Author Archives: Admin

Permalink to single post

మెస్సయ్య మరణం: క్రైస్తవేతరుల కొరకైన వివరణ

సృష్టికర్త మహోన్నత నామములో మీకు శుభము, సమాధానము, సత్యము, మోక్షము కలుగును గాక!

ప్రపంచములోని క్రైస్తవులు ముఖ్యముగా సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలును [పాతనిబంధన గ్రంథాలు + క్రొత్తనిబంధన గ్రంథాలు] విశ్వసించే వారు బైబిలులోని సందేశాన్ని ఆధారం చేసుకొని ప్రతి సంవత్సరము ఏప్రెలు మాసములో రెండు దినాలను ప్రత్యేకమైన దినాలుగా గుర్తించి వాటిని శ్రద్ధాభక్తులతో గడుపుతుంటారు. 

ఈ రెండు దినాలు ప్రభువైన యేసు క్రీస్తు [యషువ హ మషియాఖ్] వారి శ్రమలతోకూడిన మరణమును అటుతరువాత ఆయన పునరుత్థానమును అంటే మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచిన సందర్భాలను పురస్కరించుకొని జరుపుకునే దినాలు. 

నిజానికి యేసు [యషువ] ప్రభువు యొక్క ఘోర మరణము మానవాళి ప్రాయశ్చిత్తార్థము అంటే మానవుల పాపాలను క్షమించే ప్రక్రియకు ఆధారభూరితంగా వుండేందుకై సృష్టికర్త తానే నిర్వర్తించిన కార్యం అన్నది బైబిలు బోధ యొక్క సారాంశము.     

అయితే, యిక్కడ క్రైస్తవేతరులకు మూడు రకాల ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజం. 

మొదటి రకానికి చెందిన ప్రశ్నలు ఇలా వుంటాయి:

ఇది అవసరమా?
సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త సర్వశక్తిమంతుడు. ఆయనే సర్వాధికారి, సార్వభౌముడు. మానవులను క్షమించాలనుకున్నా లేక శిక్షించాలనుకున్నా దాన్ని ఆయన తక్షణం నిర్వర్తించగలడు. ఆయనను ప్రశించే వారెవరూ లేరు. అలాంటి సృష్టికర్త యేసు క్రీస్తు లేక యషువ మషియాఖ్ వారి ఘోరమరణాన్ని ఆధారం చేసుకొనే మానవులను క్షమించాలా?
ఒక పాపిని క్షమించటానికి సృష్టికర్తకు ఈసా వారి మరణం ఆవశ్యకమా?
ఆయన మరణం లేకపోతే సృష్టికర్త పాపులను క్షమించే స్థితిలో లేడా? 

రెండవ రకానికి చెందిన ప్రశ్నలు వచ్చేసి యిలావుంటాయి:

ఇది న్యాయమా?
ఒక పాపిని దుష్టుని అపరాధిని కాపాడటానికి ఒక అమాయకుని నీతిమంతుని నిరపరాధిని శిక్షించటమన్నది న్యాయమేలా అవుతుంది?
అలాంటి విధానాన్ని లోకములోని ఏ చట్టమైనా లేక న్యాయవ్యవస్థ అయినా ఒప్పుకోదే! అందరికంటే అత్యున్నతమైన న్యాయవర్తనుడుగా వున్న సృష్టికర్త పాపులైన మానవులను క్షమించటానికి పరిశుద్దుడు ఏపాపమెరుగని మెస్సయ్య వారిని ఘోరంగా శిక్షించటమన్నది ఏరకంగా న్యాయమవుతుంది? 

ఇక మూడవ రకానికి చెందిన ప్రశ్నలగురించి అలోచిస్తే అవి యిలా వుంటాయి:

ఇది పాపాన్ని సమర్దించటము కాదా?
తప్పు చేసినవారికి శిక్షవిధించకపోగా వారి స్థానములో నీతిమంతుని శిక్షించటమన్నది గొప్ప అన్యాయమన్నది అటుంచి, అలాంటి విధానమన్నదే తప్పుచేసినవారిని సమర్ధించి వారిని పాపములో కొనసాగటాన్ని పురికొల్పుతుంది, కాదా?
అది పాపము చేయటానికి  ఫ్రీప్యాస్ ను అందించటములాంటిదే కదా?
ఆవిధానములో క్షమాపణను అందుకున్న వ్యక్తులు యిక పాపము చేయటానికి భయపడక పోగా పైపెచ్చు యింకా ఘోరమైన పాపాలను చేయటానికి ప్రయత్నించరా?      

ఈ వ్యాసంద్వారా నేను ఈ ప్రశ్నలకు విస్పష్టమైన జవాబులను మీముందు వుంచబోతున్నాను. అయితే, ముందస్తుగా సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు ప్రబోధాల ప్రకారము సృష్టికర్తకున్న ప్రధాన గుణలక్షణాలు ఏవి? మానవజాతికి ప్రాప్తించిన విపత్తు ఏమిటి? యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యొక్క ఘోర మరణానికున్న ఆంతర్యమేమిటి? అన్న మూడు ప్రాముఖ్యమైన అంశాలను వివరిస్తాను. ఆ వివరణ వెంటనే క్రైస్తవేతరుల ప్రశ్నలకు జవాబులను మీముందుంచబోతున్నాను.

బైబిలులో తననుతాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్తకు అనేక గుణలక్షణాలున్నయి. వాటిలొ ప్రధామైనవి మూడు నైతిక గుణలక్షణాలు. అవి, పరిశుద్ధత, న్యాయతత్వం, ప్రేమ. 

మొదటిది పరిశుద్ధత అనే గుణలక్షణం. ఇది అనేక కోణాలలో వ్యక్తీకరించబడింది. ప్రత్యేకత, పవిత్రత, సంపూర్ణత, ఆత్మీయ వెలుగు మొదలైన కోణాలు మచ్చుకు కొన్ని. ఈ గుణలక్షణాని బట్టి అపవిత్రతకు అసంపూర్ణత్వానికి అలాగే ఆత్మీయ అంధకారముతోకూడిన వాటికి లేక వ్యక్తులకు సృష్టికర్త సన్నిధిలో ఎలాంటి స్థానం లేదు. 

రెండవది న్యాయతత్వం అనే గుణలక్షణం. ఈ గుణలక్షణాన్నిబట్టి సృష్టికర్తలో పక్షపాతానికి తావులేదు. మంచికి ఈవులను చెడుకు శిక్షను అందించటమన్నది న్యాయతత్వానికున్న ఒకానొక ప్రధాన లక్షణం. సృష్టికర్త న్యాయవ్యవస్థలో నిజమైన పశ్చత్తాపానికి క్షమాపణ వుంది. అయితే, దాన్ని పొందటానికి చేయబడిన చెడుకు కేవలము పశ్చత్తాపపడితే సరిపోదు. పశ్చత్తాపముతోపాటు జరిగిన నష్టానికి తగిన వెల చెల్లించడముద్వారానె సాధ్యపడుతుంది. [సం.కాం.5:5-8]      

దేవుని న్యాయవ్యవస్థలో క్షమాపణ అన్నది పాపాన్ని పట్టించుకోకపోవడంద్వారానో లేక దాన్ని దాచిపెట్టడంద్వారానో లేక దాన్ని అమోదించడంద్వారానో కలుగదు; అది కేవలం పాపముద్వారా సంభవంచిన నష్టానికి తగిన వెలచెల్లించటముద్వారానే కలుగుతుంది. ఆ వెలను ఆ పాపాన్ని చేసిన వ్యక్తి అయినా చెల్లించాలి లేక ఆవ్యక్తి పక్షంగా పాపరహితుడైన మరొక వ్యక్తి అయినా స్వచ్ఛందంగా చెల్లించాలి. [యెషయా.53:8-11] 

ఇక మూడవ గుణలక్షణం ప్రేమ. ఈ గుణలక్షణానికి అనేక విభాగాలు వున్నాయి. అందులో ఒకటి తననుతాను అర్పించుకోవటం. ప్రేమ యొక్క అత్యుత్తమ వ్యక్తీకరణ అన్నది స్వీయత్యాగం ద్వారానే సాధ్యపడుతుంది. సృష్టికర్త యొక్క ప్రేమాతత్వం ఊహాతీతమైనది. అత్యుత్తమమైన అత్యున్నతమైన ప్రేమకు ఆయనే ప్రతిరూపం. 

ఇక మానవులకు ప్రాప్తించిన విపత్తుగురించి చూస్తే సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు వివరణప్రకారము మానవులు ఆలోచనలద్వారా, మాటలద్వార, క్రియలద్వారా అపవిత్రతను దుర్నీతిని సంపాదించుకొని పరిశుద్ధుడైన సృష్టికర్తకు వ్యతిరేకమైన దిశలో జీవిస్తూ ఆయన సన్నిధిలోకి వెళ్ళే అర్హతను కోల్పోయారు. అంతమాత్రమేగాక సృష్టికర్త యొక్క న్యాయతత్వాన్నిబట్టి తమ చెడు జీవితానికి తగిన ఫలాన్ని/శిక్షను పొందబోతున్నారు. ఇది పరిశుద్ధుడైన సృష్టికర్త సన్నిధికి దూరంగా ఆయా వ్యక్తులకు వారివారి పాపాలకు తగిన మోతాదులోనే అమలుకాబోతున్న ప్రక్రియ.    

చివరగా యేసు [యషువ] ప్రభువు పొందిన ఘోర మరణము యొక్క పరమార్థం ఏమిటి అని ఆలోచించాలి. బైబిలు వివరణ ప్రకారం తమ అపవిత్రతచేత దుర్నీతిచేత పరిశుద్ధుడు న్యాయవంతుడు అయిన సృష్టికర్త సన్నిధిలోకి ప్రవేశించే అర్హత కోల్పోయి నిత్యశిక్షకు పాత్రులయ్యారు మానవజాతి అంతా. అయితే, ప్రేమతత్వమనే నైతిక గుణలక్షణాన్ని కలిగివున్న సృష్టికర్త మానవులందరిని ప్రేమించేవాడు కనుక మానవులకు దాపురించిన విపత్తులోనుండి కాపాడి వారికి పరిశుద్ధతను నీతిని ఆపాదించి తద్వారా వారు తన సన్నిధిలో నిత్యమోక్షాన్ని అనుభవించే భాగ్యాన్ని పొందేందుకు వీలైన ప్రణాలికను విరచించాడు.

ఆ ప్రణాలికలో భాగంగా ఒకవైపు తన న్యాయతత్వాన్ని తృప్తిపరచే వెలను చెల్లించి మరొకవైపు తన పరిశుద్ధత ఆశిస్తున్న స్థాయిలో నీతిని సిద్ధపరిచి మానవాళికి మోక్షప్రాప్తిని అందుబాటులోకి తెచ్చాడు. మానవులకసాధ్యమైన ఈ రెండింటిని తన అంశతో ఈలోకములో జన్మించిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యొక్క జీవితం, శ్రమలు, మరియు మరణాలద్వారా సాధించి పెట్టాడు. ఇందులో సృష్టికర్త యొక్క స్వీయత్యాగం వుంది. ఇది మానవాళిపట్ల సృష్టికర్త చూపిన ప్రేమాత్యాగం!  

ఇదంగా వాస్తవంగానే మానవాళి రక్షణకొరకు సృష్టికర్త తానే స్వయంగా ఏర్పాటు చేసిన బృహత్ప్రణాళిక అన్నదానికి తిరుగులేని ముద్రగా యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మానవాళి కొరకైన పాపప్రయశ్చిత్తార్థ మరణము పొంది అటుతరువాత అంతకు ముందు అనేక పర్యాయాలు తానే స్పష్టీకరించిన విధంగా మూడురోజులలో మరణాన్ని జయించి తిరిగి సజీవుడుగా లేచాడు!
[మత్తయి.17:22-23; 28:1-20; మార్కు.9:31; 16:1-20; లూకా.18:31-33; 24:1-53; యోహాను.10:18; 20:1-31]

అపవిత్రతతో దుర్నీతితో వున్న ఏ వ్యక్తి అయినా తన దుస్థితిని గుర్తించి పశ్చత్తాపహృదయముతో మానవాళియెడల సృష్టికర్త యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] నందు నెరవేర్చిన ప్రేమాత్యాగాన్ని విశ్వసించి ఆయనను క్షమాపణ వేడుకుంటే ఆ వ్యక్తి ఆంతర్యములో తిరిగి జన్మించినవాడై మోక్ష ప్రాప్తిని పొందగలడు. అలాంటివ్యక్తి ఈ లోకములో క్రొత్త జీవితాన్ని ప్రారంభించి క్రొత్త స్వభావములో ఎదుగుటకు మొదలుబెడుతాడు.  

ఇక ఈ అంశానికి సంబంధించి క్రైస్తవేతరులకు వచ్చే ప్రశ్నలను గురించి ఆలోచిద్దాం.

మొదటి రకానికి చెందిన ప్రశ్న. 

సృష్టికర్త సార్వభౌముడు గనుక మానవులను క్షమించి మోక్షాన్ని ప్రసాదించటానికి ఆయనకు అడ్డేమిటి? ఇందుకుగాను యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] లోకములోకి రావటము, శ్రమలను అనుభవించటము, మరణించటము, తిరిగిలేవటము అనే సుధీర్ఘ ప్రణాళిక యొక్క ఆవశ్యకత సృష్టికర్తకు వుందా?

సంపూర్ణదైవగ్రంథమైన బైబిలు బోధ ప్రకారము వుంది! ఎందుకంటే…

ఒక పాపిని క్షమించి మోక్షాన్ని అనుగ్రహించటమన్నది తనకున్న సార్వభౌమత్వముద్వారా సృష్టికర్త చేయగలడు అని భావిస్తే అదే కారణాన్నిబట్టి ఆయన ఏపాపమెరుగని ఒక నీతిమంతుని శిక్షించి నరక ప్రాప్తుని చేయగలగాలి. అలాంటి ప్రవృత్తి చపలచిత్తానికి మరియు అన్యాయానికి తిరుగులేని నిదర్శనం. ఈ దుర్గుణాలు సృష్టికర్తకు వుండవు వుండకూడదు.        

నిజమైన సృష్టికర్త పాపులైన మానవులను కాపాడి మోక్షాన్ని అనుగ్రహించాలన్న ప్రేమ తపనను కలిగినవాడు గనుక ఆయన ఆ కార్యాన్ని పరిశుద్ధత మరియు న్యాయతత్వం అనే తన ప్రవృత్తులకు వ్యతిరేకంగా కాకుండా వాటి పరిధులలోనే సాధించటానికి సుధీర్గమైన ప్రణాళిక అవసరత వుంది. ఆ ప్రణాళికలో భాగంగా మానవుల పాపాల ఫలితమైన నష్టానికి తగిన వెలను తానే చెల్లించి తన న్యాయతత్వాన్ని తృప్తిపరచాడు. అది ప్రభువైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] వారి శ్రమలతోకూడిన మరణములో నెరవేర్చబడింది. 

రెండవ రకానికి చెందిన ప్రశ్న.

పాపులను తప్పించటానికి ఏపాపమెరుగని నీతిమంతుడైన యేసు[యషువ]ను శిక్షించటము అన్యాయం కాదా?

నిజానికి ఒక అపరాధిని శిక్షనుంచి తప్పించటానికి ఒక నిరపరాధిని శిక్షకు గురిచేయటమన్నది నిరాపేక్షంగా అన్యాయమే. అయితే పాపులను రక్షించే ప్రణాళికలో భాగంగా యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యొక్క శ్రమలతో కూడిన మరణముద్వారా సృష్టికర్త జరిగించిన కార్యం అలాంటిది కాదు. దైవాంశసంభూతుడైన యేసు క్రీస్తు [యషువ హ మషియాఖ్] దైవ ప్రణాళికలోని ప్రతిక్షేపణా [substitution] పాత్రను పోశించి మానవులకు విమోచనను సంపాదించి వారు మోక్షాన్ని పొందే మార్గాన్ని సుగమం చేయటానికి తన యిచ్చపూర్వకంగా వచ్చాడు. మరోవిధంగా చెప్పలంటే మానవుల పాపాలకు తగిన శిక్షను విధించింది ఆయనే, ఆ శిక్షకు తగిన వెలను చెల్లించింది కూడా ఆయనే!   

మూడవ రకానికి చెందిన ప్రశ్న.

ఇది పాపాన్ని సమర్దించి దుష్టులు దుర్మార్గములోనే కొనసాగటాన్ని ప్రోశ్చహించటము కాదా?  

ఏభేదం లేకుండా ఏనియమం లేకుండా చేసిన పాపాలకు ఎవరు ఏవెల చెల్లించకుండానే పాపులందరిని ఏకపక్షంగా క్షమించి మోక్షం ప్రసాదిస్తే తప్పకుండా అది పాపాన్ని సమర్దించి దుష్టులు దుర్మార్గములోనే కొనసాగటాన్ని ప్రోశ్చహించటమవుతుంది. కాని, యషువ మషియాఖ్ [యేసు క్రీస్తు] నందు సృష్టికర్త నిర్వర్తించిన రక్షణకార్యం అన్నది అలాంటిది ఎంతమాత్రము కాదు.

తమ దుర్నీతిని అపవిత్రతను గుర్తించి పశ్చత్తాపపడి తమ స్వంతనీతిపై లేక భక్తిపై ఆధారపడకుండా యషువ మషియాఖ్ [యేసు క్రీస్తు] నందు సృష్టికర్త తానే నిర్వర్తించిన రక్షణకార్యమందు విశ్వాసముంచి ఆయనను క్షమాపణ వేడుకున్న పాపులకు మాత్రమే క్షమాపణ మోక్షము.

ఆరకంగా దైవానుగ్రహాన్ని పొందిన వ్యక్తులు క్రొత్త జీవితాన్ని సృష్టికర్తకు అంగీకారమైన రీతిలో ఆయన ఆత్మసహాయముతో జీవిస్తూ ఆయన లేఖనాలైన బైబిలు [పాతనిబంధన గ్రంథాలు + క్రొత్తనిబంధన గ్రంథాలు] వెలుగులో కొనసాగాలి.   

Permalink to single post

కన్యక లేక యవ్వన స్త్రీ?

కాబట్టి ప్రభువు తానే యొక సూచన [אוֹת/oth/ఓథ్] మీకు చూపును. ఆలకించుడి, కన్యక [עַלְמָה/అల్మ] గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును [קָרָא/kawraw/ఖర = to call/పిలవడము ].” (యెషయా 7:14)

పై ప్రవచనాత్మక లేఖన సందేశములో గుర్తించాల్సిన సత్యాలు:

(1) ఆదిమ హెబ్రీ భాషలో ‘అల్మ’ [עַלְמָה/alma] అనే పదానికున్న అర్థాలు: యవ్వన స్త్రీ; కన్యక/పురుష సంయోగము లేని యువతి. ఈ పదం 7 సార్లు తనాక్ లో వుపయోగించబడింది.

ఉదాహరణ: “అందుకు ఫరో కుమార్తె వెళ్లుమని చెప్పగా ఆ ‘చిన్నది’ [עַלְמָה/అల్మ] వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.” (ని.కాం.2:8).

ఇక్కడ మోషే అక్క పెళ్ళి అయిన స్త్రీ కాదు అందుకే పై లేఖనములో ఆల్మ [עַלְמָה/alma] అనే పదము ఆమెకు ఉపయోగించబడింది అన్నది గమనములో వుంచుకోవాలి.

తనాక్ అంతటిలో అల్మ [עַלְמָה/alma] అనే హెబ్రీ పదం వివాహము జరిగిన యువతిని సూచించటానికి ఒక్కసారి కూడా ఉపయోగించబడలేదు అన్న వాస్తవము ఈ సందర్భములో గమనార్హమైన విశయము.

(2) క్రీస్తుకు పూర్వమే 3వ శతాబ్ధములో హెబ్రీ భాషలోని తనాక్ లేఖనాలను గ్రీకు భాషలోకి అనువదించారు. అనువదించినవారు ఆదిమ హెబ్రీ మరియు గ్రీకు భాషలలో ప్రావీణ్యత సంపాదించిన యూదు పండితులు. వారు తమ లేఖనాలలోని మరియు దినాలలోని పదాల భావాలను పదాలమధ్య బేధాలను బాగా యెరిగినవారు. వారు అనువదించిన తనాక్ యొక్క గ్రీకు లేఖనాలను సెప్టూజింట్ [Septuagint] అని పేర్కొంటారు. సెప్టూజింటులో యెషయా 7:14లోని పదాన్ని గ్రీకులో ‘పార్థెనోస్’ [παρθένος/parthenos] అనే పదంగా అనువదించారు. ఇదే పదం క్రొత్తనిబంధనలోని మత్తయి వ్రాసిన సువార్తలో వుపయోగించబడింది:

ఇదిగో కన్యక [παρθένος/parthenos] గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు” (మత్తయి 1:23).

గ్రీకు భాషలో ‘పార్థెనోస్’ [παρθένος/parthenos] అన్న పదానికున్న అర్థాలు: యువతి; యవ్వన స్త్రీ; కన్యక/పురుష సంయోగము ఎరుగని యువతి; స్త్రీ సాంగత్యము ఎరుగని పురుషుడు.

(3) ఆదిమ హెబ్రీ భాషలో ‘బెతూల’ [בְּתוּלָה/bethulah] అనే పదముకూడా యవ్వన స్త్రీలకు వాడబడింది. ఈ పదం 50 సార్లు తనాక్ లో వుపయోగించబడింది. ఈ పదానికున్న అర్థాలు: యవ్వన స్త్రీ; కన్యక.

తనాక్ (పాతనిబంధన) లో వుపయోగించబడిన హెబ్రీ భాషాపదం బెతూల [בְּתוּלָה/betulah] లో కన్యత్వము స్పష్టముగా ప్రతిబింబించడములేనందుననే ఈ పదాన్ని వుపయోగించిన కొన్ని సందర్భాలలో కన్యత్వాన్ని సూచించడానికి కన్యత్వ వివరణ యివ్వబడింది: ఉదాహరణలు:


ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె బెతూల (בְּתוּלָה/bethulah), ఏ పురుషుడును ఆమెను కూడలేదు;” (ఆది.కాం.24:16)

తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత బెతూల (בְּתוּלָה/bethulah), అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును.” (లేవీ.కాం.21:3)

(4) అల్మ [עַלְמָה/alma] అన్న హెబ్రీ పదము 7 సార్లు తనాక్ (పాతనిబంధన గ్రంథము) లో వుపయోగించబడినా ఒక్కసారికూడా వివాహమైన యవ్వన యువతికి ఆపాదించబడలేదు. అయితే, ‘బెతూల’ [בְּתוּלָה/bethulah] అన్న హెబ్రీ పదము మాత్రము తనాక్ (పాతనిబంధన గ్రంథము) లో ఒకసారి వివాహమైన యవ్వన యువతికికూడా ఆపాదించబడింది. “పెనిమిటి పోయిన బెతూల [בְּתוּלָה/bethulah] గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.” (యోవేలు 1:8). దీన్నిబట్టి బెతూల కన్న అల్మ అన్న హెబ్రీ పదమే కన్యకకు సరియైన పదమని గ్రహించవచ్చు. అందుకే పరిశుద్ధాత్ముడు తన ప్రవక్తలద్వారా ‘కన్యక’ అన్న భావాన్ని సూచించడానికి ఆదిమ హెబ్రీభాషలోని ‘అల్మ’ [עַלְמָהalma] మరియు గ్రీకు భాషలోని ‘పార్తెనోస్’ παρθένος/parthenos] అన్న పదాలను వుపయోగించడము జరిగింది. విజ్ఙలు ఈ సత్యాన్ని గ్రహించగలరు!

(5) హిజ్కియా తల్లి అయినా, హిజ్కియా భార్య అయినా, లేక యెషయా భార్య అయినా కన్యక (עַלְמָה/అల్మ; παρθένος/పార్తెనోస్) కాదు. కనుక, యెషయా 7:14 హిజ్కియా విశయములోగాని, హిజ్కియా కుమారుని విశయములోగాని లేక యెషయా కుమారుని విశయములోగాని వర్తించదు, నెరవేర్చబడలేదు!

(6) యెషయా 7:14 లో యివ్వబడిన ప్రవచనములోని ప్రధానమైన భాగము “ప్రభువు తానే యొక సూచన మీకు చూపును.” ఇక్కడ ‘సూచన’ (אוֹת/oth/ఓథ్) అన్నది సర్వసాధారణ సంభవాన్ని గూర్చినది కాదు. అది ఒక ‘ప్రత్యేకమైన గుర్తు’ లేక అసాధారణ సంఘటన.

ప్రభువైన దేవుడు తానే యివ్వబోతున్న ఆ గొప్ప సూచన ఎలాంటి సూచనతో సరితూగుతుందో అంతకుముందే 11వ వచనములో సూచించాడు, “అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే” (యెషయా.7:11). అలాంటి గొప్ప సూచన ఏదీ రాజైన ఆహాజుకు తోచకపోయి వుండవచ్చు.

అలాంటి సందర్భములో ప్రభువైన దేవుడే ఒక సూచనను ఒక ప్రత్యేకమైన గుర్తును అంటే ఒక అసాధారణ సంభవాన్ని గుర్తుగా అందించటము జరిగింది. అలాంటిది ఎప్పుడు ఎక్కడ జరుగని విశయము. చరిత్రలో ఎవరూ కనీ వినీ ఎరుగని సంఘటన. నిజంగానే అది పాతాళమంత లోతైనది ఊర్థ్వలోకమంత ఎత్తయినది–ఒక కన్య [పురుష సంయోగము ఎరుగని యువతి] గర్భవతియై కుమారుని కనటం.

దేవుడైన ప్రభువు తానే చూపించబోయే ‘సూచన’ [א֑וֹת/oth/ఓథ్=ప్రత్యేకమైన గుర్తు] మానవాతీత శక్తికి సంబంధించినదనటానికి ఈ సందర్భములో మోషేకాలములో దేవుడే చేసిన రెండు ‘సూచనలను’ [הָאֹ֣ת/haOth/హఓథ్=ప్రత్యేకమైన గుర్తు] జ్ఙాపకము చేసుకోవాలి:

మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను. మరియు ఆయనవారు నిన్ను నమ్మక, మొదటి సూచనను [הָאֹ֣ת/haOth/హఓథ్=ప్రత్యేకమైన గుర్తు] బట్టి వినకపోయిన యెడల రెండవ దానిబట్టి విందురు. వారు ఈ రెండు సూచనలను [הָאֹ֣ת/haOth/హఓథ్=ప్రత్యేకమైన గుర్తు] బట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.” (ని.కాం.4:6-9).

పై లేఖనాల వెలుగులో పాతాళమంత లోతుగా ఊర్థ్వలోకమంత ఎత్తుగా వుండే ప్రభువైన దేవుడు తానే చూపే ఆ ‘సూచన’ ఏమిటి…?

“ఒక వివాహమైన యవ్వన యువతి గర్భము ధరించి కుమారుని కనును” అన్నది అనవసరమైన పదప్రయోగముతో కూడిన ప్రకటన అన్నది అటుంచి, అసలు అలాంటిది ప్రకృతిలో సంభవించే అత్యంత సాధారణమైన సంఘటన అన్నది ఇంగిత జ్ఙానమున్న ఎవరైన యిట్టే చెప్పగలరు. అందులో సూచన అంటూ యేమీలేదు! అలాంటి అత్యంతసాధారణ సంఘటనను దేవుడొక ‘సూచనగా’ [ప్రత్యేకమైన గుర్తుగా] పేర్కొన్నాడంటూ వ్యాఖానించడమే అవివేకము, హాస్యాస్పదము!

అయితే, “కన్యక [పురుష సంయోగము ఎరుగని యవ్వన స్త్రీ] గర్భముధరించి కుమారుని కనును” అన్నది అసాధారణమైన విశయము. అలాంటి సంఘటన ప్రకృతిలో జరిగే అవకాశం లేదు. ఒకవేల అలాంటిదేదైనా జరిగితే దాన్ని ఒక మహాద్భుత ఘటనగా గుర్తించాల్సిందే. అలాంటిది సార్వభౌముడైన దేవుడు మాత్రమే జరిగించగలడు. అది ‘సూచన’గా చెప్పబడుటకు అర్హతకలిగిన సంఘటన. అందుకే ప్రవక్తద్వారా దేవుడే ఆ సంఘటనను యెషయా. 7:14 లో ఒక సూచనగా పేర్కొన్నాడన్నది గ్రహించాలి.

(7) ప్రవక్త అయిన యెషయాద్వారా యివ్వబడిన భవిశ్యవాణిలోని దైవసత్యాన్ని తిరస్కరించిన శాస్త్రులు, పరిశయ్యులు, మరియు రబ్బీలు అలాగే ఈనాటి రబ్బీలమతములోని వారు ఆత్మీయ అంధకారములోనే కొనసాగుతూ 2000 సంవత్సరాల క్రితం బేత్లెహేములో మరియ అనబడే ‘కన్యక’ జీవితములో జరిగిన ప్రవచనాత్మకమైన ‘సూచన’ (אוֹת/oth/ఓథ్) యొక్క నెరవేర్పును స్వీకరించకపోగా దాని నేరవేర్పును కాలరాచే దుష్టప్రయత్నముతో తాము నాశనమార్గములో పయనిస్తూ అమాయకులను కూడా దారితప్పిస్తున్నారు! అలాంటివారిని ఉద్దేశించే మెస్సయ్య యిలా వాపోయాడు:

అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు.” (మత్తయి 23:15)

యూదు వివాహ సాంప్రదాయము

యూదుల సాంప్రదాయము ప్రకారము యూదు వివాహము రెండు దశలుగా జరుగుతుంది. మొదటి దశను ‘కిద్దుషిన్’ అని రెండవ దశను ‘నిసుఇన్’ అని పేర్కొంటారు. ప్రాచీనకాలములో ఈ రెండు దశలుకూడా దాదాపు ఒక సంవత్సరపు యెడముతో వేరువేరు సందర్భాలలో రెండు ప్రత్యేకమైన వేడుకలుగా జరుపుకునేవారు. అయితే, ఈ సాంప్రదాయము క్రీస్తు శకము పన్నెండవ శతాబ్దమువరకు కొనసాగి అటుతరువాత రబ్బీల చొరవతో మారిపోయింది. ఈ మార్పునుబట్టే ఈనాడు యూదుల వివాహములోని రెండు దశలను వెనువెంటనే పూర్తిచేసి ఒకే వేడుకగా  జరుపుకుంటున్నారు.    

కిద్దుషిన్ అంటే ప్రధానము చేయబడుట [betrothal]. ఈ దశను పూర్తిచేయటములో సాంప్రదాయ ప్రకారము యూదులు ఎన్నుకునేందుకు వీలుగా రెండు రకాల  విధానాలు అందుబాటులో వుండేవి. అవి, (అ) కన్యాశుల్కము: పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు బహుమానముగా ధనాన్ని యివ్వటము; (ఆ) పత్రము: పెళ్ళికొడుకు తాను పెళ్ళికూతురును వివాహము చేసుకోబోతున్నట్లు వ్రాతపూర్వకంగా మాట యిస్తూ వ్రాసిన పత్రాన్ని పెళ్ళికూతురుకు అందించటము.

కిద్దుషిన్ [ప్రధానము] దశ పూర్తి అయిన తరువాత ఆ యిరువురు స్త్రీ పురుషులు సంపూర్ణ భార్యాభర్తలుగా యూదు సమాజము ఎదుట లెక్కించబడుతారు. అయినను వారి వివాహములోని రెండవదశ అయిన నిసుఇన్ [పెండ్లి] పూర్తి అయ్యేవరకు వారిరువురి మధ్య శారీరక సంబంధము వుండకూడదు.    

మరియ యోసేపుల వివాహము

యూదులకు రాజు మరియు ప్రపంచానికి ప్రభువు అయిన యషువ హ మషియాఖ్ [యేసు క్రీస్తు] ను మొదటి శతాబ్ధములో గర్భాన మోసి కన్న మరియ మరియు యోసేపుల వివాహమును గురించిన కొన్ని ప్రాముఖ్యమైన వివరాలు క్రొత్తనిబంధనా గ్రంథములో వివరించబడ్డాయి (మత్తయి.1:18-25; లూకా.1:26-38, 2:1-20).

మరియ యోసేపుల మధ్య ప్రధానము [కిద్దూషిన్] జరిగింది. ప్రధానము చేయబడటానికి మరియు పెళ్ళితంతు [నిసుఇన్] జరగటానికి మధ్య కొంత కాలము గడిచింది. ఆ మధ్యకాలములోనే మరియ దైవశక్తి చేత గర్భవతిగా మారింది. ఆ సమయానికి పైన వివరించిన ప్రాచీన యూదు వివాహ సాంప్రదాయము ప్రకారము మరియ కన్యకే [పురుష సమ్యోగము లేని యువతి] అయినా అప్పటికే కిద్దూషిన్ [ప్రధానము] జరిగివుండటాన్నిబట్టి ఆమె యూదు సమాజములో స్త్రీగా [గ్రీకు: γυναικός/గునాయ్‌కొస్=భార్య] లెక్కించబడింది.

పై కారణాన్ని బట్టి క్రొత్తనిబంధన గ్రంథములో మత్తయిద్వారా యివ్వబడిన లేఖనాలలో మరియ కన్యకగా (మత్తయి.1:18) పౌలుద్వారా యివ్వబడిన లేఖనాలలో స్త్రీగా (గలతీ.4:4) పేర్కొనబడటము గమనించగలము.

యూదు వివాహ సాంప్రదాయాలలోని లోతుపాతులను గూర్చిన అవగాహనలేని అవిశ్వాసులు కొందరు మత్తయి మరియు పౌలులద్వారా యివ్వబడిన లేఖనాలలోని ఈ తేడాను పేర్కొంటూ యిద్దరిలో ఎవరో ఒకరు అసత్యాన్ని ప్రకటిస్తున్నారు అంటూ విశ్వాసులను కలవరపరచే ప్రయత్నంగా ప్రశ్నలను లేవనెత్తుతుంటారు. అయితే, ఈలాంటి దుష్ట ప్రయత్నాల ఫలితం అవిశ్వాసులు తమ అజ్ఙానాన్నే బయటవేసుకోవటము!

అపోస్తలుడైన పౌలు ద్వారా యివ్వబడిన లేఖనాలను కొందరు వక్రీకరిస్తున్న విశయాన్ని గూర్చి అపోస్తలుడైన పేతురుద్వారా యివ్వబడిన లేఖనాలు హెచ్చరించటాన్ని ఈ సందర్భముగా జ్ఙాపకము చేసుకోవాలి:

“…మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి.” (2పేతురు.3:15-17)

అవిశ్వాసుల అభ్యంతరాలు

అభ్యంతరము #1

“మూలభాషలో ‘ఆ అమ్మాయి’ (the alma [అల్మ/עַלְמָה=కన్య/యవ్వన యువతి]) అని వుంది.”

వివరణ:

అవును యెషయా 7:14 లో వున్న పదజాలము ప్రకారము ప్రభువైన దేవుని సూచనగా ఉన్నది గర్భవతిగా వుండి కుమారుని కనబోతున్న ‘ఆ అమ్మాయి’ అని పేర్కొనబడి వుంది. కారణం…? గర్భవతియై కుమారుని కనబోతున్నది ఏదో ఒక కన్యక కాదు. అది ప్రభువైన దేవుడే తన ప్రణాలికలో ఉద్దేశించి దృష్టించిన కన్యక. అందునుబట్టి సూచనగా వుండబోతున్నది దేవుని దృష్టిలోవున్న ఒక ప్రత్యేకమైన కన్యక అని సూచించటానికి ‘ఆ అమ్మాయి’ అని మూలభాషలో పేర్కొనబడింది.

అభ్యంతరము #2

“మూలభాషలో “ఆ అమ్మాయి గర్భవతి అయింది” (the alma [అల్మ/עַלְמָה=కన్య/యవ్వన యువతి] is with child) అని వుంది.”

వివరణ:

దైవ లేఖనాలలోని ప్రవచనాలు భవిశ్యద్ కాలానికి చెందినా వాటిని గూర్చిన సమాచారము లేక వివరాలను లేఖనాలు వ్యాకరణపరంగా భూత, భవిశ్యద్, వర్తమాన కాలాలలోని యేకాలములోనైనా వ్యక్తపరచటం పరిపాటి. కనుక, యెషయా 7:14 లో వున్న ప్రవచన ప్రకటన “అ అమ్మాయి గర్భవతి అయింది” అంటూ భూతకాలములో వ్యక్తపరచటమన్నది అసాధారణమైన విశయమేమీ కాదు.

అభ్యంతరము #3

“ఒకవేల ఈ వాక్యములో “ఒక/ఆ కన్యక గర్భవతి అవుతుంది” అని వుంటే ఒక యూదుడైన యోసేపు తాను వివాహమాడిన అమ్మాయి లేక కన్యక గర్భవతిగా వుందన్నది గ్రహించినప్పుడు యెషయా 7:14 లోని ప్రవచనము తన కళ్ళముందే నెరవేరుతున్నదంటూ ఆనందముతో ఎగిరి గంతులు వేసేవాడు కదా?”

వివరణ:

మరియ భర్త యోసేపు మతపరమైన పండితుడు కాదు లేక ఒక ప్రవక్త అంతకన్న కాదు. అతను ఒక సామాన్యమైన వడ్రంగి. తాను వివాహమాడిన యువతి గర్భము ధరించింది అన్న విశయము తెలిసినప్పుడు అందరిలా అతనికి కూడా సర్వసాధారణమైన కారణము అక్రమసంబంధమే తటస్థించి వుంటుంది గాని యెషయాలోని ఒక ప్రవచనము తాను ప్రధానము చేసుకున్న యువతిలో నెరవేర్చబడబోతున్నదని ఊహించుకొని తద్వారా ఎగిరి గంతులువేసేందుకు తగిన కారణాలు లేవు. నిజానికి దేవదూతే తన కలలో ప్రత్యక్షమై మరియ గర్భానికి గల హేతువును వివరించి చెప్పినప్పుడుకూడా యోసేపు ఎగిరి గంతులు వేయలేదు అన్నది ఈ సందర్భములో జ్ఙాపకము చేసుకోవాలి.

అభ్యంతరము #4

“యెషయా 7:14 యేసువారిలో నెరవేర్చబడితే 7:15 ప్రకారము ఆయన కీడు మేలుల భేదం తెలుసుకునే తెలివివచ్చేసరికి పెరుగు తేనె తిన్నట్లు ఎక్కడ వ్రాయబడివుంది?”

వివరణ:

బైబిలులోని ప్రవచనాల నెరవేర్పుకు ఆధారాలు కొన్ని సార్లు బైబిలులో మరికొన్ని సార్లు చరిత్రలో లభించటం కద్దు. అయితే, ప్రవచనాల నెరవేర్పు వివరాలన్నవి పూసగుచ్చినట్లు ప్రతీది బైబిలులోనో లేక చరిత్ర గ్రంథాలలోనో తప్పకుండా వుంటుందని లేక వుండాలని నిర్ధారించే నియమమేదీ లేదు. ఒక ప్రవచనము యొక్క ప్రధానాంశపు నెరవేర్పు తప్ప ద్వితీయశ్రేణి వివరాలు చాలమట్టుకు కాలగర్భములో కనుమరుగవుతాయి.

యెషయా.7:15 లో వ్రాయబడివున్నట్లు “కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును” అన్నవి ప్రవచనములోని ద్వితీయశ్రేణి వివరాలు. వీటి నెరవేర్పు తప్పకుండా వ్రాయబడి వుండాలి అన్న నియమమేదీ లేదు. కనుక, ఈ వివరాలు యషువ [యేసు] లో నెరవేర్చబడినప్పటికి అవి వ్రాయబడలేదు. ఒక వేల ఈ ద్వితీయశ్రేణి వివరాల నెరవేర్పు యషువలో నెరవేర్చబడినట్లు వ్రాయబడలేదు కనుక అది యషువను గురించి కాదు అని అభిప్రాయపడేవారు మరి ఆ వివరాల నెరవేర్పు వారు కోరుతున్న విధానములో ఏవ్యక్తిలో నెరవేర్చబడిందని వ్రాయబడిందో లేఖనాల ఆధారంగా చూపించ బద్దులై వున్నారు.

అభ్యంతరము #5

యెషయా 7:14 యేసువారిలో నెరవేర్చబడితే 7:16 ప్రకారము ఆయన కీడు మేలుల భేదం తెలుసుకునే తెలివివచ్చేలోపలే యిద్దరు రాజుల దేశము పాడుచేయబడింది అని ఎక్కడ వ్రాయబడి వుంది?

వివరణ:

యెషయా.7:13-16 వరకుగల వచనాలలోని ప్రవచనాంశాలు:

  • ప్రభువు తానే దావీదు వంశస్థులకు ఒక సూచన [אוֹת/oth/ఓథ్] చూపును, అది కన్యక [עַלְמָה/alma] గర్భవతియై కుమారుని కనడము.
  • కన్యక గర్భవతియై కనిన కుమారునికి ఆమె ఇమ్మానుయేలు [దేవుడు మనకు తోడు] అనే పేరుతో పిలవటము [קָרָא/kawraw/ఖర = to call/పిలవడము].
  • ఆ కుమారుడు కీడును విసర్జించించి మేలును కోరుకొనే వయస్సుకు చేరుకున్నప్పుడు పెరుగు తేనే తినును. ఇది 1-3 సంవత్సరాలు వయస్సులో జరిగే విశయము.
  • ఆ కుమారునికి పెరుగు తేనెను తినే వయస్సు రాకముందే దావీదు వంశస్థులను భయపెట్టే యిద్దరు రాజుల దేశము [הָאֲדָמָה֙/హఅధామహ్/HaAdham] నిర్లక్ష్యము/పాడుచేయబడును [תֵּעָזֵ֤ב/తెఅజెబ్/TeAzeb = abandon/విడిచిపెట్టబడుట]

యెషయా.7:16 లో గమనించాల్సిన అంశాలు:

  • “కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయబడును” అన్న వివరణ యొక్క నెరవేర్పు ఎక్కడో ఒకదగ్గర వ్రాయబడి వుండాలి నియమమేదీ లేదు.
  • ఈ సందర్భములో యివ్వబడుతున్న ప్రవచనము రాజైన ఆహాజుకు మాత్రమే పరిమితమవడము లేదు. 13-14 వచనాల ప్రకారము ఇక్కడ యివ్వబడుతున్న ప్రవచనము దావీదు వంశస్థులందరిని ఉద్దేశించి యివ్వబడింది అన్నది గమనములో వుంచుకోవాలి.
  • చరిత్రను పరిశీలించి చూస్తే ఈ ప్రవచన యొక్క నెరవేర్పు యషువ [యేసు] జనన సమయములో చోటుచేసుకున్న సత్యము అవగతమవుతుంది.
  • దావీదు వంశస్థులు భయపెట్టే యిద్దరు రాజుల దేశము నిర్లక్ష్యము చేయబడును. నిర్లక్ష్యము లేక విడిచిపెట్టబడుట అన్నది యిద్దరు రాజులకుజరిగే విశయముకాదు. అది రెండు దేశాలుకు జరిగే విశయముకూడా కాదు. అది యిద్దరు రాజులు [వేరువేరు సమయాలలో] పాలించిన ఒకే దేశానికి సంభవించే విశయము.
  • దావీదు వంశస్థులను భయపెట్టిన యిద్దరు రాజులు షొమ్రోనురాజు మరియు సిరియారాజు. షొమ్రోను రాజులు ఉత్తరదేశమైన ఇశ్రాయేలురాజ్యమును పాలించారు. కాని, వారిదేశాన్ని సిరియా రాజులు జయించి పాలించటం జరిగింది. ఆ విధంగా ఈ దేశము రెండు రాజుల దేశముగా ప్రవచనవాక్యము గుర్తిస్తున్నది. అయినా ఈ సంఘటన రాజైన ఆహాజు కాలములో సంభవించలేదు. కనుక, ఇది ఆహాజునుద్దేశించి చెప్పబడిన ప్రవచనము కాదు అన్నది సుస్పష్టము.

యెషయా.7:13-16 లేఖనాలలోని ప్రవచన నెరవేర్పులు క్రొత్తనిబంధన గ్రంథములో యివ్వబడ్డాయి. యోసేపు ప్రధానము చేసుకున్న కన్యమరియ ఒక అద్భుతముద్వారా కన్న యషువ [యేసు] యొక్క జననములో ఈ ప్రవచన నెరవేర్పును చూడగలము:

40 క్రీ.పూ. లో రోమా ప్రభుత్వము ఎదోమీయుడైన హేరోదు [Herod the Great] ను ఇశ్రాయేలుదేశముతో [షొమ్రోను రాజ్యానికి] కలిపి ఎదోము మరియు యూదా దేశాలకు రాజుగా నియమించింది.

4 క్రీ.పూ.లో హేరోదు మరణించాడు (మత్తయి.2:19-22). అయితే, అదే సంవత్సరము హేరోదురాజు కుమారుడు ఆర్కెలాయు [Herod Archelaus] తండ్రి స్థానములో ఒక రాజుగా కాకుండా మొదట కేవలము ఒక నాయకునిగా అటుతరువాత రోమా చక్రవర్తి గుర్తింపుతో ఒక ‘జాతీయ నాయకుడు’ [Ethnarch] అన్న బిరుదుతో మాత్రమే హేరోదు రాజ్యములోని ప్రధాన భాగాలైన యూదా, సమరయ, మరియు ఎదోములకు నాయకునిగా వ్యవహరించాడు.

కన్యమరియ కుమారుడు యషువ [యేసు] 4 క్రీ.పూ. వ సంవత్సరములో జన్మించాడు అన్నది చరిత్రకారుల అంచనా. ఆ సంఘటన తరువాత ఒక సంవత్సరములోపే హేరోదు కూడా మరణించాడు. ఈ రెండు ప్రాముఖ్యమైన సంఘటనలు ఒకే సంవత్సరములో చోటుచేసుకున్నా మొదటిది సంవత్సరములోని ఆదిలో రెండవది అదే సంవత్సరపు చివరలో చోటుచేసుకున్న సంఘటనలుగా అర్థముచేసుకోవచ్చు.

పై చారిత్రక వాస్తవాల వెలుగులో దావీదు వంశస్తులను భయపెట్టిన రెండు రాజుల దేశమైన సమరయ లేక ఇశ్రాయేలుదేశం యషువ [యేసు] పుట్టి కీడు మేలుల భేదం తెలుసుకునే తెలివివచ్చేలోపలే అంటే 3 క్రీ.పూ. వ సంవత్సరమునుండి 6 క్రీ.శ. వ సంవత్సరము మధ్య రాజులేని రాజ్యంగా నిర్లక్ష్య స్థితికి [תֵּעָזֵ֤ב/తెఅజెబ్/TeAzeb = abandon/విడిచిపెట్టబడుట] దిగజారింది.
ఇది యెషయా.7:16 యొక్క స్పష్టమైన నెరవేర్పు. ఈ లేఖనములోని ప్రవచన నెరవేర్పు యెషయా.7:14లో దేవుడే యిచ్చిన సూచన అయిన “కన్యక గర్భము ధరించి కుమారుని కనును” అన్న ప్రవచనము యొక్క స్పష్టమైన నెరవేర్పే యషువ [యేసు] యొక్క జననము.

అభ్యంతరము #6

“యెషయా.7:14 లో “కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును” అన్న ప్రవచనము ప్రకారమే మరియ కన్యక అయివుండి యేసు [యషువ] ను కంటే మరియ ఆయనకు ఇమ్మానుయేలు అన్న పేరు పెట్టినట్లు ఎక్కడ వుంది?”

వివరణ:

పై లేఖనములోని ప్రవచనాన్ని గమనించాల్సిన అంశాలు:

ఈ లేఖనములోని ప్రధానమైన ప్రవచనము దేవుని సూచన అంటే “కన్యక గర్భవతియై కుమారుని కనటము.” ఆ కుమారునికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టడము/పిలవడము అన్నది ద్వితీయశ్రేణి అంశము.

ఆ పేరుపెట్టేది లేక ఆ పేరుతో పిలిచేది ఆయన తల్లి.

యెషయా 8:3 లోని ఆజ్ఙ ప్రకారము తన కుమారునికి మహేరు షాలాల్ హాష్ బజ్ అన్న పేరు పెట్టమని దేవుడైన ప్రభువు ప్రవక్త అయిన యెషయాకు ఆజ్ఙాపించాడు. ఆ ఆజ్ఙకు లోబడి ప్రవక్త అయిన యెషయా ఆ పేరు తన కుమారునికి పెట్టాడు అన్నది ఇంగితజ్ఙానమున్న నిజవిశ్వాసులు ఎవరైనా ఇట్టే గ్రహించగలరు. కాని, దాని నెరవేర్పు వివరాలు లేఖన గ్రంథములో [పాతనిబంధనలో] లేవు. అలా వుండాలి అన్న నియమమేదీ లేదు. పేరుపెట్టిన వివరాలు గ్రంథములో లేని కారణాన్నిబట్టి యెషయా తన కుమారునికి దేవుడు చెప్పిన పేరును పెట్టలేదు అని వూహించుకోవటము సరికాదు.

పైన యివ్వబడిన లేఖన మాదిరిని అనుసరిస్తూ చూస్తే కన్యమరియ తన కుమారుని ఇమ్మానుయేలు అని పిలుచుకొన్నదని గ్రహించటానికి ఇంగితజ్ఙానముంటే సరిపోతుంది.

చివరిగా, ఇమ్మానుయేలు అంటే “దేవుడు మనకు తోడు” అని భావము. కన్యమరియ కుమారునికి దేవదూత ఆజ్ఙనను అనుసరించి యోసేపు యషువ [యేసు] అని పేరుపెట్టాడు. యషువ/యేసు [ישובה/Yah’Shua] అంటే “యెహోవా రక్షించును” అని భావము. “యెహోవా రక్షించును” అంటే “దేవుడు మనకు తోడు” అనే కదా దాని భావము! దేవుడు మనకు తోడు లేకపోతే “యెహోవా రక్షించును” అన్నది సాధ్యము కాదు. అందుచేత, “యెహోవా రక్షించును” అన్న పదజాలములో “దేవుడు మనకు తోడు” అన్న సత్యము నిక్షిప్తమై వున్నది. ఈ కారణాన్ని బట్టే యెషయా.7:14 లోని ప్రవచన నెరవేర్పు కన్యమరియ కుమారుడైన యేసు వారి జననము అన్నది మత్తయి.1:21-22 లో నిర్ధారించబడింది. ఈ ఉత్కృష్టమైన దైవసత్యాన్ని అవిశ్వాసులు అజ్ఙానులు గ్రహించజాలరు, విడమర్చిచెప్పినా స్వీకరింపలేరు.

అభ్యంతరము #7

“క్రైస్తవులు క్రొత్తనిబంధన గ్రంథములో క్రింది విశయాలు వ్రాసుకొన్నారు:

“యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; (మత్తయి.1:18-20)

“క్రైస్తవులు పైవిధంగా వ్రాసుకున్నారు కాబట్టి తద్వారా వారు పరాయి వ్యక్తి భార్యను అంటే యోసేపు భార్య అయిన మరియను దేవుడు ఆశించి వ్యభిచరించాడు అని చెప్పడముతో సమానము. ఈ రకమైన విశ్వాసముగల క్రైస్తవుల ఆలోచనావిధానము మతము ఎంత మూర్ఖమైనదో చెడ్డదో అర్థమవుతున్నది.”

వివరణ:

క్రొత్తనైబంధన గ్రంథము క్రైస్తవులు వ్రాసుకున్న గ్రంథము కాదు. యేసే [యషువ] క్రీస్తు [హమషియాఖ్] అన్న విశ్వాసములోకి వచ్చిన యూదులు దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాసిన లేఖనాల సంపుటి క్రొత్తనిబంధన గ్రంథము.

క్రొత్తనిబంధన గ్రంథము దైవగ్రంథముగా విశ్వసించే ఏ క్రైస్తవుడుకూడా “యోసేపు భార్య అయిన మరియను దేవుడు ఆశించి వ్యభిచరించాడు” అని విశ్వసించడు, చెప్పజాలడు. నిజానికి ఇంతటి నీచమైన నికృష్టమైన తలంపే క్రైస్తవుల దరికికూడా రాదు. ఈ రకమైన తలంపును భావనను క్రైస్తవులకు అంటగట్టే ప్రయత్నము చేసే వ్యక్తులు ఈ ప్రయత్నములో తమ స్వభావము తమను ప్రభావితం చేస్తున్న తమ మతస్వభావము ఎంత సంస్కారహీనమైనవో నీచాతినీచమైనవో నిరూపిస్తున్నారు. ఈ రకమైన అలోచనా సరళి దైవవిరోధి అయిన బయెల్జెబూలు [בַּעַל זְבוּב/Baal Zebub] యొక్క దాసుల ప్రత్యేకత.

ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ప్రభువైన దేవున్ని ఈ రకమైన దూషణకు గురిచేసేవారు అత్యంత శాపగ్రస్తులు. వారు అతిగొప్ప శిక్షకు పాత్రులు. అలాంటివారికి వారి మాటలతీరుకు దూరంగా వుండటం దైవసంబధులకు శ్రేయస్కరం!

 

Permalink to single post

దైవ ప్రణాళిక: యూదుల పాత్ర అన్యుల స్థానం

దేవుడు అందరికి దేవుడు

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] నరులందరిని ఒకే స్వరూపమందు ఒకే పోలికచొప్పున సృష్టించి వారందరికి ఒకే అశీర్వాదాన్ని అధికారాన్ని అనుగ్రహించి వారందరితో ఒకే సార్వత్రికనిబంధననుకూడా చేశాడు. ఆయన అందరికీ దేవుడు మరియు నాధుడు. ఆయనలో పక్షపాతంలేదు. అందుకే అందరినీ ప్రేమించి ఎవరూ నశించడం యిచ్చయించక అందరు మారుమనస్సు పొంది రక్షించబడాలని ఉద్దేశిస్తున్నాడు. అంతమాత్రమేగాక మెస్సయ్య అయిన యషువనందు అందరికి చాలిన రక్షణను సిద్ధపరచి దాన్ని అందరికి అందుబాటులో అంటే కేవలం విశ్వాసదూరములోనే వుంచాడు.  

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] కేవలం యూదులకు మాత్రమే కాదు సర్వశరీరులకు నాధుడు మరియు దేవుడు:

“కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో యిట్లనెను సర్వలోకనాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక” (యెహోషువ.3:9-10)

 సర్వలోకనాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.”(యెహోషువ.3:13)

“సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కు దువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.” (మీకా.4:13) 

“అతడు నాతో ఇట్లనెనుఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.” (జెకర్యా.6:5)

“వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి.” (సం.కాం.16:22)
“అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము.”
(సం.కాం.27:15)

“నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.” (యెషయా.54:5)

“నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?” (యిర్మీయా.32:27) 

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] కేవలం యూదులను మాత్రమేకాదు నరులందరిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించాడు:

“దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.” (ఆది.కాం.1:26-27)

“ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను; మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.” (ఆది.కాం.5:1-2)

“నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆది.కాం.9:6)

“దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.” (యాకోబు.3:9)

దేవుడు నరులందరిని ఆశీర్వదించి వారందరితో ఒక వాగ్ధానం చేశాడు:

మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి.” (ఆది.కాం.9:1)

మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.” (ఆది.కాం.9:8-10)

దేవుని నైతిక గుణలక్షణాలు

దేవుడు ప్రేమాస్వరూపి

ప్రభువైన దేవుని నైతిక గుణలక్షణాలలో ప్రేమ అతి ప్రాముఖ్యమైనది. ఉత్కృష్టమైన ప్రేమ త్యాగముతో ముడిపడి వుంటుంది. కృపాకనికరాలు ప్రేమలోని రెండు విభాగాలు. పరమతండ్రి తన సహజ గుణలక్షణమైన ప్రేమను తన స్వరూపమందు తన పోలికచొప్పున తానే సృష్టించిన మానవులందరికి పంచేవాడు. ఆ కారణాన్నిబట్టే ఆయన మానవుల కొరకు సిద్ధపరచిన రక్షణ అన్నది ఏ కొద్దిమంది కొరకో సిద్ధపరచబడింది కాదు. అది అందరి కొరకు ఏర్పాటుచేయబడిన దేవుని బహుమానము:

అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను.” (ని.కాం.34:6-7)

అందుకు యెహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడి పోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే; అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా [חוּס/khoos = to pity; look upon with compassion]? అని యోనాతో సెలవిచ్చెను.” (యోనా.4:10-11)

ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై” (తీతుకు.2:11)

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను.3:16)

నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.” (1యోహాను.2:1-2)

కాబట్టి మీరు వెళ్లి, సమస్తజనులను [గ్రీకు మూల పదం: ἔθνος/ఎత్నోస్ = జాతి/ప్రజ/జనాంగము] శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు” (మత్తయి.28:19)

మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.” (మార్కు.16:15-16)

యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.” (రోమా.10:12)

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.” (రోమా.1:16)

మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?” (రోమా.9:23-24)

దేవుడు పక్షపాతి కాదు

దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనము [గ్రీకు మూల పదం: ἔθνος/ఎత్నోస్ = జాతి/ప్రజ/జనాంగము] లోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపో.కా.10:34-35)

దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పునొందుదురు.” (రోమా.2:11-12)

ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.” (అపో.కా.17:30)

ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు.” (1తిమోతి.2:3-4)

కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (2పేతురు.3:9)

ప్రభువైన దేవుని [అదొనై ఎలోహిం] యొక్క రక్షణతోకూడిన ఆశీర్వాదాల ప్రణాలిక కేవలం యూదులకు మాత్రమేగాక భూలోకములోని వంశాలన్నింటికి చెందినది:

నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు [హీబ్రూ మూలపదము: מִשְׁפָחָה/mishpawkhaw/మిష్పఖ = a clan/కుటుంబాల సమూహము/తెగ] నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా” (ఆది.కాం.12:3) = (అపో.కా.3:25-26)

అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ]. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును [גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] ఆశీర్వదింపబడును.” (ఆది.కాం.18:18)

మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని నములన్నియు [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] నీ సంతానమువలన [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.” (ఆది.కాం.22:18) = (గలతి.3:8)  “ఏలయనగా నీకును నీ సంతానమునకును [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఇచ్చెదను. నీ సంతానమువలన [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] సమస్త భూలోకములోని సమస్త జనులు [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ] ఆశీర్వదింపబడుదురు.” (ఆది.కాం.26:4) = (గలతి.3:16)

నీ సంతానము [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు [హీబ్రూ మూలపదము: מִשְׁפָחָה/mishpawkhaw/మిష్పఖ = a clan/కుటుంబాల సమూహము/తెగ] నీ మూలముగాను నీ సంతానము [זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] మూలముగాను ఆశీర్వదింపబడును.” (ఆది.కాం.28:14) = (ప్రకటన.7:9)

భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ] నీ రక్షణ తెలియబడునట్లును” (కీర్తన.67:2) = (తీతుకు.2:11)

యెహోవా తన రక్షణను వెల్లడిచేసి యున్నాడు అన్యజనుల [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ] యెదుట తన నీతిని బయలుపరచియున్నాడు.ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి.” (కీర్తన.98:2-4)

సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.” (యెషయా.52:10) = (లూకా.3:6)

విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను [נֵכָר/నెకార్] నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు [עַם/అం] ప్రార్థనమందిరమన బడును. ఇశ్రాయేలీయులలో వెలివేయబడినవారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికిపైగా ఇతరులను కూర్చెదను.” (యెషయా.56:6-8)

వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను [כָּל־ הַגּוֹיִ֖ם/కాల్ హగ్గోవ్యిం–హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] ఆయా భాషలు మాట లాడువారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనులయొద్దకును [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపెదను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదను వారు జనములలో [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చు చున్నాడు. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు [כָל־ בָּשָׂר/కాల్ బాసార్] వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా.66:18-23)  

అన్యజనుల ప్రవేశం

వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.” (ద్వి.కాం.32:21)

ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును. అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి కొందురు వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును. సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.” (యెషయా.19:19-25)

నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.” (యెషయా.65:1)

నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు.” (యెహెజ్కేలు.16:60-61)

తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతునుఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు.2:28 -32)

సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులోనుండి భక్తిహీనతను తొలగించును; నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.” (రోమా.11:25-27)

అబ్రహాము మరియు యూదులు

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] అబ్రహాము మానవులందరిలో గొప్పవాడని లేక ప్రత్యేకమైనవాడని లేక నీతిమంతుడని ఎన్నుకోలేదు. తన సార్వభౌమత్వము, చిత్తము, మరియు స్వాతంత్ర్యమును బట్టి అబ్రహామును ఎన్నుకున్నాడు. ప్రభువైన దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు గనుక అబ్రహాము గొప్పవానిగా మరియు ప్రత్యేకమైనవ్యక్తిగా మారాడు.      

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] అబ్రహామును ఎన్నుకోవడములోని ఉద్దేశము కేవలము అబ్రహామును మరియు ఆయన సంతానాన్ని [ఇశ్రాయేలీయులు/యూదులు] మాత్రమే ఆశీర్వదించాలని లేక రక్షించాలని కాదు. సర్వశరీరులకు దేవుడైన ప్రభువు తాను సృష్టించిన మానవులందరిని ఆశీర్వాదించి అందరిని రక్షించాలన్న బృహత్ప్రణాళికతో అబ్రహామును ఎన్నుకొని ఆయన సంతానముద్వారా తన బృహత్ప్రణాళికను నెరవేర్చ సంకల్పంచినట్లు లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా అబ్రహాము సంతానమును ఎన్నుకొని వారిపట్ల వ్యవహరించిన తన విధానముద్వార ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] తననుతాను మానవాళికి ప్రత్యక్షపరచుకోవటం జరిగింది. క్రింది లేఖనాలే యిందుకు సాక్ష్యం: 

నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు [హీబ్రూ మూలపదము: מִשְׁפָחָה/mishpawkhaw/మిష్పఖ = a clan/కుటుంబాల సమూహము/తెగ] నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా” (ఆది.కాం.12:3) = (అపో.కా.3:25-26)

అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ]. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును [גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] ఆశీర్వదింపబడును.” (ఆది.కాం.18:18)

మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] నీ సంతానమువలన [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.” (ఆది.కాం.22:18) = (గలతి.3:8)  

ఏలయనగా నీకును నీ సంతానమునకును [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఇచ్చెదను. నీ సంతానమువలన [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] సమస్త భూలోకములోని సమస్త జనులు [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ] ఆశీర్వదింపబడుదురు.” (ఆది.కాం.26:4) = (గలతి.3:16)

నీ సంతానము [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు [హీబ్రూ మూలపదము: מִשְׁפָחָה/mishpawkhaw/మిష్పఖ = a clan/కుటుంబాల సమూహము/తెగ] నీ మూలముగాను నీ సంతానము [זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] మూలముగాను ఆశీర్వదింపబడును.” (ఆది.కాం.28:14) = (ప్రకటన.7:9)

పై కారణాన్నిబట్టి యూదులు గొప్పవారని లేక ప్రత్యేకమైనవారని లేక నీతిమంతులని ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] వారిని ఎన్నుకోలేదు అన్నది ప్రస్పుటమవుతున్నది. ప్రభువైన దేవుడు వారిని ఎన్నుకోవటాన్నిబట్టి వారు ప్రత్యేకమైన ప్రజగా గొప్పవారిగా మారారు. అయితే శోచనీయమైన విశయం ఏమిటంటే యూదులు పదేపదే తమ తిరుగుబాటుతనముతో అవిశ్వాసముతో ప్రభువైన దేవునితో చేయబడిన నిబంధనను కాలరాచి తమ కివ్వబడిన ప్రత్యేకతను గొప్పతనాన్ని పోగొట్టుకున్నారు. దాని పర్యవసానమే ఇశ్రాయేలీయులు లేక యూదులు ప్రపంచములో చెదరగొట్టబడటము.      

యూదులు తమ దేశములోనుండి అన్యదేశాలలోకి చెదరగొట్టబడటము అన్నది చరిత్రలో రెండుసార్లు సంభవించిన సంఘటన. 586 క్రీ.పూ. లో మొదటిసారిగా బబులోనురాజు నెబుకద్నెజర్ యూదులను చెరపట్టి తీసుకువెల్లాడు. 70 సంవత్సరాల తరువాత యూదులు తిరిగి తమ దేశానికి రావడం మొదలైంది. అటుతరువాత రెండవసారిగా 70 క్రీ.శ. లో రోమా సైన్యాధిపతి టైటస్ ఆధ్వర్యములో యెరూషలేములోని దేవుని మందిరము ద్వంసము చేయబడి లక్షకు పైగా యూదులు ఊచకోతకు గురికాగా మిగతా యూదులు యితరదేశాలకు చెదరగొట్టబడ్డారు.  

రెండు పర్యాయాలు సంభవించిన యూదులు చెదరగొట్టబడటము అన్నది దేవుని సంకల్పములో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ సంఘటన యొక్క రెండు సందర్భాలమధ్య ఒక విశిష్టమైన ప్రవచన నెరవేర్పును చూస్తాము. అది వాగ్ధానము చేయబడిన మెస్సయ్య యొక్క మొదటి ఆగమనము!  

మెస్సయ్య

మెస్సయ్య అంటే అభిషిక్తుడు. పాతనిబంధన లేఖనాల బోధ ప్రకారం ప్రవక్తలు, యాజకులు, మరియు రాజులు అభిషేకించబడినవారై తమకివ్వబడిన పాత్రలలో బాధ్యతలను నిర్వర్తించేవారు.

పాతనిబంధన లేఖనాలు [తనాఖ్] రాబోవు మెస్సయ్య ఇశ్రాయేలీయుల వంశానికి మోషేవంటి ప్రవక్తగా విచ్చేయబోతున్నాడన్న సత్యాన్ని మోషే కాలములోనే ప్రకటించాయి (ద్వి.కాం.18:15-19). ఇంకా, ఆయన తన ప్రజలపక్షంగా ప్రయశ్చిత్తార్థ బలిగా తననుతానే అర్పించుకొని మృత్యుంజయుడై (యెషయా.52:13-53:12; దానియేలు.9:26-27) మెల్కీసెదెకు క్రమములో వారిని పవిత్రపరచబోతున్న యాజకుడని (కీర్తన.110:4), అంతమాత్రమేగాక తన ప్రజలైన యూదులతోపాటు భూలోకములోని జనులందరిని పాలించే రారాజు (యెషయా.9:6-7; జెకర్యా 9:9-11; మీకా.5:2) అన్నది లేఖనాలు నిర్ద్వంద్వంగా సాక్ష్యమిస్తున్నాయి.

పాతనిబంధన గ్రంథము లేక తనాఖ్ గ్రంథములోని లేఖనాలలో భవిష్యవాణిద్వారా వాగ్ధానము చేయబడిన మెస్సయ్య పాత్ర ఈరకంగా అభిషేకాలతో కూడిన మూడు పాత్రల సమిష్టి నెరవేర్పు అన్నది లేఖన బోధ.

దైవసుతుడైన మెస్సయ్యను పాతనిబంధన లేఖనాలు ‘దేవుని సేవకుడు,’ ‘దేవుని కుమారుడు,’ ‘దేవుని వాక్కు,’ ‘నిబంధన దూత’ అంటూ సందర్భానుసారంగా ప్రత్యేకమైన బిరుదులతో పేర్కొనడం గమనార్హమైన విశయం.   

మెస్సయ్య ప్రారంభములో ప్రవక్తగా దైవసందేశాన్ని బోధిస్తూ పరమతండ్రి నిర్ణయించిన సమయములో మానవాళి తరపున యాజకునిగా తన్నుతాను పాపపరిహారార్థబలిగా అర్పించుకున్నాడు. ఇది భూలోకపు చట్టాలను ప్రతిబింబిస్తూ ప్రభుత్వాల అధికారాన్ని నిర్ధారిస్తూ నెరవేర్చబడిన కార్యం ఎంతమాత్రము కాదు. ప్రభువైన దేవుని చట్టపరిధిలో ఆయన నిత్యసంకల్పాన్ని బట్టి ఆయన ఆధ్వర్యములో వాస్తవరూపం దాల్చిన రక్షణకార్యం!

మృత్యుంజయుడైన మెస్సయ్య పరమతండ్రి యొక్క నియామక కాలములోనే రాజుగా భూలోకమంతటిని పాలించటానికి తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయ!

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. జీవవృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.” (ప్రకటన.22:12-14)

Permalink to single post

మెస్సయ్యనందు అన్యులు పొందే మేలు

ప్రభువైన దేవుడు [అదోనాయ్ ఎలోహిం] నరులందరిని ఒకే స్వరూపమందు ఒకే పోలిక చొప్పున సృష్టించి వారందరికి ఒకే అశీర్వాదాన్ని అధికారాన్ని అనుగ్రహించి వారందరితో ఒకే సార్వత్రిక నిబంధనను కూడా చేశాడు. ఆయన అందరికీ దేవుడు మరియు నాధుడు. ఆయనలో పక్షపాతం లేదు. అందుకే అందరినీ ప్రేమించి ఎవరూ నశించడం యిచ్చయించక అందరు మారుమనస్సు పొంది రక్షించబడాలని ఉద్దేశిస్తున్నాడు. అంతమాత్రమేగాక మెస్సయ్య అయిన యషువనందు అందరికి చాలిన రక్షణను సిద్ధపరచి దాన్ని అందరికి కేవలం విశ్వాసదూరములోనే వుంచాడు.  

“దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.” (ఆది.కాం.1:26-28)

“ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను; మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.” (ఆది.కాం.5:1-2) 

“నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆది.కాం.9:6)

“దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.” (యాకోబు.3:9)

“మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతికప్పగింపబడి యున్నవి.” (ఆది.కాం.9:1)

“మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.” (ఆది.కాం.9:8-10)

“కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో యిట్లనెను సర్వలోకనాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక” (యెహోషువ.3:9-10) 

సర్వలోకనాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.”(యెహోషువ.3:13)

“సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కు దువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.” (మీకా.4:13) 

“అతడు నాతో ఇట్లనెనుఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.” (జెకర్యా.6:5)

“వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి.” (సం.కాం.16:22)

“అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము.” (సం.కాం.27:15)

“నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.” (యెషయా.54:5)

“నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?” (యిర్మీయా.32:27)

దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనము [గ్రీకు మూల పదం: ἔθνος/ఎత్నోస్ = జాతి/ప్రజ/జనాంగము] లోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపో.కా.10:34-35)

దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పునొందుదురు.” (రోమా.2:11-12)

“ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.” (అపో.కా.17:30)

“ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు.” (1తిమోతి.2:3-4)

“కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (2పేతురు.3:9)

“ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై” (తీతుకు.2:11)

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను.3:16)

“నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.” (1యోహాను.2:1-2)

“కాబట్టి మీరు వెళ్లి, సమస్తజనులను [గ్రీకు మూల పదం: ἔθνος/ఎత్నోస్ = జాతి/ప్రజ/జనాంగము] శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు” (మత్తయి.28:19)

“మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.” (మార్కు.16:15-16) 

యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.” (రోమా.10:12)

“సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.” (రోమా.1:16)

“మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?” (రోమా.9:23-24)

Permalink to single post

‘యూదులు’ అంటే ఎవరు?

‘యూదుడు’ లేక ‘యూదులు’ అన్న పదం ‘యూదా’ అన్న హీబ్రూ నామవాచక పదములోనుండి వచ్చింది.

దేవుని స్నేహితుడుగా అలాగే విశ్వాసులకు తండ్రిగా పేరుప్రఖ్యాతులు పొందిన హెబ్రీయుడైన అబ్రహాముకు దేవుని వాగ్ధాన ఫలితంగా ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకు ఏశావు మరియు యాకోబు అనే యిరువురు కుమారులు జన్మించారు. వారిలో చిన్నవాడైన యాకోబును దేవుడు యెన్నుకొని ఆశీర్వదించాడు.

ఇశ్రాయేలు అనే పేరును పొందిన యాకోబుకు పన్నేండుమంది కుమారులు ఒక కుమార్తె జన్మించారు. యాకోబు లేక ఇశ్రాయేలు యొక్క పన్నెండుమంది కుమారులలోని నాలుగవకుమారుని పేరు యూదా.       

ఇశ్రాయేలు యొక్క పన్నెండుమంది కుమారుల సంతానము పన్నెండు గోత్రాలుగా విస్తరించింది. వీరందరిని అంటే పన్నెండు గోత్రాలలోని యాకోబు సంతానమంతటిని సర్వసాధారణముగా ‘ఇశ్రాయేలీయులు’ అంటూ బైబిలు పేర్కొంటుంది. 

రెండు రాజ్యాల ప్రారంభం

ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల సమిష్టి రాజ్యాన్ని పాలించిన చివరి రాజు సొలొమోను మరణము [930 క్రీ.పూ.]తరువాత ఇశ్రాయేలు రాజ్యము రెండు రాజ్యాలుగా అంటే ఉత్తరరాజ్యం మరియు దక్షిణరాజ్యంగా విడిపోయింది. పది గోత్రాలతో కూడిన ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలురాజ్యము అని రెండు గోత్రాలతో కూడిన దక్షిణ రాజ్యాన్ని యూదారాజ్యము అని పేర్కొంటారు. యూదా రాజ్యము ప్రధానంగా యూదా గోత్రము మరియు బెన్యామీను గోత్రము కలిపి ఏర్పరచబడినా వారితోపాటు లేవీయ గోత్రములోని కొందరు అలాగే షిమియోను గోత్రీకులు కొందరు కలిసారు. 

యూదా రాజైన ఆసా యేలుబడిలో [911-870 క్రీ.పూ.] ఉత్తర రాజ్యములోని ఎఫ్రాయిము, మనష్షే, మరియు షిమియోను గోత్రాలలోని అనేకమంది భక్తిపరులు వలసవచ్చి దక్షిణరాజ్యమైన యూదారాజ్యములో స్థిరపడ్డారు (2ది.వృ.15:9).     

రెండు రాజ్యాల చెఱ

722 క్రీ.పూ. లో ఉత్తరరాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యం అంటే పది గోత్రాల రాజ్యాన్ని అష్షూరీయులు జయించి ఆ గోత్రాలవారిని దాసులుగా తీసుకువెళ్ళారు. ఆ సందర్భములో కొందరు దక్షిణరాజ్యమైన యూదారాజ్యములోకి పారిపోవటము జరిగింది. మొదటి శతాబ్ధములో యెరూషలేములో ఆషేరు వంశములోనుండి వచ్చిన అన్న అను ఒక ప్రవక్తి యొక్క ఉనికి దీని పర్యవసానమేనని గ్రహించవచ్చు (లూకా.2:36-38). మరికొందరు ఉత్తర రాజ్యవాసులు అష్షూరీయులను తప్పించుకొని తమదేశములోనే జీవనం కొనసాగించారు. అయితే, అధిక సంఖ్యాకులు మాత్రం అష్షూరీయులచేతిలో బందీలుగా మారి వారికి దాసులుగా తీసుకువెళ్ళబడ్డారు. అలా వెళ్ళిన వారిలో అధికశాతం కాలక్రమంలో భూమి నలుమూలలకు చెదిరిపోవడం జరిగింది. 

ఉత్తర రాజ్యములోని ఇశ్రాయేలీయులను బందించి దాసులుగా తీసుకువెళ్ళిన అష్షూరీయులు ఉత్తర రాజ్య భూబాగమైన ఉత్తర పాలస్తీనా ప్రాంతములోకి తాము జయించిన అనేక అన్యజాతి ప్రజలను తెచ్చి స్థిరపరచారు. ఆ అన్యజాతులవారికి ఇశ్రాయేలు మతాన్ని బోధించేందుకు అష్షూరీయులు తాము దాసులుగా తీసుకువెళ్ళిన కొందరు లేవీయులను ఉత్తర పాలస్తీనాకు తిరిగి పంపించారు. ఈరకంగా తిరిగి వచ్చిన లేవియులు కాలక్రమములో పాలస్తీనాలో స్థిరపడిన అన్యజాతీయులను యూదామతములోకి మార్చారు (2రాజులు.17:24-41; ఎజ్రా.4:1-6). సమరయులు అలాంటివారికి చెందినవారే.            

586 క్రీ.పూ. లో దక్షిణరాజ్యాన్ని అంటే ప్రధానంగా యూదా మరియు బెన్యామీను గోత్రాలతో ఏర్పడినా కాలక్రమేణా మరికొన్ని యితర గోత్రాల వారికి కూడా ఆశ్రయముగా మారిన యూదారాజ్యాన్ని బబులోను రాజు నెబుకద్నెజరు జయించి అధిక సంఖ్యాకులను దాసులుగా బబులోనుకు తీసుకువెళ్ళాడు. వారిలోని ముఖ్యులు తిరిగి 444/5 క్రీ.పూ.లో తిరిగి తమ స్వదేశమైన యూదయకు వచ్చారు. 

దక్షిణ రాజ్యమైన యూదారాజ్యములోనివారు ప్రధానంగా పాలస్తీనాలోని యూదయ ప్రాంతవాసులు గనుక చెఱలోనున్నప్పుడు వారిని కల్దీయులు యూదులు అంటూ సంబోధించటం మొదలయ్యింది. కొంతకాలానికే ఆ ప్రాంతములోనుండి చెఱపట్టబడిన వచ్చినవారందరికి సమిష్టిగా యూదులు అన్న పేరు స్థిరపడిపోయింది.

యూదులు అన్న పేరుతో మొదట గుర్తించబడినవారు యూదా గోత్రపువారే అయినా కాలక్రమేణా వారితోపాటు బెన్యామీను గోత్రపువారు, లేవీయ గోత్రపువారు, షిమ్యోను గోత్రపువారు అలాగే ఆసా పరిపాలనలో ఉత్తర రాజ్యములోనుండి వలసవచ్చిన ఎఫ్రాయీము మరియు మనష్షే గోత్రపువారు అంతేగాక అష్షూరీయుల దాడినుండి తప్పించుకొని పారిపోయి వచ్చి దక్షిణ రాజ్యములో స్థిరపడిపోయిన ఉత్తర రాజ్యములోని పది గోత్రాల సంబంధికులుకూడా యూదా గోత్రపువారితో కలిసి యూదులుగా గుర్తించబడ్డారు.  

భావ విస్తరణ

445 క్రీ.పూ.లో బబులోను చెరలోనుండి విడిపించబడి తిరిగి స్వదేశమైన యూదయకు మరలివచ్చిన దక్షిణదేశవాసులను లేఖనాలు ఇశ్రాయేలీయులుగాకూడా గుర్తిస్తున్నాయి (ఎజ్రా.2:1-2, 70; 3:1; నెహెమ్యా.1:1-6; 7:73; 11:3, 20). ఈ నేపథ్యములో క్రమక్రమంగా ఇశ్రాయేలీయులు మరియు యూదులు అన్న పదాలు రెండు ఒకదానికొకటి పర్యాయపదాలుగా మారిపోయాయి అన్నది ప్రస్పుటమవుతున్నది.  

మొదటిశతాబ్దములో మెస్సయ్య ఆగమనానికల్లా యూదులన్నా ఇశ్రాయేలీయులన్నా ఒకే భావం వ్యక్తపరచబడేది. అందుకే మెస్సయ్య ‘యూదుల రాజు ‘ (మత్తయి.2:2; మార్కు.15:2) లేక ‘ఇశ్రాయేలు రాజు ‘ (మత్తయి.27:42; యోహాను.1:49; 12:13) అన్నది లేఖన బోధ. 

“ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి” (అపొ.కా.2:5). అపోస్తలుడైన పేతురు పెంతెకోస్తు దినాన యెరూషలేములో కాపురమున్న ఆ యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ పలికిన మాటలు (అపొ.కా.2:14-36):

యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్తజనులారా, యిది మీకు తెలియునుగాక…ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి…దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను…మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.

పేతురు పలికిన పై మాటలలో ఒకే భావాన్ని వ్యక్తపరచటానికి ‘యూదులు’ మరియు ‘ఇశ్రాయేలువారు’ అన్న రెండు పదాలను మార్చిమార్చి వాడటాన్ని గమనించవచ్చు. నిజానికి పేతురు తన ప్రసంగాన్ని యూదులను ఉద్దేశించి పలుకుతూ వారిని ఇశ్రాయేలువారలారా అంటూ కూడా సంబోధిస్తున్నాడు. కారణం? యూదులు అన్నా లేక ఇశ్రాయేలీయులు అన్న ఒకే భావం గనుక!  

కాలక్రమములో యూదులు అన్న పదప్రయోగము యొక్క భావము అంచెలంచెలుగా విస్తరించిన విధానము:

  • యూదా గోత్రపువారు
  • యూదా గోత్రము మరియు బెన్యామీను గ్రోత్రము
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము మరియు లేవి గోత్రము
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము, లేవీ గోత్రము మరియు షిమ్యోను గోత్రము
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము, లేవీ గోత్రము, షిమ్యోను గోత్రము మరియు ఎఫ్రాయీము మనష్షే గోత్రాలు
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము, లేవీ గోత్రము, షిమ్యోను గోత్రము, ఎఫ్రాయీము మనష్షే గోత్రాలు మరియు ఉత్తరరాజ్యములోని పది గోత్రాలలోనుండి వలసవచ్చిన పదిగోత్రాల శేషము
  • పన్నెండు గోత్రాలు లేక ఇశ్రాయేలీయులు

మెస్సయ్య ప్రజలు

మెస్సయ్య అయిన యషువ “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును” (మత్తయి.1:21). ఆయన ప్రజలు ఇశ్రాయేలీయులు లేక యూదులు. ఆ కారణాన్ని బట్టే ఆయన “ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్రెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకు నేను పంపబడలేదు” అని తన పరిచర్య యొక్క అర్దభాగములో ప్రకటించాడు (మత్తయి.15:24). అయితే, లేఖనాలు ఆయన “తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు” (యోహాను.1:11) అంటూ ఘోషిస్తున్నాయి. ఇందునిమిత్తమే చివరికి మెస్సయ్య యూదులతో/ఇశ్రాయేలియులతో తెగేసి ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది, “కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.” (మత్తయి.21:43).

ఈ నేపథ్యములో మెస్సయ్య తన మరణపునరుత్థానాలతదుపరి తన శిష్యులకు ఆజ్ఙాపించాడు: కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి (మత్తయి.28:19); మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి (మార్కు.16:15); యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడును (లూకా.24:47).             

ఇశ్రాయేలు ప్రజలలోని ఉత్తర రాజ్యనివాసులలో అధికశాతం ప్రజలు అష్షూరు రాజులచేత చెరపట్టబడి ప్రపంచ దేశాలన్నిటిలోకి చెదరగొట్టబడ్డారు. గత 2700 సంవత్సరాల కాలములో వారు తిరిగి తమ స్వదేశమైన ఉత్తర పాలస్తీనాకు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. అయితే, ప్రభువైన దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తలద్వారా వారిని తిరిగి తమ స్వదేశములో సమకూరుస్తాను అంటూ అనేక పర్యాయాలు వాగ్ధానము చేశాడు (యిర్మీయ.23:3; 31:7-8; 32:37; యెషయా.11:11-12,16). ఈ వాగ్ధానాల నెరవేర్పు మెస్సయ్య యొక్క రెండవ రాకడ సందర్భములో నెరవేర్చబడబోతున్నాయి. 

సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును; నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.” (రోమా.11:25-27)      

Permalink to single post

మౌఖిక తోరాహ్: రబ్బీల దగా

దాదాపు 1400 క్రీ.పూ.లో అదోనాయ్ ఎలోహిం [ప్రభువైన దేవుడు] మోషేద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఒక నిబంధనను చేసాడు. ఆసందర్భములో ఇశ్రాయేలీయులకు మోషేద్వారా ఎలోహిం ఒక ఉపదేశాన్ని లేక ధర్మాన్ని అందించాడు. ఆ ఉపదేశాన్నే మోషే ధర్మశాస్త్రము [תּֽוֹרַת מֹשֶׁ֣ה/తవ్రాత్ మోషే] లేక ‘తోరాహ్’ [תּוֹרָה/తోరాహ్] అని లేఖనాలు పేర్కొంటున్నాయి.

ఎలోహిం [దేవుడు] యొక్క ఆజ్ఙను బట్టి దైవజనుడు మోషే ఆ ఉపదేశాన్ని/ధర్మాన్ని అంతటిని గ్రంథస్త రూపములో భావితరాలవారికొరకై భద్రపరచాడు. గ్రంథస్తరూపములోని ఉపదేశానుసారంగానే జీవించాలంటూ ఇశ్రాయేలీయులకు ఎలోహిం [దేవుడు] స్పష్టమైన సూచనలను తనాఖ్ లో [పాతనిబంధన గ్రంథములో] అందించాడు. కాని, గ్రంథానికి వేరుగా కేవలం మౌఖికంగా యివ్వబడిన సూచనలనుగురించి అంటే రబ్బీలు బోధిస్తున్న మౌఖిక తోరాహ్ ను గురించి ఎలోహిం [దేవుడు] ఏ మాటా చెప్పలేదు.

క్రీస్తుశకం మొదటిశతాబ్ధము తరువాత యూదు మతపెద్దలు అంతకు ముందు ఏ ప్రవక్త కనీ వినీ ఎరుగని రెండవ తోరాహ్ లేక మౌఖిక తోరాహ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మౌఖిక తోరాహ్ యొక్క వ్రాతరూప సంకలనాన్నే యూదు మతస్తులు మిష్నా [מִשְׁנָה] అని పేర్కొంటారు.

మిష్నా [מִשְׁנָה] అంటే హీబ్రూ భాషలో “వల్లేవేయడం ద్వారా ధ్యానించటము” అని భావం. మిష్నా ఆరు ఆదేశాలుగా [orders] విభజించబడింది. ఈ ఆదేశాలలోని ప్రతి ఆదేశం 7-12 వ్యాసాలు [tranctates] గా వ్రాయబడింది. వెరసి అన్నీ కలిపి 63 వ్యాసాలుగా మిష్నా సంకలనం చేయబడింది.

యూదుమతపెద్దలైన రబ్బీలు వ్రాసి ప్రవేశపెట్టిన ‘మౌఖిక తోరాహ్’ [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్/Oral Torah] అన్నది తనాఖ్ [39 గ్రంథాలతో కూడిన పాతనిబంధన గ్రంథము] కు పూర్తిగా వ్యతిరేకమైనది. అందుకుగల కారణాలు ఈ క్రింద యివ్వబడినవి:

(1) యూదుమతపెద్దలైన రబ్బీలను వారి బోధలను ప్రామాణికంగా స్వీకరించెందుకు తనాఖ్ గ్రంథములో ఎలాంటి సూచన యివ్వబడలేదు. నిజానికి యూదుమతపెద్దలు తమకుతాము అలంకరించుకున్న ‘రబ్బీ(లు)’ అన్న పదమే తనాఖ్ గ్రంథములో ఉపయోగించబడలేదు. 

(2) ‘మౌఖిక తోరాహ్’ [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్/Oral Torah] అన్న పదజాలము తనాఖ్ లో ఒక్క సారికూడా పేర్కొనబడలేదు.

(3) తనాఖ్ లో రెండు తోరాలున్నాయి అన్న మాటలేవీ వ్రాయబడలేదు.

(4) “లేని వార్తను పుట్టిచకూడదు” (ని.కాం.23:1-2) అన్నది తోరాహ్ లోని అతి ప్రాముఖ్యమైన ఆజ్ఙ. తోరాహ్ లో లేని ‘మౌఖిక తోరాహ్’ [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్/Oral Torah] ను ప్రవేశపెట్టడమన్నది పరమతండ్రికే వ్యతిరేంకంగా లేని వార్తను పుట్టించడము! అలాంటి సాహసము ఏ మానవుడు చేయకూడదు. ఒకవేల ఎవరైనా ఆ సాహసం చేస్తే దైవసంబంధులెవరు ఆ వ్యక్తితో సహవసించకూడదు. 

(5) మోషేద్వారా ఇశ్రాయేలీయులకు యివ్వబడిన తోరాహ్ కు మార్పులుచేర్పులు చేసే హక్కు కేవలం దాన్ని యిచ్చిన పరమతండ్రి అదొనాయ్ ఎలోహింకు [ప్రభువైన దేవుడు] మాత్రమే చెందినది. నరులెవ్వరికీ ఆ హక్కు యివ్వబడలేదు. పండితులైనా పాష్టర్లు అయినా, రాజులైనా రబ్బీలైనా, క్రైస్తవులైనా యూదులైనా మోషేధర్మశాస్త్రాన్ని మార్చేందుకు ఎవరికీ హక్కు లేదు.

మోషేధర్మశాస్త్ర విషయములో ఎవైనా మార్పులు తీసుకురావాలని పరమతండ్రి ఉద్ధేశిస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని ఏవిధంగా తన సేవకుడు మరియు ప్రవక్త అయిన మోషేద్వారా అందించాడో అదేవింధంగా తన సేవకులైన ప్రవక్తలద్వారానే ఆ ధర్మశాస్త్రానికి తన చిత్తప్రకారమైన మార్పులను ప్రవేశపెట్టగలడు. అంతేగాని, ధర్మశాస్త్రానికి మాటలను కలపటంగాని లేక తీసివేయటంగాని పండితులచేత, పాష్టర్లచేత, గొప్పవారిచేత లేక రబ్బీలచేత ఎట్టిపరిస్తితులలోను చేయించడు. అలాంటి ప్రయత్నము అదొనాయ్ ఎలోహింకు వ్యతిరిక్తమైనది.

అయితే, పండితులుగా రాజులుగా తమనుతాము పరిచయం చేసుకునే యూదుమతపెద్దలైన రబ్బీలు మోషేధర్మశాస్త్రానికి వేరుగా రెండవ తోరాహ్ ను సృష్టించుకొని అదొనాయ్ ఎలోహింకు [ప్రభువైన దేవునికి] వ్యతిరేకంగా యూదు సంస్కృతి ముసుగులో వేరొక మతధర్మాన్ని ప్రవేశపెట్టి అనేకులను మార్గభ్రష్టత్వం పట్టిస్తున్నారు.

మోషే వ్రాసిన తోరాహ్ గ్రంథానికి అంటే మోషేద్వారా యివ్వబడిన పంచకాండాలకు ఏమాటలను కలపకూడదని అలాగే ఏమాటలను తీసివేయకూడదని వాటిని అందుకున్న యూదు సమాజానికి మోషే వ్రాసిన తోరాహ్ లో స్పష్టమైన ఆజ్ఙ యివ్వబడింది:  

కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. (ద్వి.కాం.4:1-2) 

పై లేఖన వెలుగులో మోషేద్వారా యివ్వబడిన దేవుని మాటలకు అంటే మోషే తోరాహ్ కు ఏకంగా మరొక తోరాహ్ అంటే ‘మౌఖిక తోరాహ్’ ను కలపడమన్నది ఊహకందనంత విస్తారమైన దైవవ్యతిరేక పాపము. ఈ పాపములో ఏదైవసంబంధులుకూడా ప్రత్యక్షంగానైన లేక పరోక్షంగానైనా పాల్గొనకూడదు.  

(6) ప్రభువైన దేవుడు సెలవిస్తున్నదాని ప్రకారం మానవుల విధులనుబట్టి నేర్చుకున్న భయభక్తులు దేవునికి అంగీకారము కావు:    

ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి. (యెషయా.29:13) 

పై లేఖన వెలుగులో యూదు మతపెద్దలైన రబ్బీలు మౌఖిక తోరాహ్ పేరుతో బోధిస్తున్న స్వంత అభిప్రాయాలను, పారంపర్యాచారాలను, మరియు విధులను పాటించడమన్నది ప్రభువైన దేవునికి విరుద్ధమన్న సత్యం మరచిపోకూడదు. 

(7) మోషేద్వారా వ్రాయబడిన తోరాహ్ [ధర్మశాస్త్రము] గ్రహించలేనంత కఠినమైనది కాదు అందుకోలేనంత దూరమైనది కాదు అంటూ లేఖనమే సాక్ష్యమిస్తున్నది:  

ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును. నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. (ద్వి.కాం.30:10-11) 

పై లేఖన ప్రకటనను బట్టి గ్రంథ రూపములోనున్న తోరాహ్ ను వివరించేందుకు మరొక తోరాహ్ లేక మౌఖిక తోరాహ్ ను అందించాల్సిన ఆవశ్యకత ఎంతమాత్రము లేదు.

(8) క్రీస్తుశకం రెండవ శతాబ్ధం నుండే మౌఖిక తోరాహ్ [Oral Torah] అన్న పదప్రయోగము, ప్రతిపాదన మరియు సిద్ధాంతం వునికిలోకి వచ్చాయి. తత్ఫలితంగా రబ్బీల నిర్విరామ కృషి క్రీస్తు శకము ఐదవ శతాబ్ధముకల్లా మౌఖిక తోరాను గ్రంథస్తరూపములో ప్రత్యక్షం చేయగలిగింది. అంతకుముందు మౌఖిక తోరాహ్ అన్న పదప్రయోగముగాని లేక అలాంటి తోరాహ్ ఉనికి యొక్క సమాచారముగాని లేవు.

ఒకవేల క్రీస్తుకు పూర్వమే వాటికి ఉనికి వుండివుంటే యూదు మతవిశ్వాసాలలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న వాటి ఉనికిని గూర్చిన సమాచారము క్రీస్తుకు పూర్వము వ్రాయబడిన యూదు గ్రంథాలలో [Apocripha] లేక క్రీస్తుకు పూర్వం మూడవ మరియు మొదటి శతాబ్ధాల మధ్య వ్రాయబడి భద్రం చేయబడిన కొన్ని వేల సంఖ్యలో వున్న మృతసముద్ర-తాళపత్ర ప్రతులలో [Dead Sea Scrolls] తప్పకుండా పేర్కొనబడేవే. కాని, అలాంటిది యేది జరుగలేదు. కారణం, క్రీస్తుకు పూర్వం అవి ఉనికిలో లేవు. క్రీస్తు తరువాత రబ్బీల చలువతో ఉనికిలోకి వచ్చింది మౌఖిక తోరాహ్!

(9) లిఖిత తోరాహ్ తోపాటు మౌఖిక తోరాహ్ కూడా మోషే ఎలోహిం నుండి అందుకున్నాడు అని చెప్పే రబ్బీల కథనం కేవలం ఒక కపట ప్రయత్నమేతప్ప అందులో సత్యం లేశమాత్రమైనా లేదు అనడానికి మరొక లేఖనసాక్ష్యం ధర్మశాస్త్రాన్ని అంటే లిఖిత తోరాహ్ ను అందుకున్న తరువాత మోషే కొన్ని సందర్భాలలో కార్యాచరణ విశయములో ఎలోహిం యొక్క సూచనలకై ఎదురుచూడటం. ఈ రకమైన సందర్భాలలో నాలుగు ప్రధానమైనవి ఈ క్రింద యివ్వబడినవి:

అ) సంఖ్యాకాండము 9:5-8

యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుటవలన అపవిత్రులమైతివిు; యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని అడుగగా మోషేనిలువుడి; మీ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసి కొందునని వారితో అనెను.”

ఆ తరువాత ఆ సందర్భములో మోషే చేయవలసిన వివరాలను ఎలోహిం [దేవుడు] మోషేకు తెలియచేసాడు. ఒకవేల మౌఖిక తోరాహ్ అన్నది అదివరకే మోషేకు అందించబడితే ఈ సందర్భములో మోషే ఎలోహిం [దేవుని] యొక్క వివరణకై ఎదురుచూడాల్సి వచ్చేది కాదు.

ఆ) సంఖ్యాకాండము 15:32-36

ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్ద కును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొనివచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను.”

గమనిక: మౌఖిక తోరాహ్ [Oral Torah] లో సూచించబడిన దాని ప్రకారము సబ్బాతు దినాన కట్టెలు యేరుకునేవ్యక్తులకు విధించబడాల్సిన శిక్ష ‘రాల్లతో కొట్టి చంపడం’ [మైమోనిడెస్, మిష్నెహ్ తోరాహ్, షబ్బాత్ 1].

కనుక, ఈ వివరాన్ని కలిగివున్న మౌఖిక తోరాహ్ [Oral Torah] ను మోషే లిఖిత తోరాహ్ తోపాటు అందుకొని వుండివుంటే ఆ సందర్భములో ఎలోహిం యొక్క సూచనకొరకు తిరిగి కనిపెట్టేవాడు కాదు. కాని మోషే ఆ సందర్భములో ఎలోహిం యొక్క సూచనకొరకు వేచివుండాల్సి వచ్చింది. కారణం, మోషేకు తెలియని మౌఖిక తోరాహ్ [Oral Torah] అన్నది రబ్బీల స్వంత సృష్టి!
 
ఇ) సంఖ్యాకాండము 27:1-7

అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణ మాయెను. అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతిబొందెను. అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.”

మోషే వద్ద మౌఖిక తోరాహ్ వుండివుంటే పై లేఖనాలలో వ్యక్తపరచబడినవిధంగా సెలోపెహాదు కుమార్తెల సమస్యకు పరిష్కారం మోషే వెంటనే అందించివుండేవాడు. కాని మోషే వద్ద మౌఖిక తోరాహ్ అన్నదేదీ లేకుండింది కాబట్టే వారి సమస్యకు ఎలోహిం [దేవుని] యొక్క సూచనలకై వేడుకోవలసి వచ్చింది.

ఈ) లేవికాండము 24:10-14

ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ​​ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసి కొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమార్తె. యెహోవా యేమి సెలవిచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. శపించినవానిని పాళెము వెలుపలికి తీసి కొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను.”

పై లేఖనాల వెలుగులో దైవదూషణకు మరణదండన అన్నది ఎలోహిం వివరించేంతవరకు ఇశ్రాయేలీయులు మరియు మోషే ఎదురుచూడాల్సి వచ్చింది. రబ్బీల కథనం ప్రకారం అదివరకే అందించబడి లిఖిత తోరాహ్ గా మార్చబడిన ఎలోహిం యొక్క సూచనలలో లేని వివరాలు మౌఖిక తోరాహ్ లో వుండాలి. అయితే, మౌఖిక తోరాహ్ అన్నది కేవలం క్రీస్తు శకములోని రబ్బీల సృష్టి కాబట్టి మోషేవద్ద అలాంటిదేది లేకుండింది. ఆ కారణాన్నిబట్టి ఆ సందర్భములో పాటించాల్సిన కార్యాచరణాన్ని తెలుసుకునేందుకు ఎలోహిం [దేవుని] యొద్దనుండి మోషే ఎదురుచూడాల్సివచ్చింది. అది తెలియపరచబడిన తరువాత ఆ వివరాలు లిఖిత తోరాహ్ లో చేర్చబడ్డాయి.

(10) రబ్బీలు తమ మతానికి ప్రధాన పునాదియైన రెండవ తోరాహ్ కు చెల్లుబాటును తెచ్చుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా, రెండవ తోరాహ్ మోషేనుండి మౌఖికంగా తరతరాలకు అందించబడింది అంటూ వ్రాతపూర్వకంగా యివ్వబడిన తోరాహ్ లోని ప్రకటనకే వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తూ అమాయకులను తప్పుదోవపట్టిస్తున్నారు.

గ్రంథస్తరూపములోని తోరాహ్ ప్రకటిస్తున్న సత్యము ప్రకారము ప్రభువైన దేవుడు తనతో మాట్లాడిన మాటలన్నింటిని దైవజనుడు మోషే వ్రాసి పెట్టాడు.

దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.” (ని.కాం.20:1)

మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి” (ని.కాం.24:4)

పై లేఖనాల సాక్ష్యం ప్రకారం కేవలం ఆజ్ఙలను మాత్రమే కాదు వాటి వివరాలతో సహా యెహోవా పలికిన మాటలన్నింటిని మోషే వ్రాసాడు.

మోషే వద్ద తాను వ్రాసి యిచ్చిన దేవుని మాటలకు అంటే లిఖిత తోరాహ్ కు వేరైన దేవుని మాటలంటూ వేరే ఏవీ లేవు అన్న సత్యం పై లేఖనాధారంగా ప్రస్పుటమవుతున్నది. అయినా, ఈ సత్యానికి వ్యతిరేకంగా రబ్బీలు తమ స్వసృష్టియైన మౌఖిక తొరాహ్ [Oral Torah] మోషే ద్వారానే యివ్వబడింది అంటూ ప్రభువైన దేవునికి మరియు ఆయన సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా అసత్యాలను పుట్టించుకొని తద్వారా తమ మతాన్ని సమర్ధించుకునే మోసయుక్తమైన ప్రయత్నాన్ని చేపట్టారు. లేఖన జ్ఙానం లేని ఆమాయకులు అనేకులు వారి మోసానికి బలియై అసత్య మార్గములో ప్రవేశిస్తున్నారు.

(11) ప్రభువైన దేవుడు మోషేద్వారా గ్రంథ రూపములో అందించిన తోరాహ్ [ధర్మశాస్త్రము] దాదాపు ముప్పై సార్లకు పైగా తనాఖ్ [పాతనిబంధన గ్రంథము] లో విస్పష్టంగా పేర్కొనబడింది. అయితే, రబ్బీలు చెప్పుకుంటున్న ‘మౌఖిక తోరాహ్’ [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్/Oral Torah] అంటే మోషే చేత గ్రంథస్థము చేయబడకుండా కేవలము మాటల రూపములో అందించబడిన  రెండవ తోరాహ్ గురించి మాత్రము తనాఖ్ [పాతనిబంధన గ్రంథము] లో ఎక్కడా చెప్పబడలేదు అన్నది గమనార్హమైన విశయము: 

నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల…” (ద్వి.కాం.28:58)

మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును.” (ద్వి.కాం.28:61)

అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును. ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపరచును.” (ద్వి.కాం.29:20-21) 

గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను.” (ద్వి.కాం.29:27)

ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును.” (ద్వి.కాం.30:10)

అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” (యెహోషువ.1:7-8)

మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.” (యెహోషువ.8:30-32)

ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్ల లును వారి మధ్యనుండు పరదేశులును వినుచుండగా యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్క టియు లేదు.” (యెహోషువ.8:34-35)

కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసికొని, యెడమకుగాని కుడికిగాని దానినుండి తొలగిపోక…” (యెహోషువ.23:6)

నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి,ఆయన మార్గముల ననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము;” (1రాజులు.2:3)

అయితే కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింప కూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపమునిమిత్తము వాడే మరణ శిక్ష నొందును, అని మోషే వ్రాసియిచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా యిచ్చిన ఆజ్ఞనుబట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు.” (2రాజులు.14:5)

మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది.” (2రాజులుs.22:13)

రాజు ఒక స్తంభముదగ్గర నిలిచియెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి.” (2రాజులు.23:3)

అంతట రాజునిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞాపింపగా” (2రాజులు.23:21)

మరియు కర్ణపిశాచి గలవారిని సోదెచెప్పువారిని గృహదేవతలను విగ్రహములను, యూదాదేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను.” (2రాజులు.23:24)

“గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.” (1ది.వృ.16:39-40)

మరియు మోషే యిచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడినదానినిబట్టి ఉత్సాహముతోను గానముతోను యెహోవాకు అర్పింపవలసిన దహనబలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు, లేవీయులైన యాజకుల చేతిక్రింద నుండునట్టియు, యెహోవా మందిర మందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలివారికి యెహోయాదా నిర్ణయించెను.” (2ది.వృ.23:18)

మరియు యెహోవాధర్మశాస్త్రమునందు వ్రాయబడియున్న విధినిబట్టి జరుగు ఉదయాస్తమయముల దహనబలులను విశ్రాంతిదినములకును అమావాస్యలకును నియా మకకాలములకును ఏర్పడియున్న దహనబలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలోనుండి రాజు ఒక భాగమును ఏర్పాటుచేసెను.” (2ది.వృ.31:3)

మీరు వెళ్లి దొరకిన యీ గ్రంథములోని మాటలవిషయమై నాకొరకును, ఇశ్రాయేలు యూదావారిలో శేషించి యున్నవారికొరకును యెహోవాయొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడియున్న సమస్తమును అనుసరింపకయు, యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది.” (2ది.వృ.34:21)

ఆలకించుడి, నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడియున్న శాపములన్నిటిని రప్పించెదను.” (2ది.వృ.34:24)

పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను.” (2ది.వృ.34:31)

మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసికొనిరి.” (2ది.వృ.35:12)     

యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీ యేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము నందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.” (ఎజ్రా.3:2)

మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి,ఏ దినమునకు నియ మింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.” (ఎజ్రా.3:4)

మరియు వారు యెరూష లేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి.” (ఎజ్రా.6:18)

ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరును ఏక మనస్కులై, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రగ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా యేడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి యెదుటను ఆ ధర్మశాస్త్రగ్రంథము తీసికొనివచ్చి…” (నెహెమ్యా.8:1-2)

యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుటకనుగొనెను. మరియు వారు తమ పట్టణము లన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను.” (నెహెమ్యా.8:14-15)

మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించుకొంటిమి.” (నెహెమ్యా.10:34)

మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.” (నెహెమ్యా.10:36)

“ఇశ్రాయేలీయులందరు నీ ధర్మశాస్త్రము నతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితివిు గనుకనేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మామీద కుమ్మరించితివి.” (దానియేలు.9:11)

మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడునడవడి మానక పోతివిు; నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతివిు.” (దానియేలు.9:13)

« Older Entries Recent Entries »