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.

??కీర్తనలు 119:144: నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.

??కీర్తనలు 111:3: ఆయన కార్యము మహిమా ప్రభావములుగలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.

కీర్తనలు 111:9: ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించు వాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.

కీర్తనలు 119:152: నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను.

??కీర్తనలు 119:160: నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.

????????

??ద్వితియోపదేశకాండము 4: 2

మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు

??ద్వితియోపదేశకాండము 12: 32

నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు

??సామెతలు 30: 6

ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.

క్రైస్తవ సమాధానాలు

ఈ సందర్భంగా గుర్తుంచుకోవలసినవి:

అంశము#1

మోషేద్వారా యివ్వబడిన ధర్మశాస్త్రము ప్రధానంగా ఇశ్రాయేలీయులు అనుసరించాల్సిన ఆజ్ఙలు, విధులు, బలులు, నైవేధ్యాలు, ఆచారాలు మొదలైనవి మోషేద్వారా చేయబడిన నిబంధనలోని భాగాలు.

బైబిలులో “నిత్య నిబంధన” [עוֹלָֽם׃ בְּרִ֣ית/బ్రిథ్ ఓలాం] అన్న పదజాలానికి ప్రత్యేకత వుంది. అది దేవుని సుధీర్ఘకాల వుద్ధేశాన్ని సూచిస్తుంది. ఈ పదజాలము బైబిలులో కొన్ని నిబంధనలకే యివ్వబడింది. అందులో కొన్ని:

  • నోవహునిబంధన ‘నిత్యనిబంధన’ —עוֹלָֽם׃ בְּרִ֣ית/బ్రిథ్ ఓలాం (ఆది.కాం. 9:16)
  • అబ్రహామునిబంధన ‘నిత్యనిబంధన’ —עוֹלָֽם׃ בְּרִ֣ית/బ్రిథ్ ఓలాం (ఆది.కాం.17:7,19; 1దిన.వృ.16:15-18; కీర్తన.105:8-12)
  • దావీదునిబంధన ‘నిత్యనిబంధన’ —עוֹלָֽם׃ בְּרִ֣ית/బ్రిథ్ ఓలాం (2సమూయేలు.23:5)
  • క్రొత్తనిబంధన ‘నిత్యనిబంధన’–עוֹלָֽם׃ בְּרִ֣ית/బ్రిథ్ ఓలాం (యెషయా.55:3, 61:8; యిర్మీయ.32:37-40; యెహెజ్కేలు.16:60, 37:26)

మోషేనిబంధనకు ‘నిత్యనిబంధన’ [עוֹלָֽם׃ בְּרִ֣ית/బ్రిథ్ ఓలాం] అన్న పదజాలము లేఖనాలు ఎక్కడా అన్వయించలేదు.

పై కారణాన్ని బట్టి మోషేనిబంధనలోని భాగంగా యివ్వబడిన మోషేధర్మశాస్త్రముకూడా అంటే ఇశ్రాయేలీయులు అనుసరించాల్సిన ఆజ్ఙలు, విధులు, బలులు, నైవేధ్యాలు, ఆచారాలు మొదలైనవి నిత్యమైనవి కావు. అవి నిత్యమైనవి మరియు శాశ్వతమైనవి అని లేఖనాలు ఎక్కడా ప్రకటించటము లేదు. అయినా అలా భావించి, విశ్వసించి, ప్రకటించటమన్నది లేఖనవిరుద్ధం మరియు దైవవిరుద్ధం!

అంశము#2

పాతనిబంధనలో [తనాఖ్] ఉపయోగించబడిన హీబ్రూ భాషా పదము ఓలాం [עוֹלָם/olam] కున్న అర్థాలు–నిత్యము, చిరకాలము, సుధీర్ఘకాలము, తరమంతా. అయితే, ఈ పదానికి ‘అంతము లేని’ [నిరంతరము] అన్న భావము లేదు. క్రింది లేఖనాలను పరిశీలిస్తే ఆ విశయము ద్యోతకమవుతుంది:

వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసికొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము (עוֹלָם/ఒలం) వానికి దాసుడైయుండును.” (నిర్గ.కాం.21:6)

మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా (עוֹלָם/ఒలం) మీకు దాసులగుదురు” (లేవీ.కాం.25:45-46)

పూర్వదినములను (עוֹלָם/ఒలం) జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును; నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు.” (ద్వి.కాం.32:7)

ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు (עוֹלָם/ఒలం) నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.” (కీర్తన.73:12)

ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మ యాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని (עוֹלָם/ఒలం) పాడుగాను ఉండజేసెదను.” (యిర్మీయా.25:9)

గమనిక: పై లేఖనాలు హీబ్రూ పదమైన ఓలాం (עוֹלָם/olam) ‘అంతములేని కాలము’ను సూచించటము లేదు అన్నది సుస్పష్టము.

వివరణలు

2రాజులు 17:37 “మరియుఇతర దేవతలను పూజింపక మీరు బ్రదుకు దినములన్నియు మోషే మీకు వ్రాసియిచ్చిన కట్టడలను విధులను, అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను.”

అవును. మోషేద్వారా యివాబడిన ధర్మశాస్త్రాన్ని అంటే గమనించాలి వ్రాసియిచిన ధర్మశాస్త్ర ధర్మమంతా ఇశ్రాయేలీయులు అనుసరించాలి. పై వాక్యములో గమనించాలిసించ అంశాలు:

(1) ధర్మశాస్త్రమంతా అంటే అరకొర అని కాదు. లేక నచ్చినవి వీలైనవి సాధ్యమైనప్పుడు మాత్రమే అని కూడా కాదు! అంతా అన్ని వేళలా
(2) మౌఖికధర్మశాస్త్రము కాదు, వ్రాసియిచ్చిన ధర్మశాస్త్రము! మోసపోకుడి, మౌఖికధర్మశాస్త్రము లేక మౌఖిక తోరాహ్ [Oral Torah] అన్నది రబ్బీల స్వంత సృష్టి!

ద్వితియోపదేశకాండము 7:11: “కాబట్టి నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము, అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచుకొనవలెను.”

అవును. తన ఎదుట నిలిచియున్న ఇశ్రాయేలీయులను వారి భావితరాలను మోషే తాను యిస్తున్న ధర్మశాస్త్రము ప్రకారము నడుచుకోవాలి అన్నది వివరిస్తున్నాడు.

ద్వితియోపదేశకాండము 6: 2 “నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవు డైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే.”

అవును, మోషే ఆజ్ఙాపిస్తున్నట్లుగా మోషేధర్మశాస్త్రము క్రింద జీవించబోతున్న ఇశ్రాయేలీయులందరు తమ జీవితకాలమంతా అనుసరించాలి. దీనిభావము మోషేధర్మశాస్త్రము నిరంతరము లేక అంతములేని కాలవ్యవధి అంతా పాటించబడుతుంది అని కాదు!

ద్వితియోపదేశకాండము 6: 17 “మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను.”

మోషేధర్మశాస్త్రము క్రింద జీవించే వారంతా ఆ ధర్మశాస్త్రములోని వాటన్నిటిని పాటించాలి. దీనిభావం కూడా మోషేధర్మశాస్త్రము నిరంతరము లేక అంతములేని కాలవ్యవధి అంతా పాటించబడుతుంది అని కాదు!

ద్వితియోపదేశకాండము 6: 25 “మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనునప్పుడు మనకు నీతి కలుగును.”

పై వాక్యము ప్రకటిస్తున్న విశయము: మోషేధర్మశాస్త్రము క్రింద జీవించే వారంతా అందులోని ఆజ్ఙలన్నింటిని అనుసరించి నడుచుకుంటేనే వారు నీతిని పొందటము జరుగుతుంది. మరోమాటలో చెప్పాలంటే, మోషేధర్మశాస్త్రము క్రింద జీవిస్తున్న వారు ధర్మశాస్త్రములోని అరకొర పాటించటముద్వారానో లేక తమకు వీలైనవాటిని పాటించటముద్వారానో లేక సాధ్యమైనప్పుడు పాటించటముద్వారానో నీతిని పొందజాలరు, శాపగ్రస్తులుగానే కొనసాగి నాశనములోకి ప్రవేశిస్తారు.

కీర్తనలు 111: 7 “ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి.”

అవును, ఆమేన్!

కీర్తనలు 111:8: అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి.

అవును, ఆమేన్!

కీర్తనలు 119:142: నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.

అవును, ఆమేన్! మోషేద్వారా యివ్వబడిన దేవుని ధర్మశాస్త్రము సత్యము, అసత్యము కాదు! దేవుడు ఆదాము హవ్వలను మంచిచెడులను తేలియచేసె పండ్లను తినవద్దని ఆజ్ఙాపించాడు. ఆ ఆజ్ఙ సత్యము. అయినా అది యిప్పుడు వర్తించదు; అమలులో లేదు.

కీర్తనలు 119:144: నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.

అవును, ఆమెన్!

కీర్తనలు 111:3: ఆయన కార్యము మహిమా ప్రభావములుగలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.

అవును, ఆమెన్!

కీర్తనలు 111:9: ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా [עוֹלָם/ఒలం = సుధీర్ఘ కాలము] ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.

అవును, ఆమెన్!
ఉదాహరణ: “ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మ యాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని [עוֹלָם/ఒలం = సుధీర్ఘ కాలము] పాడుగాను ఉండజేసెదను.” (యిర్మీయా.25:9)

కీర్తనలు 119:152: నీ శాసనములను నీవు నిత్యములుగా [עוֹלָם/ఒలం = సుధీర్ఘ కాలము] స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను.

అవును. దేవునికి మహిమ కలుగును గాక!

కీర్తనలు 119:160: “నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము [עוֹלָם/ఒలం = సుధీర్ఘ కాలము] నిలుచును.”

ఆమెన్! ఉదాహరణకు, ఆయన నియమించిన న్యాయవిధులన్నింటిలో ఒకటి “మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారి కొరకు కూర్చుకొనవలెననెను.” (ని.కాం.16:16) ఈ ఆజ్ఙ సత్యము. కాని, ఈ ఆజ్ఙ ఇప్పటికీ ఇశ్రాయేలీయులకు వర్తిస్తుందా…? లేదు. కారణం, ఆ ఆజ్ఙ మన్నాను గురించినది, ఆ కాలానికి చెందినది. అది సత్యమేగాని, ఈ కాలానికి వర్తించదు.

ద్వితియోపదేశకాండము 4: 2 “మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు.”

అవును, యిది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఙ. దేవుడు మోషేద్వారా యిశ్రాయేలీయులకు అందించిన ధర్మశాస్త్రానికి కలుపకూడదు లేక అనుదులోనుండి తీసివేయకూడదు. అయినా, యూదు మతపెద్దలైన రబ్బీలు మోషేధర్మశాస్త్రానికి కేవలం మాటలను మాత్రమే కాకుండా ఏకంగా గ్రంథాలనే వ్రాసుకొని [మౌఖిక తోరాహ్] కలుపుకున్నారు. వారు చేసింది పై స్పష్టమైన ఆజ్ఙకు ప్రతికూలమైన పాపము. వారేగాక వారి మతములో చేరిన వారందరు ఆ పాపాన్ని బట్టి నాశనములోకి వెళ్ళుతున్నారు.

ద్వితియోపదేశకాండము 12: 32 “నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.”

మోషేనిబంధనలో పాలు పొంది మోషేధర్మశాస్త్రము క్రింద జీవించేవారంతా అందులో మోషే ఆజ్ఙాపించిన ‘ప్రతి మాటను’ అనుసరించాలి. దయచేసి జ్ఙాపకముంచుకోండి, ప్రతి మాట అంటే మీకు నచ్చినవో లేక వీలైనవో లేక సాధ్యమైనవో అని కాదు. అన్నీ అని. అయితే సమస్య ఏమిటంటే అన్నీ పాటించే వ్యక్తి ఈ భూలోకములో వున్నాడా…? పాటించని వ్యక్తులంతా శాపగ్రస్తులని మరవకండి.

సామెతలు 30: 6 “ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.”

అవును దేవుని లేఖనము సెలవిస్తున్న ప్రకారము దేవుని మాటలకు ఏనరుడు తన స్వంత మాటలను చేర్చకూడదు. దేవుని మాటలకు దేవుడే తన ప్రవక్తలద్వార అలాగే మెస్సయ్య మరియు ఆయన అపోస్తలులద్వారా ప్రగతిశీల ప్రత్యక్షతగా [Progressive Revelation] యివ్వబడిన తన సందేశములో భాగంగా మోషేధర్మశాస్త్రానికి వేరైన మాటలను చేర్చగలడు. కాని, ఇశ్రాయేలీయులలోని రబ్బీలు తమకు దేవుడు యివ్వని అధికారాన్ని చూపిస్తూ మోషేద్వారా యివాబడిన తోరాహ్ కు వేరుగా మరొక తోరాహ్ అంటే మౌఖిక తోరాహ్ ను చేర్చుకొని పై లేఖనానికి విరుద్ధంగా పాపము చేసారు. ఆ పాపములో జుడాయిజములోని వారంతా పాలుపొందుతున్నారు!

Permalink to single post

యూదుమతస్తుల ప్రశ్నలు-9

పాతనిబంధనలో లేనివి కలిపి చేరిపి రాసుకున్నది క్రైస్తవులా యూదులా????

ఈ ప్రశ్నలకీ  సమాదానమేక్కడా???
( బైబిల్ నుండి సమాధానం కావాలి)

  • ఆలయ ప్రతిష్ట పండుగ ఏప్పటి నుండి చేశారు???…( యెాహన్10:22)
  • విశ్రాంతిదినమున నడవదగిన దూరమేంత???…( అపో..కా1:12)
  • యన్నే యంబ్రే ఏవ్వరూ???…(2 తిమేాతి3:8)
  • దేవదూతలు ఏ పాపము చేస్తే కటిక చీకటి గల బిలాములోకీ పంపాడు???…(  2 పేతురు2:4)
  • బిలాము ఏందుకు ప్రవక్త గా పిలువ బడ్డాడు??? …( 2  పేతురు2:16)
  • హనోకూ ఏప్పుడు ప్రవచించాడు??..( యూదా14-15)

క్రైస్తవ సమాధానాలు

ప్రశ్న#1: ఆలయ ప్రతిష్ట పండుగ ఏప్పటి నుండి చేశారు???…( యెాహన్10:22)

అసలు ఈ ఆలయ ప్రతిష్ట పండుగ పాతనిబంధన గ్రంథములో [తనాఖ్] ఎక్కడుంది…??? ఎక్కడా లేదు!!!

“ఆలయ ప్రతిష్ట పండుగ”నే ఈనాడు హనుఖ్క అని మొదట్లో మక్కబీసుల పండుగ అనికూడా పేర్కొనేవారు. ఈ యూదుల పండుగ 165 క్రీ.పూ. లో ప్రారంభించబడింది.

ఈ పండుగ పాతనిబంధన లేఖనాలలో దేవుడిచిన పండుగలలోనిది కాదు. 

యోహాను 10:22 లోని వివరాలు:

ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను.

క్రొత్తనిబంధన గ్రంథములోని పై లేఖనము వివరిస్తున్నది చరిత్ర సత్యము. కాని, అది దేవుడిచ్చిన పండుగ అని, ఆ పండుగను పాటించాలని, లేక ప్రభువైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] ఆ పండుగను ఆచరించాడని ప్రకటించటము లేదు. 

యూదులు పాటించిన పండుగను గురించి పై లేఖనము పేర్కొంటున్నది. యూదుల ఆచారాలన్నీ లేక వారు జరుపుకునే పండుగలన్నీ దేవుడిచ్చినవన్నది బైబిలు చెప్పడము లేదు, గమనించాలి.    

ప్రశ్న#2: విశ్రాంతిదినమున నడవదగిన దూరమేంత???…( అపో..కా1:12)

“మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండువేల మూరలను, దక్షిణ దిక్కున రెండువేల మూరలను, పడమటి దిక్కున రెండు వేల మూరలను, ఉత్తర దిక్కున రెండువేల మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును.”(సం.కాం.35:5) 

“మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను. మీకును దానికిని దాదాపు రెండువేలకొల మూరల యెడముండ వలెను. మీరు వెళ్లుత్రోవ మీరింతకుముందుగా వెళ్లినది కాదు, మీరు దానిని గురుతుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు.” (యొహోషువ.3:3-4)

పై రెండు లేఖనాల వెలుగులో పురానికి దాని వెలుపలి హద్దుకు ఉండాల్సిన దూరం రెండువేల మూరలు. ఇది ఏదినమైనా నడవతగిన దూరం. అంటే సబ్బాతునాడుకూడా నడవతగిన దూరం. ఓలీవల కొండ మరియు యెరూషలేముల మధ్య వున్నది అదే దూరము.   

ప్రశ్న#3: యన్నే యంబ్రే ఏవ్వరూ???…(2 తిమేాతి3:8)

యన్నే మరియు యంబ్రే అనేవారు ఐగుప్తులోని ఫరో సేవకులైన మంత్రజ్ఙులు (ని.కాం.7:11). ఇది చారిత్రక సత్యము. ఈ సత్యము అపోస్తలుడైన పౌలుచేత దేవుని ఆత్మ ప్రేరణద్వారా లేఖనములో చేర్చబడింది.     

ప్రశ్న#4: దేవదూతలు ఏ పాపము చేస్తే కటిక చీకటి గల బిలాములోకీ పంపాడు???…(  2 పేతురు2:4)

“దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.” (2పేతురు.2:4)  

పై లేఖనము తెలియచేస్తున్న దాని ప్రకారము దేవదూతలు కూడా పాపము చేసారు. దేవుడు వారు దేవదూతలని విడిచిపెట్టకుండా వారిని తీర్పుదినము వరకు బంధించి వుంచాడు అన్నది పై లేఖనముద్వారా అర్థము చేసుకోవచ్చు. 

లేఖనాలు తెలియచేస్తున్నవన్నీ సత్యాలు. అయితే, అవి తెలియచేస్తున్నంతవరకే ఖచ్చితమైన సత్యాలు. మనకు అవసరమైనంతమట్టుకే దేవుడు తన లేఖనాలలో ప్రత్యక్షపరచాడు. అన్ని వివరాలు నరులకు తెలియచేయనవసరము లేదు. తెలియచేసిన వాటిని ఆధారము చేసుకొనే దేవుడు నరులకు తీర్పుతీరుస్తాడు.

దేవదూతలు ఏ పాపము చేసారు? ఎందుకు చేసారు? ఎక్కడ చేసారు? ఎలా చేసారు? ఎంతమంది దూతలు ఆ పాపము చేసరు? అందరు ఒకే పాపము చేసారా లేక వేరే వేరే పాపాలను చేసారా? వారికి ఏవిధమైన శిక్ష రాబోతుంది? మొదలైన వివరాలన్నీ నరులకు అవసరము లేదు. కనుకనే వాటిని దేవుడు వివరించలేదు. 

ఉదాహరణకు, తోరాహ్ లో యిలా వుంది, “అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.” (ఆది.కాం.3:7)

పై వాక్యము ప్రకారము ఆదాము హవ్వలు తమకు చేసుకున్న కచ్చడములు ఎన్ని ఆకులతో చేసుకున్నారు? ఆ ఆకులు లేతవా లేక ముదిరినవా? ఏవిధంగా ఆ ఆకులను కుట్టారు? కుట్టెందుకు ఏ పదార్థాలను వాడారు? ఇద్దరు కుట్టితే సమానంగా శ్రమపడ్డారా లేక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ శ్రమించారా…? ఈ ప్రశ్నలకు జవాబులుంటాయి. కాని, అవి నరులకు అవసరం లేదు. కనుకనె ఆ వివరాలన్నీ దేవుడు తన లేఖనాలలో తెలియచేయలేదు.   

“రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.29:29)      

ప్రశ్న#5: బిలాము ఏందుకు ప్రవక్త గా పిలువ బడ్డాడు??? …( 2  పేతురు2:16)

లేఖనాలు బిలామును ప్రవక్తగా పేర్కొన్నాయి (1పేతురు.2:16)
లేఖనాలు మోషే మామ యిత్రోను యాజకునిగా పేర్కొన్నాయి (ని.కాం.3:1)
లేఖనాలు దావిదును ప్రవక్తగా పేర్కొన్నాయి (అపో.కా.2:30)

పైవన్నీ చారిత్రక సత్యాలే. అయినా వాటి వివరాలన్నీ లేఖనాలలో దేవుడు నరులకు తెలియపరచాలన్న నియమమేదీ లేదు. నరులకు అవసరమైనవన్నీ లేఖనములో తెలియపరిచాడు. అనవసరమైన వాటిని లేక వివరాలను లేఖనాలలో చేర్చ లేదు. ఆ కారణాన్నిబట్టి లేఖనాలలో బయలుపరచబడిన వాటిని సంశయించకూడదు. సంశయించువాడు అవిశ్వాసి!  

ప్రశ్న#6: హనోకూ ఏప్పుడు ప్రవచించాడు??..( యూదా14-15)

“ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.” (యూదా.14-15)

పై లేఖనములో దేవుడు బయలుపరుస్తున్న దాని ప్రకారము ఆదాము మరియు హానోకు లిరువురు ప్రవచించారు అన్నది గ్రహించాలి. ఎప్పుడు ప్రవచించారు? ఎలా ప్రవచించారు? ఏ భాషలో ప్రవచించారు? ఎన్ని సార్లు ప్రవచించారు? ప్రవచించటానికి ఎంత సమయము తీసుకున్నారు? ప్రవచించింది ఎవరు విన్నారు లేక ఎంతమంది విన్నారు? మొదలైన ప్రశ్నలన్నినిటికి దేవుని యొద్ద జవాబులున్నాయి. కాని, అవన్నీ మానవులకు అవసరమైనవి కావు గనుకనే వాటి వివరాలను లేఖనములో దేవుడు తెలియచేయలేదు.    

రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.29:29)       

Permalink to single post

యూదుమతస్తుల ప్రశ్నలు-8

అబద్దికులు & మోసపరచువారు ఎవరు…?!

ద్వితియోపదేశకాండము 4: 2
మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు.”
ద్వితియోపదేశకాండము 12: 32
నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.”

పై మాటలు దైవజనుడైన మోషే ఇశ్రాయేలీయులతో చెప్పినవి. మోషే ద్వారా యివ్వబడిన తోరాహ్ [పంచకాండాలు] కు ఇశ్రాయేలీయులెవరు ఏదీ కలుపకూడదు తీసివేయకూడదు. అది దేవుడిచ్చింది కనుక దానిలో మార్పులు చేర్పులు జరుగాలంటే అవి దేవునిచేతనే చేయబడాలి.

మోషే తోరాహ్ ఇశ్రాయేలీయులకు అందించిన తదుపరి ప్రవక్తలద్వారా దేవుడు ఇంకా తోరాహ్ లో లేని ఎన్నో ఆజ్ఙలను, విధులను, ఆచారాలను ప్రవేశపెట్టాడు [ఉదా:(1దిన.వృత్తాం.15:16-22, 16:4-6, 25:1-8; 2దిన.వృత్తాం.23:18), (ఎస్తేరు.9:20-32), (కీర్తన.40:6, 51:16; హోషేయ.6:6)] అలాగే మెస్సయ్యద్వారా మరియు ఆయన అపోస్తలులద్వారా మానవాళికంతా చివరి దైవాజ్ఙలను, విధులను, ఆచారాలను అందించాడు [క్రొత్తనిబంధన గ్రంథము].    

గమనిక: ప్రవక్తలకు, మెస్సయ్యకు మరియు అపోస్తలులకు యివ్వబడిన అధికారము దేవుడు రబ్బీలకు యివ్వలేదు [ద్వి.కాం.18:19; యెషయా.42:4]. అయినా వారు మోషే ధర్మశాస్త్రానికి వేరైన ఆజ్ఙలను, విధులను, ఆచారాలను మౌఖిక తోరాహ్ పేరున కలుపుకొని తమదైన యూదామతాన్ని నెలకొల్పుకున్నారు. ఇది ద్వితియోపదేశకాండములోని [4:2; 12:32] దేవుని ఆజ్ఙకు వ్యతిరేకమైన తిరుగుబాటుతోకూడిన పాపము. రబ్బీల మతానికి చెందిన జూడాయిజములోని వారంతా ఈ బాపతువారే! 

సామెతలు 30: 6
“ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.”

అవును దేవుని లేఖనము సెలవిస్తున్న ప్రకారము దేవుని మాటలకు ఏనరుడు తన స్వంత మాటలను చేర్చకూడదు. దేవుని మాటలకు దేవుడే తన ప్రవక్తలద్వార అలాగే మెస్సయ్య మరియు ఆయన అపోస్తలులద్వారా ప్రగతిశీల ప్రత్యక్షతగా [Progressive Revelation] యివ్వబడిన తన సందేశములో భాగంగా మోషేధర్మశాస్త్రానికి వేరైన మాటలను చేర్చగలడు.

కాని, ఇశ్రాయేలీయులలోని రబ్బీలు తమకు దేవుడు యివ్వని అధికారాన్ని చూపిస్తూ మోషేద్వారా  యివాబడిన తోరాహ్ కు వేరుగా మరొక తోరాహ్ అంటే మౌఖిక తోరాహ్ ను చేర్చుకొని పై లేఖనానికి విరుద్ధంగా పాపము చేసారు. ఆ పాపములో జుడాయిజములోని వారంతా పాలుపొందుతున్నారు!

యెహోవా దేవుడు మోషేద్వరా యిచ్చిన ధర్మశాస్త్రమంతా ఇంకా ఇప్పటికీ అమలులోనే వుందని బోధించే బోధకులారా ఆలోచించండి…సత్యాన్ని గ్రహించండి!

సామెతలు 28: 5
“దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహిం చుదురు.”

అవును, దుష్టులు యెహోవా గ్రంథపు సరసన మరొక గ్రంథాన్ని [మౌఖిక తోరాహ్] వ్రాసుకొని/కలుపుకొని దేవుని ఆజ్ఙకు సరిగ్గా ప్రతికూలమైన పాపము చేస్తూ న్యాయమెట్టిదైనది గ్రహింపక దేవుని ప్రత్యక్షత విశయములో అన్యాయముగా ప్రవర్తిస్తున్నారు. యెహోవాను ఆశ్రయించువారు ఆయన తన ప్రవక్తలద్వారా మెస్సయ్యద్వారా, అపోస్తలులద్వారా యిచ్చిన సందేశాన్నిబట్టి సమస్తమును గ్రహించుదురు. 

సామెతలు 28: 4
“ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడుదురు.”

నిజమే! దేవుడు మోషేద్వారా యిచ్చిన తోరాహ్ ను త్రోసివేసి రబ్బీలు వ్రాసుకున్న గ్రంథాలైన తాల్ముదు గ్రంథాలకు మౌఖిక తోరాహ్ అన్న పేరు పెట్టుకొని అంత దుర్మార్గానికి దుష్టత్వానికి కారకులైన రబ్బీలను పొగడుచు దేవుడు తన మెస్సయ్యద్వారా అందించిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారితో అంటే నిజమైన క్రైస్తవులతో పోరాడుతారు. ఈ లేఖనపు అక్షరాల నెరవేర్పు మొదటి శతాబ్దము మొదలుకోని నేటివరకు చూడగలము.  

యెషయా.5: 24
“సైన్యములకధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని వాక్కును తృణీక రించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయు నట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్లి పోవును వారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును.”

ప్రవక్తలద్వారా, మెస్సయ్యద్వారా, అపోస్తలులద్వారా యెహోవా దేవుడు అందించిన సందేశాలను నిర్లక్ష్యపెట్టి రబ్బీల బోధలలో నిండా మునిగి పరిశుద్ధదేవుని వాక్కును తృణీకరిస్తున్న వారు అనేకులు. అలాంటివారి గతి కాలిపోయి మసిగామరియు బూడిదగా మారుతుంది. వారి అంతము నాశనము. అయ్యో వారికి శ్రమ! 

పై విధంగా స్వంత ధర్మశాస్త్రాన్ని [మౌఖిక తోరాహ్] తయారుచేసుకొని దేవుడు మోషేద్వారా యిచ్చిన ధర్మశాస్త్రాన్ని ప్రవక్తలద్వారా యిచ్చిన సందేశాలను, మెస్సయ్యద్వారా మరియు అపోస్తలులద్వారా యిచ్చిన నూతన నిబంధనాసంబధమైన ధర్మశాస్త్రాన్ని త్రోసివేసి నిర్లక్ష్యం చేస్తున్న వారంతా దైవవిరోధులు, ధర్మవిరోధులు, సత్యవిరోధులు మరియు నాశనమువైపు పయనిస్తున్న శాపగ్రస్తులు!!!