Category Archives: బైబిలు

Permalink to single post

పాతనిబంధన Vs. క్రొత్తనిబంధన

జూడాయిజంవారి దుర్బోధ

జూడాయిజంలోని కొందరు లేఖనాలను వక్రీకరిస్తూ క్రొత్తనిబంధనను గురించి చేస్తున్న అసత్యబోధలలో క్రొత్తనిబంధనను గురించి క్రింది విధంగా వ్యాఖ్యానిస్తున్నారు:

  • క్రొత్తనిబంధన అంటే మోషేద్వారా చేయబడిన నిబంధనను కేవలము తిరిగి నూతనపరచడము మాత్రమే. [❌]
  • క్రొత్తనిబంధన అంటే దేవుడు కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేయబోతున్న నిబంధన. [❌]
  • క్రొత్తనిబంధన అంటే యేసు [యషువ] ద్వారా చేయబడిన నిబంధన కాదు. అందుకుగల కారణం, క్రొత్తనిబంధన తరువాత ఇశ్రాయేలీయులందరు రక్షించబడుతారు అన్న వాగ్ధానం ఇంకా నెరవేరబడలేదు. [❌]
  • క్రొత్తనిబంధన అంటే యేసు [యషువ] ద్వారా చేయబడిన నిబంధన కాదు. అందుకుగల మరొక కారణం, క్రొత్తనిబంధన తరువాత అందరు యెహోవాను ఎరుగుదురు గనుక ఒకరికొకరు యెహోవాను గురించి బోధచేసే అవసరత వుండదు. కాని, అలాంటి జ్ఙానం ఇంకా క్రొత్తనిబంధనలో ప్రవేశించామని ప్రకటిస్తున్న క్రైస్తవులకు రాలేదు. దీన్నిబట్టి యేసు [యషువ] ద్వారా చేయబడిన నిబంధన క్రొత్తనిబంధన కాదు. [❌]

లేఖనాల సద్బోధ

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యిపట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ.31:31-32)

పై లేఖనాలలో ప్రభువైన దేవుడు వాగ్ధానం చేసిన నిబంధన ఒక క్రొత్తనిబంధన. అది కేవలము నూతనపరచబడబోతున్న అదివరకేవుండిన నిబంధన కాదు. ఈ సరికొత్తనిబంధనను గూర్చి పాతనిబంధన కాలములోని ప్రవక్తలద్వారా దేవుడు అనేక వివరాలను ప్రవచనరూపములో అందించాడు (ద్వి.కాం.32:21,43; కీర్తనలు 117:1-2; యెషయా 11:10, 42:5-7; 45:20-25, 49:5-8, 55:3-5, 59:20-21, 65:1; యిర్మీయా.31:31-34; యెహెజ్కేలు 16:60-62, 37:24-28; హోషేయ 2:14-23; జెకర్యా 9:9-17; మలాకి 1:10-11 = లూకా 22:19-20; రోమా.8:2; 1కొరింథీ.11:25; గలతీ.6:2; 1 తిమోతీ.2:3-6; హెబ్రీ.9:15, 12:24).

పాత/మోషే నిబంధన మరియు దానితరువాత చేయబడే క్రొత్తనిబంధన అన్నవి రెండు వేరువేరు నిబంధనలు. లేఖనాల సమగ్ర బోధను కూలంకశంగా పరిశీలించి చూస్తే పాతనిబంధనకు మరియు క్రొత్తనిబంధనకు మధ్యగల వ్యత్యాసాలు అవగతమవుతాయి.

పాతనిబంధన

మోషేనిబంధన (Mosaic Covenant) లేక పాతనిబంధనను (Old Covenant) గురించి లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం:

(1) మోషేనిబంధనను దేవుడు లోకములోని ప్రజలందరితో చేసిన నిబంధనగా లేఖనాలు ఎక్కడా పేర్కొన లేదు.

(2) మోషేనిబంధన అన్నది దేవుడు మోషేకంటే ముందు ఉండిన ప్రజలతో లేక ఇశ్రాయేలీయులతో లేక భక్తులతో చేసిన నిబంధన కాదు.

మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.” (ద్వి.కాం.5:2-3)

పై లేఖన సాక్ష్యం ప్రకారం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరియు పన్నెండు గోత్రాల పితరులుగాని లేక హేబేలు, హానోకు, మరియు నోవహు వంటి పాతనిబంధన పరిశుద్ధులలో ఎవరికి మోషే నిబంధనలో పాలు లేదు.

(3) దేవుడు మోషేనిబంధనను కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేస్తాను/చేసాను అని ఎక్కడా ప్రకటించలేదు.

(4) మోషేనిబంధన అన్నది దేవుడు ప్రధానంగా మోషే నాయకత్వములో ఐగుప్తులోనుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులందరితో చేసిన నిబంధన.

అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. ” (ని.కాం.24:7-8)
ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్త రింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.” (లేవీ.కాం.26:9)
ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మంద సమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు.” (2దిన.వృ.5:10)
యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.” (న్యాయాధిపతులు 2:1)

(5) మోషేనిబంధనను దేవుడు ఇశ్రాయేలీయులతోనేగాక వారితోకలిసి వారిమధ్య నివసిస్తూ వారితోపాటే పయనిస్తూ వాగ్ధత్తదేశమైన కనానుదేశములోకి ప్రవేశించబోతున్న అన్యులతో కూడా చేశాడు.

నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము గాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను, ​నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకులేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను…మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.29:10…29)

(6) మోషేనిబంధనను చేస్తున్న సమయములో అక్కడ లేనివారితో అంటే అక్కడవున్నవారి యొక్క రాబోవు తరాలవారితో సహితము దేవుడు ఆ నిబంధనను చేశాడు.

నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. …రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతివారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.29:14…29)

(7) మోషేనిబంధనద్వారా చేయబడిన వాగ్ధానాలు ప్రధానంగా ఇహలోకానికి చెందినవి.

నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును…అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.” (ద్వి.కాం.28:1..14)

(8) మోషేనిబంధనలో పాలుపొందేవారు దేవుని ఆజ్ఙలను న్యాయవిధులను తామే హృదయాలలో వ్రాసుకోవాలని సూచించబడ్డారు.

కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టు కొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను.” (ద్వి.కాం.11:18)

(9) మోషేనిబంధన శరతులతో కూడిన నిబంధన [Conditional Covenant].

మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచినీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా” (ని.కాం.19:3-6)

(10) దేవుడు మోషేద్వార చేసిన నిబంధన ద్వైపాక్షిక నిబంధన [Bilateral Covenant].

మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరు యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.” (ని.కాం.19:7-8)
ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము.” (ని.కాం.20:19)
మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని యేకశబ్దముతో ఉత్తరమిచ్చిరి...అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.” (ని.కాం.24:3…7)

(11) మోషేనిబంధన పశువుల రక్తముతో ఆవిష్కరించబడింది.

మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యౌవనస్తులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు సమా ధానబలులగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.” (ని.కాం.24:4-8)

(12) ప్రభువైన దేవుడు నోవహుద్వారా చేసిన నిబంధన సర్వశరీరులతో చేసిన నిబంధన అంటూ పేర్కొనటమేగాక దాన్ని నిత్య నిబంధనగా అభివర్ణించాడు [ఆది.కాం. 9:16]. అయితే, మోషేనిబంధనను నిత్యనిబంధనగా [עוֹלָֽם׃ בְּרִ֣ית/ b’rith olam=everlasting covenant] తనాక్ (పాతనిబంధన గ్రంథము) అంతటిలో దేవుడు ఎక్కడా పేర్కొనలేదు.

మోషేద్వారా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను తాను మీరను అని పరమతండ్రి వాగ్ధానం చేసాడు (న్యాయాధిపతులు.2:1). అయితే, ఇశ్రాయేలీయులు పదే పదే విశ్వాసఘాతకులుగా మారి ఆ నిబంధనను మీరి భంగం చేసారు (యిర్మీయా.11:10, 31:32; యెహెజ్కేలు.44:7; హోషేయ 6:7, 8:1). ఈ సందర్భంగా వాగ్ధానాన్ని భంగం చేస్తూ వచ్చిన ఇశ్రాయేలు జనాంగాన్ని వుద్దేశించి పరమతండ్రి, “నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను” అంటూ తెగేసి చెప్పేసాడు (యెహెజ్కేలు.16:59). అంటే, తాను చేసిన వాగ్ధానాన్ని మీరి ఇశ్రాయేలు జనాగాన్నంతటిని లయము చేయటమో లేక వారితో ఎలాంటి అనుబంధము కలిగి ఉండకుండ ఉండటమో అని కాదు. అది కేవలము ధర్మశాస్త్రములో తెలియచేసిన విధంగా వారిని శిక్షించటము [లేవీయకాండము 26:14-39].

ఈ నేపథ్యములో ఇశ్రాయేలీయులు నిబంధనను పదే పదే భంగం చేస్తూ వచ్చినా, ప్రభువైన దేవుడు తానుమాత్రం తాను యిచ్చిన మాటచొప్పున ఆ నిబంధనను మీరకుండా లేక భంగం చేయకుండా రాబోవు దినాలలో ఇశ్రాయేలీయులు కష్టపడి తమ స్వంత ప్రయత్నాలచేత, స్వనీతిచేత, లేక స్వభక్తిచేత సంపాదించనవసరములేని ఒక పరిపూర్ణమైన మరియు ఉత్కృష్టమైన పరిష్కార మార్గాని అందించే నిబంధనను గురించి వాగ్ధానం చేసాడు.

ఇశ్రాయేలీయులచేత పదే పదే భంగం చేయబడుతూ వచ్చిన మోషేనిబంధన నిత్యనిబంధన కాదు. దానికితోడు, ఆ నిబంధనతోపాటు యివ్వబడిన నిబంధనానియమాలు లేక ధర్మశాస్త్రము కూడా పరిష్కారాన్ని చూపలేకపోయిన కొన్ని ప్రాముఖ్యమైన సమస్యలు అలాగే ఉండిపోయాయి. అవి ఈ క్రింద యివ్వబడినవి:

  • ధర్మశాస్త్రములోని విధులను గైకొనక మరియు వాటిని స్థిరపరచకుండుటనుబట్టి శాపగ్రస్తులుగా మారిన వ్యక్తులకు తిరిగి నీతిమంతులయ్యే మార్గం ధర్మశాస్త్రము చూపలేదు (ద్వి.కాం.27:26)
  • తెలిసిచేసిన అనేక పాపాలకు క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం యివ్వలేదు
  • మరణకరమైన పాపాలకు [లే.కాం.20:10; ద్వి.కాం.13:7-19; 17:2-7; లే.కాం.24:17] క్షమాపణ మార్గం నిర్దేశించలేదు
  • తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టికర్త తానే సృష్టించిన లోకములోని మానవులందరికి అబ్రహాము ద్వారా చేసిన వాగ్దానములో [ఆది.కాం.12:3, 28:14] భాగంగా యూదులతో సమానంగా అందరికి ఆత్మీయ మేళ్ళను అందించలేక పొయింది
  • ఒక్క పాపినికూడా నీతిమంతునిగా/నీతిమంతురాలుగా తీర్చలేకపోయింది (రోమా.3:20; అపో.కా.13:39; గలతీ.2:16).
    [గమనిక: పాతనిబంధన కాలములోనూ నీతిమంతులున్నారు. అయితే, వారు మోషేధర్మశాస్త్రాన్ని పాటించటముద్వారా గాక, దేవునియందలి విశ్వాసముద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్నది లేఖనాల సాక్ష్యం!]

పై కారణాలన్నింటినిబట్టి ప్రభువైన దేవుడు మోషేనిబంధన లేక పాతనిబంధన స్థానములో నిత్యమూ వుండబోయే ఒక క్రొత్తనిబంధనను చేయబోతున్నట్లు వాగ్ధానం చేసాడు (యెషయా.42:1-3,6, 55:1-5, 61:1-11; యిర్మీయా.31:31-34; యెహెజ్కేలు 16:60, 37:24-28).

మరోమాటలో చెప్పాలంటే, అపరిపుర్ణంగా మరియు లోపభూయిష్టంగా [హెబ్రీ.8:7] ఉన్న మోషేనిబంధనను తొలగించి దాని స్థానములో దానికన్నా శ్రేష్టమైన వేరొక నిబంధనను అంటే పరిపూర్ణమైన మరియు లోపరహితమైన నిబంధనను అందించబోతున్నట్లు ప్రభువైన దేవుడు తానే ముందుకడుగేసి తన అపార కృపాకనికరాలనుబట్టి ఏకపక్షంగా వాగ్ధానం చేసాడు.

(13) మెస్సయ్య ద్వారా క్రొత్తనిబంధన.

పరమతండ్రి పూర్వ/పాతనిబంధనను మోషేద్వారా చేశాడు (ని.కాం.24:7-8). అయితే, ప్రవక్తలద్వారా తాను వాగ్ధానము చేసిన నిబంధనను/నిత్యనిబంధనను/క్రొత్తనిబంధనను (యెషయా.55:3, 61:8; యిర్మీయ.31:31-34, 32:37-40; యెహెజ్కేలు.16:60, 37:26) తన సేవకుడు/కుమారుడు/మెస్సయ్య ద్వారా చేయబోతున్నట్లు లేఖనాల సాక్ష్యాన్ని అందించాడు (యెషయా 42:5-7, 49:5-8, 55:3-5, 59:20-21, 65:1).

(14) క్రొత్తనిబంధన మరియు అన్యులు.

ప్రవక్తల కాలంలో ఒకవైపు “ఇశ్రాయేలీయులతో నేను ఒక నిబంధన చేయబోతున్నాను” (యెషయా.59:21), “ఇశ్రాయేలీయులతో ఒక నిత్యనిబంధన చేయబోతున్నాను” (యెషయా.55:3, 61:8; యిర్మీయ.32:40; యెహెజ్కేలు.16:60, 37:26), “ఇశ్రాయేలీయులతో ఒక క్రొత్తనిబంధన చేయబోతున్నాను” (యిర్మీయ.31:31) అని ప్రభువైన దేవుడు పదే పదే ప్రకటిస్తూనే మరోవైపు ప్రజలకు [కేవలం ఇశ్రాయేలీయులు అని కాదు లేక కేవలము అన్యజనులు అని కాదు] అంటే మానవులందరికి ఒక నిబంధన అందించబోతున్నట్లు కూడా ప్రకటించాడు [యెషయా.42:1-7, 49:20-21]. నిస్పక్షపాతి అయిన పరమతండ్రి మానవాళికి చేసిన వాగ్ధానాల నెరవేర్పే [ద్వి.కాం.32:21, 43; కీర్తన.82:8, 117:1-2; యెషయా 11:10; 42:5-7; 45:20-24; 49:5-13; 55:1-7; 65:1; హోషేయ 2:21-23; జెకర్యా 9:10] క్రొత్తనిబంధన మరియు దాని ఆవిష్కరణ! 

ఈసందర్భంగా తనాక్ లో (పాతనిబంధన గ్రంథము) ప్రభువైన దేవుడు తాను ఇశ్రాయేలీయులతో మరియు భూనివాసులందరితో చేయబోతున్న నిబంధనను గురించి అనేక పర్యాయాలు సవివరంగా పేర్కొన్నప్పటికిని ఎక్కడకూడా “నిబంధనలు” అంటూ అనేక నిబంధనలు లేక పలువిధనిబంధనలు చేయబోతున్నట్లు సూచించలేదు అన్నది గమనార్హమైన విశయం. దీన్నిబట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్ధానం చేసిన నిబంధన అలాగే అన్యులకు వాగ్ధానం చేసిన నిబంధన వేరువేరు నిబంధనలు కావుగాని ఒకే సార్వత్రిక నిబంధన అన్నది ప్రస్పుటమవుతున్నది. అదే క్రొత్తనిబంధన!

క్రొత్తనిబంధన

క్రొత్తనిబంధన లేక మెస్సయ్యనిబంధనను గురించి లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం:

(1) క్రొత్తనిబంధన అన్నది దేవుడు ముందే భవిశ్యవాణిరూపంలో ప్రవక్తల ప్రవచనాలలో సూచించబడిన నిబంధన.

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యిపట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ.31:31-32)

(2) క్రొత్తనిబంధన నూతనపరచబడబోయే మోషేనిబంధన కాదు. అసలు అది మోషేనిబంధన వంటిది కానేకాదు.

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యిపట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ.31:31-32)

ఈ సత్యం ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా కూడా తెలియచేయబడింది.

ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడుచేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీక రించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. ​నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును. ” (యెహెజ్కేలు.16:59-60)

పై లేఖములో ప్రభువైన దేవుడు గతములో తాను చేసిన పాత నిబంధనను జ్ఙాపకము చేసుకొని దాన్నే నిత్యనిబంధనగా స్థిరపరుస్తాను అని చెప్పకుండా, పాతనిబంధనను జ్ఙాపకము చేసుకొని అంటే దాని ఉద్దేశాన్ని గమనములో ఉంచుకొని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేందుకై దాని స్థానములో ఒక నిత్యనిబంధనను అంటే నిత్యము ఉండబోయే వేరే నిబంధనను లేక క్రొత్తనిబంధనను చేసి దాన్ని స్థిరపరచబోతున్నట్లు విశదీకరించాడు. స్థిరపరచబడబోతున్నది క్రొత్తనిబంధన, పాతనిబంధన కాదు!

(3) క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] దేవుడు ఇశ్రాయేలీయులతో చేయబోతున్నట్లు వాగ్ధానం చేశాడు.

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.” (యిర్మీయ.31:31)
సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు.నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా.59:20-21)

(4) క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] దేవుడు కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేస్తాను అని లేఖనాలలో ఎక్కడా ప్రకటించలేదు.

ఉదాహరణకు, దేవుడు “నేను ఇష్మాయేలును ఆశీర్వదిస్తాను” అని సెలవిస్తే దేవుడు ఇష్మాయేలును తప్ప ఇంకెవరినీ ఆశీర్వదించడు అని దాని భావమా…?
ఒకవేల దేవుడు “నేను ఇష్మాయేలును మాత్రమే ఆశీర్వదిస్తాను” అని సెలవిస్తే తప్పకుండా దాని భావం దేవుడు ఇష్మాయేలును తప్ప ఇంకెవరినీ ఆశీర్వదించడు అని.
లేఖనాలలోని ఈ సున్నిత భావవ్యత్యాసాన్ని గ్రహించని ఆత్మీయ అంధులు యిర్మీయ.31:31 లోని లేఖన వాగ్ధానం కేవలం యూదులకు మాత్రమే చెందినది అందులో అన్యులకు పాలు లేదు అంటు వక్రవ్యాఖ్యానము చేస్తుంటారు. ఇదే లేఖనాలకు కలిపి చెరపడమంటే.

(5) క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] దేవుడు కేవలము ఇశ్రాయేలీయులతో అలాగే ఇశ్రాయేలీయుల మధ్య కానానులో స్థిరపడినవారితో చేయడమేగాక లోకములోని అన్యులందరికి అందులో ప్రవేశము కల్పిస్తున్నట్లు లేఖనాలలో వాగ్ధానరూపములో సూచించాడు.

వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.” (ద్వి.కాం.32:21)
జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.” (ద్వి.కాం.32:43)
యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.” (కీర్తనలు 117:1-2)
ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.” (యెషయా.11:10)
గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును
యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను
.” (యెషయా.42:6-7)
మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు.” (యెషయా.45:21-24)
“యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను…బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ” (యెషయా.49:5…8)
“చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.” (యెషయా.55:3)
“నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.” (యెషయా.65:1)
“​నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు.” (యెహెజ్కేలు.16:60-61)
నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను. ​నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధస్థలము నిత్యము ఉండుటనుబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరి శుద్ధపరచువాడనని అన్య జనులు తెలిసికొందురు.” (యెహెజ్కేలు.37:26-28)
నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.” (హోషేయ.2:23)
సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిదపిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరులేని గోతిలోనుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను.” (జెకర్యా.9:9-11)
తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచ బడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకి.1:11)

యూదులతోపాటు అన్యులనుకూడా ఆశీర్వదించాలన్న సృష్టికర్తయొక్క బృహత్ప్రణాలికను గురించి పై లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. అన్యులతో “క్రొత్తనిబంధన” చేస్తాను అంటూ దేవుడు ఎక్కడా ప్రకటించలేదు. కారణం…వారికి పాతనిబంధన లేదు గనుక. కాని, ఇశ్రాయేలీయులతో యూదులతో ప్రత్యేకంగా “క్రొత్తనిబంధన” చేస్తాను అని దేవుడు ప్రకటించాడు. కారణం…వారికి పాతనిబంధన వుండింది గనుక.

యూదులకు అన్యులకు వేరువేరుగా చేసిన వాగ్ధానాలను ఐక్యపరచి ఒకే నిబంధనద్వారా తన వాగ్ధానాలను నెరవేర్చుకునే స్వాతంత్ర్యము హక్కు సృష్టికర్తకు లేవనేవాడు ఆత్మీయ దుస్థితిలోని అధమస్థానములోవున్న అవిశ్వాసి!

(6) క్రొత్తనిబంధనలో భాగంగా ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు జనులందరిని రక్షించబోతున్నాడు.

క్రొత్తనిబంధన ఫలితంగా అనేక అద్భుత పరిస్థితులు నెలకొనబోతున్నాయన్నది లేఖనాల సాక్ష్యం. అయితే, అవన్నీ ఒక్క క్షణములో లేక ఒకే దినములో సంభవించబోతున్నాయంటూ లేఖనాలు వాటి నెరవేర్పుల కాల పరిమితులను స్పష్టపరచలేదు అన్న సత్యాని మరచిపోకూడదు. క్రొత్తనిబంధనా ఫలితాలను ప్రభువైన దేవుడు క్రమక్రమంగా అంచలవారిగా నెరవేర్చబోతున్నాడు.

పై కారణాన్నిబట్టి క్రొత్తనిబంధన అంటే యేసు [యషువ] ద్వారా చేయబడిన నిబంధన తరువాత ఇశ్రాయేలీయులందరు రక్షించబడుతారు అన్న వాగ్ధానం ఇంకా నెరవేరబడలేకపోయినా అది యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు సంభవించబోయే అద్భుత ఘటన అన్నది లేఖనాలు సూచిస్తున్నాయి (రోమా.11:25-36). అయితే, ఈ సంఘటన క్రొత్తనిబంధన కాలములోనే సంభవిస్తుంది అన్నది తిరుగులేని సత్యం.

(7) క్రొత్తనిబంధన ఫలితాలు.

“​ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.” (యిర్మీయా.31:31-34)

ప్రభువైన దేవుడు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా తెలియచేసిన క్రొత్త నిబంధన యొక్క విశిష్ఠతలు:

  • ఈ నిబంధన ఇశ్రాయేలీయులతో యూదావారితో చేయబడును
  • ఈ నిబంధన మోషేద్వారా చేయబడిన పాతనిబంధన వంటిది కాదు
  • ఈ నిబంధనలో భాగంగా ప్రభువైన దేవుడు తానే తన ధర్మవిధిని వారి మనస్సులలో ఉంచబోతున్నాడు వారి హృదయముమీద వ్రాయబోతున్నాడు
  • ప్రభువైన దేవుడే వారికి దేవుడై ఉండును వారు ఆయనకు జనులై ఉందురు
  • వారు మరి ఎన్న డును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు
  • ప్రభువైన దేవుడు వారి దోషములను క్షమించి వారి పాపములను ఆయన యెన్నడును జ్ఞాపకము చేసికొనడు గనుక అల్పులేమి ఘనులేమి అందరును ఆయననెరుగుదురు

ఈ సందర్భంగా మరోసారి జ్ఙాపకము చేసుకోవలసిన సత్యం, ప్రభువైన దేవుడు తాను చేసిన నిబంధనలలో భాగంగా కొన్ని వాగ్ధానాలను నిబంధన విశిష్ఠతలుగా ఆయా నిబంధనలతోపాటు తెలియచేసాడు. అయితే, ఆ వాగ్ధానాలన్నీ ఒక్క క్షణములోనె లేక ఒకే దినములోనె నెరవేర్చబడుతాయి అంటూ ప్రభువైన దేవుడు సూచించటం లేదు. వాటి నెరవేర్పులు అన్నవి ఆ నిబంధన అమలులో ఉన్నకాలములో క్రమక్రమంగా నెరవేర్చబడుతాయి. ఈ సత్యం ప్రభువైన దేవుడు నరులతో చేసిన అనేక నిబంధనలను పరిశీలించటముద్వారా గ్రహించవచ్చు.

కనుక, ప్రభువైన యేసుక్రీస్తు [యషువ మషియాఖ్] కలువరి సిలువపై తన స్వంత రక్తముతో చేయబోతున్న క్రొత్తనిబంధనకు సాదృశ్యముగా చేసిన సంస్కారము తన పన్నెండుగురు శిష్యులతో చేసాడు [మత్తయి.26:26-30; మర్కు.14:22-25; లూకా.22:19-20]. వారంతా ఇశ్రాయేలు మరియు యూదా యింటివారే. క్రొత్తనిబంధనలో భగంగా ఉన్న ధర్మవిధులు వారి హృదయములో ప్రభువైన దేవుడే తన పరిశుద్ధాత్మద్వారా వ్రాసాడు. ఈ ప్రక్రియను గత రెండువేల సంవత్సరాలుగా ఇశ్రాయేలు మరియు యూదా యింటివారిలోనుండి మెస్సయ్య అయిన యేసు [యషువ] ద్వారా క్రొత్తనిబంధనలో పాలుపొందుతూ వస్తున్న వ్యక్తుల హృదయాలలో పరిశుద్ధాత్మదేవుడే జరిగిస్తున్నాడు.

నిజవిశ్వాసులు అంటే క్రొత్తనిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు నందు ఆయన చేసిన బలియాగమునందు విశ్వాసముంచి ఆత్మీయంగా తిరిగి జన్మించిన ప్రతివ్యక్తి, యూదుదైనా లేక అన్యుడైనా, ప్రభువైన దేవుని వ్యక్తిగతంగా ఎరుగుట అన్నది సంభవిస్తుంది. ఆ కారణాన్నిబట్టి క్రొత్తనిబంధనద్వారా దేవుని కుటుంభములో చేరిన ప్రతివ్యక్తి దేవుని కుటుంభములోని మరొక వ్యక్తికి దేవుని తెలుసుకో అంటూ బోధించే ఆవశ్యకత లేదు.

యేసుక్రీస్తు [యషువ మషియాఖ్] శిష్యులతో ప్రారంభమైన క్రొత్త నిబంధన పరిధి విస్తరిస్తూ ప్రభువు యొక్క రెండవ రాకడకు ముందే ఇశ్రాయేలు జనాగమంతా రక్షించబడటముతో పరిపూర్ణమవుతుంది. తద్వారా ప్రభువైన దేవుడు తన ప్రవక్త యిర్మీయాద్వారా క్రొత్తనిబంధనను గురించి చేసిన వాగ్ధానాలన్నీ [యిర్మీయా.31:31-34] సంపూర్ణముగా నెరవేర్చబడుతాయి. అప్పుడు, యూదులందరు అందరు యెహోవాను ఎరుగుదురు గనుక ఒకరికొకరు యెహోవాను పరిచయం చేసే అవసరత వుండదు.

(8) తాను చేయబోతున్న క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] బట్టే అన్యులనుకూడా దేవుడు ఇశ్రాయేలీయులతో సమానంగా చేయబోతున్నాడు.

(9) క్రొత్తనిబంధనద్వారా చేయబడిన వాగ్ధానాలు ప్రధానంగా ఆత్మీయ జీవితానికి మరియు రాబోవు యుగానికి చెందినవి.

(10) దేవుడు వాగ్ధానం చేసిన క్రొత్తనిబంధన [మెస్సయ్యనిబంధన] శరతులులేని నిబంధన [Unconditional Covenant] .

(11) దేవుడు వాగ్ధానం చేసిన క్రొత్తనిబంధన [మెస్సయ్యనిబంధన] ఏకపక్ష నిబంధన [Unilateral Covenant].

(12) క్రొత్తనిబంధన (మెస్సయ్యనిబంధన) మెస్సయ్య రక్తముతో ఆవిష్కరించబడింది.

“సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరులేని గోతిలోనుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను.” (జెకర్యా 9:9-11)
“సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.” (యోహాను.12:14-15)
“మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ” (మత్తయి.26:28)

(13) తాను చేయబోతున్న క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] దేవుడు నిత్యనిబంధనగా [עוֹלָֽם׃ בְּרִ֣ית/ brith olam=everlasting covenant] పేర్కొన్నాడు.

ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడుచేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీక రించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. ​నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.” (యెహెజ్కేలు.16:59-60)

(14) భూమిలోని వంశాలన్నింటికి క్రొత్తనిబంధనలో స్థానం!

అన్యజనులకు తన సేవకున్ని/కుమారున్ని/మెస్సయ్యను నిబంధనగా మరియు వెలుగుగా వుంచుతాను అని విస్పష్టమైన వాగ్ధానాలిచ్చాడు (యెషయా.42:1-7). ఆవాగ్ధానాలయొక్క నేరవేర్పును క్రొత్తనిబంధనలో అన్యజనులందరిని చేర్చడముద్వారా దేవుడు నెరవేర్చాడు!

అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్ధానాలలో ఆయన ద్వారా లోకములోని వంశాలనన్నిటిని ఆశీర్వదిస్తానంటూ వాగ్ధానం చేసాడు (ఆది.కాం.12:3; 18:18, 22:18, 26:4, 28:14=అపో.కా.3:25-26; గలతీ.3:8-14). ఆవాగ్ధానము యొక్క నెరవేర్పు క్రొత్తనిబంధనలో దేవుడు అన్యజనులందరిని చేర్చడముద్వారా నెరవేర్చాడు!

ఒక ప్రత్యేకమైన జనాంగముతో మాత్రమే దేవుడు మోషేనిబంధనను చేసి దాని తరువాత తాను చేయబోతున్న క్రొత్తనిబంధన మోషేనిబంధనవంటిది కాదు అని విస్పష్టముగా నొక్కిచెప్పటముద్వారా (యిర్మీయ.31:31-32) ఆ క్రొత్తనిబంధన ఒక ప్రత్యేకమైన జనాగమునకు మాత్రమేగాక, లోకములోని ప్రజలందరితో చేయబోయే నిబంధన అన్న సత్యానికి తిరుగులేని సాక్షాన్ని అందించాడు.

పక్షపాతరహితుడైన పరమతండ్రి తన నిత్యసంకల్పములోని  మహోత్తర ప్రణాలిక ప్రకారము తన స్వరూపమందు తన పోలికచొప్పున సృష్టింపబడిన మానవులందరిని ఆశీర్వాదించడానికై నిత్యనిబంధనగా వుండే క్రొత్తనిబంధనను ప్రజలతో అంటే మానవులందరితో చేయబోతున్నాడుగనుక ఇశ్రాయేలీయులను అన్యజనులవలన రోషము పుట్టించబోతున్నాను అంటూ ప్రవచనాత్మకంగా ప్రకటించాడు (ద్వి.కాం.32:21). ఒక రకంగా దాని ఫలితమే ఈనాటి యూదులు మరియు జూడాయిజంవారు యషువ మషియాఖ్ (యేసు క్రీస్తు) పై అలాగే ఆయన బోధలపై వేస్తున్న నీలాపనిందలు మరియు వెళ్ళగక్కుతున్న అక్కసు అంతా! 

నన్ను వెదకని వారికి నేను దొరికితిని” మరియు “నా జనము కానివారితో మీరే నా జనము అని నేను చెప్పుదును” అంటూ ఇశ్రాయేలీయులకు మాత్రమేగాక తాను అన్యజనులకు సహితం నిబంధనద్వారా దేవునిగా వుండబోతున్న సత్యాన్ని ప్రవచనాత్మకంగా ముందే ప్రకటించాడు (యెషయా.65:1; హోషేయ.2:23). దాని నెరవేర్పే క్రొత్తనిబంధన!

రాబోవు దినాలలో అంటే క్రొత్తనిబంధన కాలములో దేవునిరాజ్యములోకి అన్యజనుల ప్రవేశమునుగురించి అనేక మంది ప్రవక్తలద్వారా దేవుడు భవిశ్యవాణిరుపములో సూచించాడు:

పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరి గించు యెహోవా వాక్కు ఇదే.” (ఆమోసు.9:11-12) 

సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.” (జెకర్యా.2:11)

యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చిమా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయో జనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పు దురు.” (యిర్మీయ.16:19)

 మోషేనిబంధన మరియు మెస్సయ్యనిబంధన మధ్య వ్యత్యాసాలు

మోషేనిబంధన (పాతనిబంధన)మెస్సయ్యనిబంధన (క్రొత్తనిబంధన)
ముందే ప్రవచించ బడలేదుప్రవక్తలకాలములో ప్రవచించబడింది
రాబోవువాటికి ఛాయా రూపాలుగతములోని ఛాయారూపాల నిజస్వరూపం
ప్రారంభబలి: పశువులుప్రారంభబలి: దేవుని ప్రియకుమారుడు
మధ్యవర్తి: సేవకుడుమధ్యవర్తి: దేవుని ప్రియకుమారుడు
చివరలో నీతిమంతులుగా తీరుస్తుందిప్రారంభములో నీతి ఆపాదిస్తుంది
ధర్మవిధులు వ్యక్తులు వ్రాసుకోవాలిధర్మవిధులు దేవుడే వ్రాస్తాడు
వాగ్దత్తదేశములో పాలుపొందబోతున్నవారికే పరలోకములో ప్రవేశించాలని ఆశించే
వారందరికి
అనేక రక్తబలులర్పిస్తుండాలిరక్తబలులు అర్పించడం లేదు
నిబంధనాకాలము పరిమితమైనదినిబంధనాకాలము నిత్యమైనది
దేవుడు వాగ్ధానం చేసిన విశ్రాంతి
యివ్వబడలేదు
దేవుడు వాగ్ధానం చేసిన విశ్రాంతి
యివ్వబడింది
వాగ్ధానాలు ఇహలోకానికి చెందినవి వాగ్ధానాలు పరలోకానికి చెందినవి
అన్యులలోనుండి వచ్చిన విశ్వాసుల స్థానం యూదుల క్రింద అన్యులలోనుండి వచ్చిన విశ్వాసుల స్థానం యూదులతో సమానం
ద్వైపాక్షిక నిబంధన ఏకపక్ష నిబంధన
శరతులతో కూడిన నిబంధనశరతులులేని నిబంధన
అపరిపూర్ణ నిబంధనపరిపూర్ణ నిబంధన
Permalink to single post

ఆజ్ఙలు పలురకాలు

దేవుని వాక్యం నిరంతరం నిలుచునది. ఆవాక్యములోని భాగమే దేవుడు నరులకిచ్చిన ఆజ్ఙలు. దేవుని వాక్యములోని భాగమైన ఆయన ఆజ్ఙలుకూడా నిరంతరం నిలుచునవే. దీని భావం అన్ని ఆజ్ఙలు ఆన్ని కాలాలో అందరికీ వర్తిస్తాయని కాదు. దేవుని ఆజ్ఙలన్నీ సత్యమైనవి, నాశనము కానివి, సదా ఉనికిలో వుంటాయని దాని భావం. అయితే వాటి అనువర్తన మరియు అధికార పరిధులు అన్నవి ఆ యా కాలాలకు, వ్యక్తులకు, మరియు సందర్భాలకు పరిమితమై వుంటాయి.

దేవుని ఆజ్ఙలు

దేవుని ఆజ్ఙలు అనేకం. అవి పలురకాలు. ఆజ్ఙలన్నీ ఒకేసారి ఒకే వ్యక్తికి యివ్వబడలేదు. కాలానుగుణంగా సందర్భానుసారంగా వివిధ వ్యక్తులకు వివిధ ఆజ్ఙలు అందించబడ్డాయి. అవన్నీ దేవుని గ్రంథమైన బైబిలులో విపులీకరించబడ్డాయి. అయితే ఏ ఆజ్ఙలు ఎవరికి, ఎప్పుడు, ఎందుకు ఇవ్వబడ్డాయి అన్నవే మానవుల జీవితాలలో వాటి అన్వయింపుకు ప్రధాన నిర్ధేశకాలు. ఈ కారణాన్నిబట్టి దేవుని ఆజ్ఙలు క్రింద యివ్వబడినట్లుగా నాలుగు ప్రధాన భాగాలుగా విభజించబడుతాయి.

1) కాల-పరిమిత ఆజ్ఙలు–ఇవి ఒక పరిమిత సమయానికి లేక కాలానికి మాత్రమే అన్వయించదగిన ఆజ్ఙలు. ఈ ఆజ్ఙలు అన్ని కాలాలకు చెందినవి కావు. ఉదాహరణకు,

తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆది.కాం.2:16-17)

పై ఆజ్ఙను యిచ్చింది దేవుడు. అయితే, ఈ ఆజ్ఙ మానవచరిత్ర ఆరంభకాలానికి మాత్రమే చెందిన ఆజ్ఙ. ఇంగితజ్ఙానమున్న ఎవరుకూడా ఆ ఆజ్ఙను ఈదినాలోకూడా పాటించాలని భావించి పాటించే ప్రయత్నము చేయరు. క్రింద ఇవ్వబడిన లేఖనాలలోని ఆజ్ఙలు ఈ విభాగానికి చెందినవే:

ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను.” (ని.కాం.12:7-8)

యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.” (ని.కాం.14:26)

యెహోవా మోషేను చూచిఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనినదానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను.” (ని.కాం.16:4-5)

2) వ్యక్తి-పరిమిత ఆజ్ఙలు: ఇవి దేవుడు కేవళము ఒక నిర్ధిష్టమైన వ్యక్తికి/వ్యక్తులకు యిచ్చిన ఆజ్ఙలు. ఉదాహరణకు,

కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకు దువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుము.” (ఆది.కాం.20:7)

పై ఆజ్ఙ దేవునిది. అయితే, ఆ ఆజ్ఙను దేవుడు ఎవరికి యిచ్చాడు? లోకములోని మనుషులందరికా…? కాదు. అది కేవళము అబీమెలెకు అన్న కనానుదేశ రాజుకు మాత్రమె యివ్వబడిన ఆజ్ఙ. ఇదే విధంగా క్రింది లేఖనాల వెలుగులో దేవుడు మోషేద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రము మరియు దానితోకూడిన విధులు ఆచారాలు అన్నవి ఒక ప్రత్యేకమైన జనులకు అంటే ఇశ్రాయేలీయులకు, వారితో పాటు ప్రయాణముచేస్తూ దేవుడు వాగ్ధానము చేసిన కనానుదేశములోకి ప్రవేశించబోతున్న పరదేశులకు, మరియు వారందరి రాబోవు తరాలవారికి మాత్రమే యివ్వబడ్డాయి అన్న సత్యం విశదమవుతున్నది:

ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను” (ని.కాం.31:16)

నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింప వలెను, నేను యెహోవాను. మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల…మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను…యెహోవా మోషేద్వారా సీనాయికొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.” (లేవీ.కాం.26:2..46)

కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పిత రుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు…నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచినిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివే చనలు గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?…మోషే ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి.” (ద్వి.కాం.4:1..8..47)

మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి యిట్లనెను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.”  (ద్వి.కాం.5:1-3)

యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబుదేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెను…నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించు చున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, అనగా మీలో ముఖ్యు లేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకు లేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్న వారితోను ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. …రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.1…11…29)

సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతిదినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.” (నెహెమ్యా.9:13-14)

ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.” (కీర్తన.147:19-20)

హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరికొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి.” (మలాకి.4:4)

3) సందర్భ-పరిమిత ఆజ్ఙలు: కొన్ని ఆజ్ఙలను దేవుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలకొరకు మాత్రమే యివ్వడం జరిగింది. అలాంటి ఆజ్ఙలను అన్ని కాలాలలో అందరికి అన్వయించకూడదు. ఉదాహరణకు,

చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయ వలెను.” (ఆది.కాం.6:14)

దేవుడు పై ఆజ్ఙను జారీ చేసాడు. అయితే ఆ ఆజ్ఙ అన్నికాలాలకు అన్వయించ తగిందా? కాదు. అది కేవళము నోవహుకు అదీ జలప్రళయముకు ముందు యివ్వబడిన ఆజ్ఙ. జలప్రళయము తరువాతకూడా అలాంటి ఓడలను నిర్మిస్తూ వెళ్ళండి అని కాదు ఆ ఆజ్ఙ ఉద్దేశం! దానికో సందర్భం వుంది. అలా సందర్భ-పరిమిత ఆజ్ఙలను అన్ని కాలాలలో అందరూ పాటించే ప్రయత్నం చేయకూడదు. ఈ విభాగానికి చెందిన కొన్ని ఆజ్ఙలను క్రింది లేఖనాలలో చూడవచ్చు:

గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా” (1సమూయేలు.8:22)

ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచుమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను.” (న్యాయాధిపతులు.20:23)

నీ దేవుడైన యెహోవా వారిని నీకప్ప గించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను.” (ద్వి.కాం.7:2)

యెహోవా నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను.” (1సమూయేలు.23:2)

యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెనుజనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.” (హోషేయ.1:2)

4) సార్వత్రిక ఆజ్ఙలు: ఇక అన్ని కాలాలకు అందరికి అన్వయించదగిన ఆజ్ఙలనుకూడా దేవుడిచ్చాడు. దైవలేఖనాలలో వాటిని గుర్తించి పాటించాల్సిన ఆవశ్యకత అందరికి అన్ని కాలాలలోనూ వుంది. ఉదాహరణకు,

మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడి.” (ఆది.కాం.9:7)

పై మాటలను దేవుడు జలప్రళయము తరువాత నోవహుకు ఆయన సంతానానికి ఆజ్ఙాపించాడు. ఈ ఆజ్ఙ సర్వకాలాలకు సర్వజనులకు యివ్వబడిన సార్వత్రిక ఆజ్ఙ. ఈ ఆజ్ఙ సర్వసాధారణంగా అందరికీ అన్నికాలాలకు అన్వయించదగినదైనా ఈ ఆజ్ఙను యిచ్చిన దేవుడే తన సార్వభౌమత్వములో కొందరికి కొన్ని సందర్భాలలో ఈ ఆజ్ఙనుంది మినహాయింపును యివ్వడం జరిగింది. ఉదాహరణకు దేవుడు ప్రవక్త అయిన యిర్మీయకు ఈ ఆజ్ఙ యిచ్చాడు, “ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొన కూడదు” (యిర్మీయ.16:1-2). సార్వత్రిక ఆజ్ఙలనుండి ఇలాంటి మినహాయింపులు అన్నవి సార్వత్రిక ఆజ్ఙలను యిచ్చే దేవునినుండి రావడాన్ని మనం లేఖనాలలో చూడవచ్చు. క్రింది లేఖనాలలోని ఆజ్ఙలు ఈ విభాగానికి చెందినవి:

మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.” (ఆది.కాం.9:1)

మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి.” (ఆది.కాం.9:2)

ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.” (ఆది.కాం.9:3)

మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు” (ఆది.కాం.9:4)

మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.” (ఆది.కాం.9:5)

నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆది.కాం.9:6)

ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులకు దేవుడిచ్చిన కట్టడలకు/ఆజ్ఙలకు ఆయా వ్యక్తులు విధేయులై నడుచుకోవాలి. సార్వత్రిక కట్టడలకు/ఆజ్ఙలకు మాత్రం అందరు అన్నివేళల విధేయులై నడుచుకోవాలి.

దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల (מִצְוֹתָ֗יו/mishvota) ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసంగి.12:13)

Permalink to single post

దైవోక్తులపై ఒక అవిశ్వాసి అపనింద

అవిశ్వాసి అపనింద

“సోదరీ, సోదరులైన ప్రపంచ క్రైస్తవ బోధకులారా!విశ్వాసులారా!!

…నేను బైబిల్ చదవగా (మత్తయి 26:24,28,56 మార్కు9:12,13 లూకా24:25-27,44-48 అ; కార్య3:8,10:43 &1వ కోరింథీ15:3-5) లలో చెప్పిన మారుమనస్సు,పాపక్షమాపన ,చనిపోయి లేచుట,అను విషయాలు గురించి సమస్త ప్రవక్తలు ముందే రాసారని,చెప్పారని ఉంది.అయితే (ఆది-మలాకి వరకు) యే ఒక్క ప్రవక్త ఒక్క చోటగాని, ఒక్కమాటగాని చెప్పిన దాఖలాలులేవు. ఎక్కడా ఒక్కలేఖనం లేదు. దేవుని వాక్కు అసలేలేదు.అయితే నాలాంటివాడు మిమ్ములను అడిగినప్పుడు ఆధారాలు చూపాలి…ఆడిగినవాటికి లేఖనాలు లేనట్లా? ఉన్నట్లా? లేనట్లయితే యేసు మొదలుకుని క్రొత్తనిబంధన బోధకుల బ్రతుకులు ఏంటి?సమాధానం కోరుతున్నాను”
ఇట్లు,
అవిశ్వాసి [అసత్యాన్ని హత్తుకున్న]

విశ్వాసి వివరణ

దైవోక్తులు (లేఖనాలు) అన్నవి కొన్నిసార్లు అస్పస్టంగా మరికొన్నిసార్లు నిగూఢంగా యివ్వబడటము సహజం. ఇక భవిశ్యత్తుకు సంబంధించిన ప్రవచనాలైతే (భవిశ్యవాణి) యింకెంతో మర్మఘర్భితంగా యివ్వబడుతాయి అన్నది లేఖనాలనుగూర్చిన కనీసజ్ఙానమున్న ఎవరికైన యిట్టే అర్థమయ్యే విశయము. ఈ కారణాన్ని బట్టి ధార్మిక గ్రంథాలను పరిశోధించే విజ్ఙులు తమకు అర్థంకాని లేక గ్రహించలేని ప్రవచనాలతో కూడిన ధార్మిక వివరాలను బట్టి ఆ గ్రంథాలను తప్పుబట్టే ప్రయత్నము చేయరు.

అయితే ఇహలోక మతచాందసులు మాత్రం తమ మతము సహితం అధారముగా తీసుకున్న మూలమతాలనుకూడా తప్పుబడుతూ వాటి లేఖనగ్రంథాలను తిరస్కరిస్తూ తమ తర్కరాహిత్య కుసంస్కారాన్ని అందరిముందూ ప్రదర్శిస్తుంటారు. అలాంటివారిది యితరమతాలపై యితర గ్రంథాలపై దుమ్మెత్తిపోస్తేనేగాని తమ మతాన్ని అమాయకులకు నమ్మబలికే విధంగా ప్రచారంచేసుకోలేని దౌర్భాగ్య స్థితి. అది వారి మతము యొక్క దివాళుకోరుతనానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటివారికి దైవసత్యం అవగతం కాదు. వారికివ్వబడిన దైవసత్యమన్నది బూడిదెలో పోసిన పన్నీరులాంటిది. నిజానికి ప్రభువైన యేసు క్రీస్తు అలాంటివారినుద్దేశించే ఈమాటచెప్పాడు:

పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్ట వద్దు. మీ ముత్యాలు పందుల ముందు వేయొద్దు. అలాచేస్తే పందులు వాటిని కాళ్ళతో తొక్కేస్తాయి. కుక్కలు మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో.” (మత్తయి 7:6)

ఈ సంధర్భంగా ప్రశ్న అడిగిన విధానాన్నిబట్టి ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి యొక్క నైజము ప్రభువైన యేసు క్రీస్తు మాటలలోని ప్రాణుల నైజానికి ధీటుగా వున్నా ఆప్రశ్నలో లేవనెత్తబడిన అంశాలకున్న చెల్లుబాటును బట్టి సత్యాన్వేశకులైన విజ్ఙులెవరైనా వుంటే వారికి ఉపయుక్తకరంగా వుండేందుకై అడగబడిన ప్రశ్నకు వివరణతోకూడిన జవాబే క్రింద యివ్వబడిన స్పందన.

సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో మానవకోటి మనుగడకు అవసరమైన అత్యంత ప్రధానమైన సత్యాలన్నీ అందించబడ్డాయి. ఇహలోకానికి మరియు పరలోకానికి సంబంధించిన సత్యాలన్నీ క్రోడీకరించబడి అక్షర రూపంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిలుగా భద్రం చేయబడ్డాయి. అందుకే బైబిలును దైవ గ్రంథమని, పరిశుద్ధ గ్రంథమని, లేఖనాలని వివిధ పేర్లతో పేర్కొనడం జరుగుతుంది. ఈ గ్రంథంలోని అతిప్రధానమైన సత్యం మానవ కోటిని పాపము యొక్కయు మరియు సాతానుయొక్క దాసత్వాలనుండి రక్షించి పరలోక ముక్తిని ప్రసాదించే దైవాంశసంభూతుడైన యేసు క్రీస్తు ప్రభువును గూర్చినది.

బైబిలుకున్న విశిష్టతలలో ఒకటి యదార్థ హృదయంతో దేవుని అన్వేషిస్తున్నవారి గ్రహింపు స్తోమత యేస్థాయిలో వున్నా వారి స్థాయికి తగిన విధంగా విశదమయ్యే వివరణలు కలిగి వుండటమే. పండితులూ, పామరులూ యింకా చెప్పలంటే సాధారణ వ్యక్తులూ అందరూ ఆకళింపు చేసుకోగలిగే విశయాలు ఈ గ్రంథములో వున్నాయి. అయితే, ఈ గ్రంథాన్ని ధ్యానించటానికి సమీపించే వ్యక్తి యదార్థ హృదయంతో సత్యాన్వేశకునిగా గ్రంథాన్ని సమీపించాలి. మూఢత్వం, అహంకారం, స్వనీతి, ముందే నిర్ధారించుకొన్న అభిప్రాయాలు, తప్పులు వెదకాలన్న కుయుక్తి మొదలైనవాటితో బైబిలును సమీపించే వారికి సత్యం అవగతం కాకపోగా వారి స్వభావాన్ని ప్రతిబింబించే అపార్థాలే పుట్టుకొస్తాయి.

బైబిలులోని సత్యాలను కొందరు గ్రహించలేకపోవడానికి బైబిలు తెలియచేస్తున్న ఐదు కారణాలు

1) కొందరు బైబిలును అసలు చదవకుండానే లేక ఆసాంతము చదవకుండానే లేక దాన్ని చదవాల్సినవిధంగా చదవకుండానే యెవరో చెప్పిన మాటలు విని వాటిని నమ్మి బైబిలుగురించి తప్పుడు అవగాహనను యేర్పరచుకొని ఆ అజ్ఙానములో కొనసాగుతుంటారు. ఆ విధానము వారిని నాశనమార్గము వైపుకు నడుపుతుంది. అలాంటివారికి దైవసత్యం యెప్పటికీ అందదు. (మత్తయి 22:29)

2) కొందరు అబద్దికులును మరియు మోసగాడ్రునై యుండి యితరులను దురాత్మల బోధలలోనికి తీసుకొనివెళ్ళే ప్రయత్నంలో భాగంగా బైబిలులో తప్పులు వెదికేందుకే దాన్ని పఠిస్తారు. అలాంటివారికి అందులోని సత్యం ససేమిరా అవగతం కాదు. (1తిమోతి 4:1-2)

3) కొందరు తమ మూర్ఖత్వాన్నిబట్టి మోసపోయిన కారణంగా వారి మనోనేత్రాలకు సాతానుడు అంధకారం కలుగజేశాడు. అలాంటివారికి బైబిలులోని సత్యాన్ని వీక్షిచడము అన్నది అసాధ్యమైన విశయం. (2 కొరింథీ 4:4)

4) కొందరు అహంకారంతో దైవసత్యాన్ని తిరస్కరించి అవిధేయతతో స్వనీతిపై ఆధారపడుతూ తమ స్వంత ప్రయత్నాలతో ముక్తిని సంపాదించుకునే ప్రయత్నాలను చేస్తుంటారు. అలాంటివారి హృదయాలను సృష్టికర్తే కఠిన పరచడం జరుగుతుంది. కనుక అలాంటివారు సత్యాన్ని గ్రహించలేక అసత్యములోనే కొనసాగుతుంటారు (కీర్తనలు 81:11-12; యెషయా 6:9-10; మత్తయి 13:13-15; 2 థెస్సలోనీకయులకు 2:9-12). అలాంటివారికికూడా బైబిలులోని దైవసత్యం సుదూరం.

5) చివరగా, కొందరికి అజ్ఙనాన్నిబట్టి అలాగే మందమతినిబట్టి హృదయాలు మూయబడివుంటాయి. ఈ కారణాన్నిబట్టికూడ లేఖనసత్యాన్ని గ్రహించలేరు. అయితే అలంటివారు యదార్థ హృదయాలతో దేవున్ని ప్రేమిస్తూ సత్యాన్ని అన్వేశిస్తున్నట్లయితే వారు లేఖనాలలోని దైవసత్యాన్ని గ్రహించేందుకు వీలుగా వారి హృదయాలను దేవుడే తెరవడం జరుగుతుంది (లూకా 24:25-32, 45).

ప్రశ్నలో పేర్కొనబడిన బైబిలు లేఖనాలు

(1)24 మానవపుత్రుని గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండక పోయి ఉంటే అతనికి మంచిది.” 25 ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసికొని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని మీరు తీసికొని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. 28 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం…55 తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, “ఒక దోపిడీదొంగ మీదకి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే, 56 ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు.” (మత్తయి 26:24-28…55-56)

(2)12 యేసు జవాబు చెబుతూ, “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మానవ పుత్రుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది? 13 నేను మీతో చెప్పేదేమంటే, ఏలీయా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు” అన్నాడు.” (మార్కు9:12-13)

(3)24 మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు” అని ఆయనకు చెప్పారు. 25 అందుకాయన “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, 26 క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?” అని చెప్పాడు. 27 ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి తెలిపిన మాటల అర్థాన్ని వారికి తెలియచేశాడు…44 తర్వాత ఆయన “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనలలోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచాడు.46 “క్రీస్తు హింసలు పొంది చనిపోయి మూడోరోజున చనిపోయిన వారిలోనుండి లేస్తాడనీ, 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకీ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.” (లూకా24:25-27…44-48)

(4)8 వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయం లోకి వెళ్ళాడు…43 ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన పేరున పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నార” ని చెప్పాడు.” (అ.కార్య. 3:8…10:43)

(5) “3 దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, 4 లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయన్ని మూడవ రోజున తిరిగి లేపాడు కూడా. 5 ఆయన కేఫాకూ, తరువాత పన్నెండుమందికీ కనబడ్డాడు.” (1కోరింథీ.15:3-5)

ప్రశ్నలో పేర్కొనబడిన బైబిలు లేఖనాల వివరణ

(1)24 మానవపుత్రుని గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండక పోయి ఉంటే అతనికి మంచిది.” 25 ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసికొని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని మీరు తీసికొని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. 28 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం…55 తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, “ఒక దోపిడీదొంగ మీదకి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే, 56 ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు.” (మత్తయి 26:24-28…55-56)

పై లేఖనాల వివరాలను ప్రవచించిన పాత నిబంధన లేఖనాలు…

“12…ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను” (యెషయా 53:12)“

7 ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుగొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.” (జెకర్యా 13:7)

యేసు ప్రభువులవారు సెలవిచ్చిన విధంగా యెషయా 53:12 మరియు జెకర్యా 13:7 లోని ప్రవచనాల సారాంశము లుకా సువార్తలోని 26:55-56 లో నెరవేర్చబడింది.

(2)12 యేసు జవాబు చెబుతూ, “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మానవ పుత్రుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది? 13 నేను మీతో చెప్పేదేమంటే, ఏలీయా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు” అన్నాడు.” (మార్కు 9:12-13)

పై లేఖనాల వివరాలను ప్రవచించిన పాత నిబంధన లేఖనాలు…

యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. 6 నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.” (మలాకి 4:5-6)

3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు. 4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. 5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. 6 మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. 7 అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.” (యెషయా 53:3-7)

మార్కు సువార్త 9:12-13 వరకుగల లేఖనాలలో యేసు ప్రభువు వివరిస్తున్న విశయాలు ప్రవక్తలైన యేషయా (53:12) మరియు మలాకి (4:5-6) వ్రాసిన లేఖనాలలోని ప్రవచనాల సమిష్టి నెరవేర్పు అన్నది గుర్తించవచ్చు.

(3)24 మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు” అని ఆయనకు చెప్పారు. 25 అందుకాయన “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, 26 క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?” అని చెప్పాడు. 27 ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి తెలిపిన మాటల అర్థాన్ని వారికి తెలియచేశాడు…44 తర్వాత ఆయన “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనలలోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచాడు.46 “క్రీస్తు హింసలు పొంది చనిపోయి మూడోరోజున చనిపోయిన వారిలోనుండి లేస్తాడనీ, 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకీ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.” (లూకా24:25-27…44-48)

పై లేఖనాల వివరాలను మర్మఘర్భితంగా ప్రవచించిన పాత నిబంధన లేఖనాలలోని మచ్చుకు కొన్ని…

ప్రవక్త అయిన మోషే వ్రాసిన లేఖనాలలోని ప్రవచనాలు:

15 మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.” (ఆదికాండము 3:15)“

16 ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిచొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. 17 మరియు యెహోవా నాతో ఇట్లనెను. –వారు చెప్పిన మాట మంచిది; 18 వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. 19 అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దానిగూర్చి విచారణచేసెదను.” (ద్వి.కాం. 18:16-19)

ప్రవక్త అయిన దావీదు వ్రాసిన కీర్తనలలోని ప్రవచనాలు:

6 నేను నరుడను కాను నేను పురుగును. నరులచేత నిందింపబడిన వాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను. 7 నన్ను చూచు వారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. 8 యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా! ఆయన వానిని తప్పించునేమో అందురు. 9 గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా! నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగానీవే గదా! నాకు నమ్మిక పుట్టించితివి. 10 గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని, నా దేవుడవు నీవే. 11 శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు. నాకు దూరముగా నుండకుము. 12 వృషభములు అనేకములు నన్ను చుట్టుకొనియున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి. 13 చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు. 14 నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను. నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది. 15 నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను. నా నాలుక నా దవడను అంటుకొని యున్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు. 16 కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి. దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు. నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. 17 నా యెముకలన్నియు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. 18 నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.” (కీర్తనలు 22:6-18)

8 సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుకనేను కదల్చబడను. 9 అందువలన నా హృదయము సంతోషించుచున్నదినా ఆత్మ హర్షించుచున్నదినా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది 10 ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు 11 జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.” (కీర్తనలు 16:8-11)

18 నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసి కొని యున్నావు.” (కీర్తనలు 68:18)

ప్రవక్త అయిన యెషయా వ్రాసిన లేఖనాలలోని ప్రవచనాలు:

1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. 2 అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు 3 నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును. 4 భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును. 5 ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 6 గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును 7 యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను. 8 యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను. 9 మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. 10 సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రము లోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి. 11 అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక. 12 ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొని యాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయు దురు గాక.” (యెషయా 42:1-12)

6 నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను. 7 ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు. 8 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.” (యెషయా 49:6-8)

2 లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. 3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు. 4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. 5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. 6 మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. 7 అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. 8 అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు? 9 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. 10 అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. 11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. 12 కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను.” (యెషయా 53:2-12)

(4)8 వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయం లోకి వెళ్ళాడు…43 ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన పేరున పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నార” ని చెప్పాడు.” (అ.కార్య. 3:8…10:43)

పై లేఖనాల వివరాలను మర్మఘర్భితంగా ప్రవచించిన పాత నిబంధనలోని మచ్చుకు కొన్ని లేఖనాలు…

18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెన నెను.” (ఆదికాండము 22:18)

43 జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.” (ద్వి.కాం. 32:43)

1 అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. 2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును. ” (యెషయా 9:1-2)

11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.” (యెషయా 53:11)

14 సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ బడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” (దానియేలు 7:14)

23 నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితోమీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.” (హోషేయ 2:23)

1 ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించు టకై దావీదు సంతతివారికొరకును, యెరూషలేము నివా సులకొరకును ఊట యొకటి తియ్యబడును.” (జెకర్యా 13:1)

28 తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ ¸°వనులు దర్శనములు చూతురు. 29 ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును. 30 మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను 31 యెహోవాయొక్క భయం కరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. 32 యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేము లోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు 2:28-32)

11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు 12 పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే.” (ఆమోసు 9:11-12)

గమనిక: ప్రవక్తలు దేవుడు తన క్రీస్తు ద్వారా జనులందరిని అశీర్వదించబోతున్న విశయాన్ని ప్రవక్తల ద్వారా రకరకాలుగా పైన ఉదహరించిన విధంగా మర్మఘర్భిత వాక్కులద్వారా సూచించాడు. ఆ విశయమే అపోస్తలుల కార్యములు 10:43 లో ప్రవక్తల సమగ్రసారాంశముగా పేర్కొనబడింది.

(5)1 సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ చెబుతున్నాను. మీరు దానిని అంగీకరించి, దానిలోనే నిలిచి ఉన్నారు. 2 మీ విశ్వాసం వట్టిదైతే తప్ప, నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు. 3 దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, 4 లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయన్ని మూడవ రోజున తిరిగి లేపాడు కూడా.” (1 కొరింథీ.15:1-4)

పై లేఖనాలలో గమనించాల్సిన ముఖ్య అంశాలు:

1. అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించాడు (వ.1)

2. అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్తలోని ముఖ్య భాగాలు:

– క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు (వ.3)
– క్రీస్తును సమాధి చేశారు (వ.3)
– దేవుడు క్రీస్తును మూడవ రోజున తిరిగి లేపాడు (వ.3)

3 అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్తలోని ముఖ్య భాగాలకున్న మూలాధారం:

– దేవుడు అనుగ్రహించిన ఉపదేశం (వ.3)
– లేఖనాలు (వ.3)

పై ముఖ్య అంశాలపై కొంత వివరణ:

లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు మరిముఖ్యంగా ప్రవచన భాగాలను పరిశోధిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విశయం ఉత్కృష్టమైన సత్యాలు దైవోక్తులలో చాలావరకు మర్మఘర్భితంగా యివ్వబడ్డాయి అన్న సత్యం. ఇందునుబట్టే సత్య పరిశోధకులు లేఖనాలను జాగ్రత్తగా మరియు లోతుగా ధ్యానించాల్సిన ఆవశ్యకత వుంది. అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్తలోని ముఖ్య భాగాలకున్న మూలాధారాలు రెండు.

(1) దేవుడే అనుగ్రహించిన ఉపదేశం. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణలో (inspiration) సువార్తనుగూర్చి పౌలుకు యివ్వబడిన ప్రత్యక్షతను (revelation) సూచిస్తున్నది. గమనించాలి, యిది పౌలు పాత నిబంధన లేఖనాలను చదివి గ్రహించిన సారంశము అని తలంచకూడదు. నిజానికి యిది ఆత్మావేశములో తిన్నగా దేవుని యొద్దనుండే యివ్వబడిన ప్రత్యక్షత.

(2) లేఖనాలు. ఇక్కడ లేఖనాలు (Scriptures) అన్న పదము పాత నిబంధన (Old Testament) మరియు క్రొత్త నిబంధన (New Testament) రెండు గ్రంథాలను సూచిస్తున్నది. ఈ సందర్భంగా గమనించాల్సిన విశయమేమిటంటే అపోస్తలుడు “లేఖనాల ప్రకారం” అన్నాడే కాని ధర్మశాస్తములో వ్రాయబడినట్లుగా అనిగాని లేక ఫలాన ప్రవక్త వ్రాసినట్లుగా అనిగాని చెప్పడం లేదు. ఒకవేళ 1 కొరింథీ. 15: 1-4 వరకుగల వచనాలలో “‘క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు’ అని లేఖనాలలో వ్రాయబడినట్లు” అనిగాని లేక లేఖనాలలో “‘ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయన్ని మూడవ రోజున తిరిగి లేపాడు’ అని వ్రాయబడి వున్నట్లు” అనిగాని వుంటే అప్పుడు లేఖనాలలో సరిగ్గా అదే పదజాలాన్ని వెతికి చూడాల్సివచ్చేది. అంటే, లేఖనాలను యెత్తి వ్రాసినప్పుడు (copy) మాత్రమే వివరణలోని పదజాలము మూలములోని పదజాలముతో సమాంతరంగా వుండాలి (direct speech as opposed to reported speech). కాని వాస్తవమేమిటంటే అపోస్తలుడు అదివరకే యివ్వబడిన ప్రవచన లేఖనాలలోని సందేశాన్ని క్రోడీకరిస్తూ వేరే పదాలతో దాని సారాంశాన్ని వ్యక్తం చేసాడు (i.e.reported speech). అయినా అది ఆయన స్వంత యిచ్ఛను బట్టి కాదుగాని పరిశుద్దత్మ ప్రేరణలోనే (inspiration) అది చేశాడన్నది మరవకూడదు. ఇక్కడ గమనములో వుంచుకోవలసిన మరొక విశయమేమిటంటే “లేఖనాల ప్రకారం” అన్న పదజాలము యొక్క భావం లేఖనాల సారాంశము అని గ్రహించాలి. ఇందుకు సంబంధించిన లేఖనాల ఆధారాలు ఈ క్రింద యివ్వబడ్డాయి…

పాత నిబంధన లేఖనాధారాలు:

– కీర్తనలు 16:8-10 = అపోస్తలుల కార్యములు 2:31 & 13:35-39
– కీర్తనలు 22:1,6-8,13-18
– యెషయా 53:4-12
– దానియేలు 9:24-26
– జెకర్యా 13:7

క్రొత్త నిబంధన లేఖనాధారాలు:

– మత్తయి.16:21
– మత్తయి.17: 22-23
– మత్తయి.20:18-19, 28.
– మర్కు.8:31
– మర్కు.9:31
– మర్కు.10:33-34

అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15:1-4 వరకుగల వాక్యాలలో వివరించిన సత్యాలన్నీకూడా పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన గ్రంథాలలోనుండి పైన పేర్కొనబడిన లేఖనాల సారాంశమన్నది అత్మలో వెలిగించబడినవారు యిట్టే గ్రహించగలరు.

సత్యాన్ని ప్రేమిస్తూ అన్వేశిస్తున్న వారందరినీ దేవుడు దీవించి సర్వసత్యములోనికి నడిపించును గాక! ఆమెన్!

Permalink to single post

బైబిలు: సంపూర్ణ దైవగ్రంథము

ధార్మిక గ్రంథాలు మరియు మతధర్మాలు

ఒకే ఒకవ్యక్తి ఒక ధార్మిక గ్రంథాన్ని తెచ్చి ఒక మతధర్మాన్ని స్థాపించిన వైనాలు చరిత్రలో కోకొల్లలు. ఏకవ్యక్తి స్థాపిత మతధర్మాలకు ప్రేరణలుకూడా యెన్నో. తమచుట్టూ వున్న సాంఘీక దురాచారాలను సంస్కరించాలనే తపన ఒక కారణంకాగా తమ స్వలాభంతో పబ్భం గడుపుకోవాలనుకునే స్వార్థం మరో కారణం. ఈ రెండూ కారణాల సమ్మేళనంకూడా యింకో కారణం కావచ్చు. ఈ వాస్తవికతనుబట్టి ఏకవ్యక్తి స్థాపిత మతధర్మాల చిత్తశుద్ధిని నిర్ధారించడం కష్టసాధ్యమనే చెప్పొచ్చు.    

ఏకవ్యక్తి స్థాపిత మతధర్మాలలో ప్రధానమైనవి జొరాస్టీయ మతం, బవుద్ధ మతం,  ఇస్లాం మతం, మార్మను మతం, బహాయి మతం, అహ్మదీయ మతం మొదలగునవి. వీటిలో సగానికి పైగా మతాలు యితర మతధర్మాలను వుటంకిస్తూ వాటి బోధనలను ఒకవైపు తమకు ప్రామాణికమని చెప్పుకొంటూనే మరొకవైపు ఆమతధర్మాలకు చెందిన గ్రంథాలను తప్పుబడుతూ వాటిపై తమ ఆధిపత్యాని స్థాపించుకునే  కుసంస్కృతికి ఒడిగడుతూ తమ దివాళుకోరుతనాన్ని చాటుకుంటున్నాయి.  

ఒక వ్యక్తి ఒక ధార్మిక గ్రంథాన్ని తీసుకువచ్చి తనను తాను ఒక దైవప్రవక్తగా లేక దైవసందేశకునిగా లేక దైవప్రత్యక్షతగా లేక దైవఅవతారముగా ప్రకటించుకొంటూ దానికి సాక్ష్యంగా తానే తెచ్చిన గ్రంథాపు బోధలను చూపించడమన్నది అతర్కం, కుతర్కం, మరియు మోసం! ఈలాంటి పంథా లేక ప్రయత్నం ప్రధానంగా ఏకవ్యక్తి స్థాపిత మతాలలో ప్రస్పుటంగా కనిపిస్తుంది.

కొన్ని ఏకవ్యక్తి స్థాపిత మత గ్రంథాలలో యితర ధార్మిక గ్రంథాలను పేర్కొనడమే కాకుండా యితర ధార్మిక ప్రవక్తలను లేక ధార్మిక నాయకులను ప్రస్థావిస్తూ వారంతా తమ ధార్మిక మార్గానికే చెందినవారంటూ నమ్మించే ప్రయత్నాలను చూడగలము. ఇది మోసపూరితమైన వితండవాదం అన్నది ఇంగితజ్ఞానం ఉన్న యెవరికైన యిట్టే అర్థమైపోతుంది. 

బైబిలు విశిష్టత

సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు బోధనలే ప్రామాణికంగా వున్న క్రైస్తవ ధార్మికమార్గం యితర మతధర్మాలకు పూర్తిగా భిన్నమైనది. ఈ క్రింద ఇవ్వబడిన కొన్ని విశిష్టతలే అందుకు సాక్ష్యం:

1) బైబిలు బోధల అధారితమైన క్రైస్తవ్యం ఏకవ్యక్తి స్తాపిత మతం కాదు. నిజానికి అది అనేకమంది దైవప్రవక్తలు మరియు అపోస్తలుల సమిష్టి బోధనలపై స్థిరపడి విరాజిల్లుతున్న దైవరాజ్యం. 
2) బైబిలు గ్రంథం దాదాపు నలభైమంది దైవప్రేరితులద్వార మానవాళికి అందించబడిన గ్రంథం. ఒకే సంస్కృతికి చెంది ప్రామాణీకరించబడిన ప్రవక్తల పరంపరలోనుండి అందించబడిన  సాటిలేని మేటి గ్రంథం బైబిలు.            
3) బైబిలు గ్రంథం ఒకేభాషలో కాకుండా మూడు ప్రాచీన భాషలలో (హీబ్రూ, అరామిక్, గ్రీక్) అందించబడింది.   
4) బైబిలు గ్రంథం ఒకతరములోనే యివ్వబడిన గ్రంథం కాదు. పదునైదువందల సంవత్సరాల పరిధిలో (1400 క్రీ.పూ. — 95 క్రీ.శ.) సుధీర్ఘకాల ప్రత్యక్షతలో ఇవ్వబడిన గ్రంథరాజం బైబిలు.  
5) బైబిలు గ్రంథం ఒక పరిమితమైన భౌగోళిక స్థలంలో అందించబడిందికూడా కాదు. మూడు ఖండాలలో (ఆసియా, ఐరోపా, అఫ్రికా) అందించబడిన ఏకైక దైవ గ్రంథం.            
6) నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించు, నీశత్రువునుకూడా ప్రేమించి దీవించు మరియు సృష్టికర్త యెదుట స్త్రీపురుషుల గుర్తింపు, విలువ, మోక్షంలోని స్థానం ఏకరీతిగానే ఉంటాయన్న ఉత్కృష్ట విలువలను మానవాళికి అందించిన ఏకైక ధార్మిక గ్రంథం బైబిలు.         
7) లేఖికుల మధ్య, లిఖించబడిన భాషలలో, వ్రాయబడిన స్థలాలలో, అందించబడిన తరాలలో అనూహ్యమైన వైవిధ్యమున్నా సృష్టికర్తనుగూర్చిన ప్రత్యక్షతను, మానవాళి ప్రవృత్తిని, మోక్షాన్నిగూర్చిన వివరాలను అందించడంలో అబ్బురపరచే పొందికను ఐక్యతను పొందుపరచుకున్న అద్భుత గ్రంథం బైబిలు. 

సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు యూదు మరియు క్రైస్తవ లేఖనాల సంపుటి. 39 యూదు లేఖన గ్రంథాలను పాత నిబంధన గ్రంథము అని 27 క్రైస్తవ లేఖన గ్రంథాలను క్రొత్త నిబంధన గ్రంథము అని పేర్కొంటారు.    

ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రధాన క్రైస్తవ శాఖలన్నీకూడా ఈ 66 (39+27) యూదు క్రైస్తవ లేఖన గ్రంథాల సంపుటిని బైబిలుగా గుర్తిస్తారు. అయితే, కొన్ని క్రైస్తవ శాఖలు మాత్రం ఈ 66 అసలైన లేఖనగ్రంథాల సరసన మరికొన్ని చారిత్రక లేక పురాణాలకు సంబంధించిన గ్రంథాలనుకూడా కలుపుకొని వాటన్నిటినికలిపి దైవగ్రంథముగా పరిగణిస్తూ చదువుకొంటుంటారు.    

యూదులేఖనాలు మరియు క్రైస్తవలేఖనాలు యివ్వబడిన కాలాలకు మధ్య దాదాపు నాలుగు వందల సంవత్సరాల పరిధిలో యూదు రచయితలు తమ మతవిశ్వాసాలపై అనేక గ్రంథాలను రచించడం జరిగింది. వీటినే అపోక్రిఫ గ్రంథాలు అని పేర్కొంటారు. ఇవి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన గ్రంథాలు కావు కనుక యివి లేఖనాలు కావు. ఈ గ్రంథాలను యూదులుకూడా లేఖనాలుగా పరిగణించరు. అయితే, ప్రధానంగా రెండు క్రైస్తవ శాఖలు (రోమను కథోలిక్కులు మరియు గ్రీకు అర్థోడాక్సులు) ఈ యూదుల అపోక్రిఫ గ్రంథాలలోని కొన్నిటిని 66 అసలైన దైవలేఖన గ్రంథాల సరసన కలుపుకొని చదువుకుంటారు. రోమను కథోలిక్కులు 13 అపోక్రిఫ గ్రంథాలను కలుపుకోగా గ్రీకు అర్థోడాక్సులు 17 అపోక్రిఫ గ్రంథాలను కలుపుకున్నారు. అయితే యిక్కడ గమనంలో వుంచుకోవలసిన విశయం ఈ రెండు క్రైస్తవ శాఖలలోకూడా అసలైన 66 దైవలేఖన గ్రంథాల విషయంలో మాత్రం యెలాంటి అభిప్రాయ భేదాలు లేవు అన్నది.

ఏదైన ఒక క్రైస్తవశాఖ లేక గుంపు బైబిలుకు వేరే గ్రంథాన్ని లేక గ్రంథాలను కలుపుకున్నంతమాత్రాన బైబిలే మారిపోయిందనో లేక అసలైన బైబిలును గుర్తించడం అసాధ్యమనో వాదించడం శుద్ధ అవివేకం. అలాంటి వ్యాఖ్యానాలను సాధారణంగా విశయపరిజ్ఙానం లేని మూఢులేకాకుండా తర్కబద్ధంగా అలోచించగల సామర్థ్యంలేని అధములైనవారే చేస్తుంటారు అన్నది గమనములో ఉంచుకోవాలి.  

సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులోని యూదులేఖనాలు లేక పాతనిబంధన గ్రంథాలు (39) మూలభాషలైన ఆదిమ హీబ్రూ మరియు అరామిక్ భాషలలో లిఖించబడివుండగా క్రైస్తవ లేఖనాలు లేక క్రొత్తనిబంధన గ్రంథాలు (27) కొయినె గ్రీకు భాషలో లిఖించబడ్దాయి. 

సృష్టికర్త యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి ఆయన మానవాళికొసగిన తన లేఖనాల సంపుటియైన పరిశుద్ధ గ్రంథము (బైబిలు) ను 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా వున్న 670 భాషలలోకి అనువదించబడింది. కేవలము క్రొత్త నిబంధన (క్రైస్తవ లేఖనాలు) ప్రపంచములోని 1521 భాషలలోకి అనువదించబడింది. మానవాళికి ఇంత విస్తృతంగా అందుబాటులో ఉన్న–లౌకిక గ్రంథాలలో లేక ధార్మికమైన గ్రంథాలలో–ఏకైక గ్రంథం సంపూర్ణ దైవగ్రంథము బైబిలు. 

బైబిలు భావామృతం

బైబిలు అనువాదాలు మూలభాషలలో యివ్వబడిన లేఖనాల సాధారణ భావం మరియు సందేశ సారాంశాన్ని మాత్రం అందిస్తాయి అన్నది గమనంలో ఉంచుకోవాలి. బైబిలులోని ఒక అంశం లేక పదం యొక్క ఖచ్చితమైన భావాన్ని గ్రహించేందుకు మూలభాషలలో బైబిలును అధ్యయనం చేయడం తప్పనిసరి అన్నది కూడ గుర్తించాలి. 

బైబిలులో భూతవర్తమానభవిశ్యత్ కాలాలకు సంబంధించిన వివరాలు యివ్వబడ్డాయి. చరిత్ర ఘట్టాల సమాచారాలతో పాటు దైవప్రబోధాల వివరాలుకూడా బైబిలులో సందేశాలుగా అందించబడ్డాయి. బైబిలులోని ప్రబోధాలు కొన్ని అక్షరార్థముగా, కొన్ని అలంకారార్థముగా, మరికొన్ని మర్మఘర్భితంగా యివ్వబడ్డాయి. బైబిలు సందేశాలను సరిగ్గా అవగాహనచేసుకోవటానికి సందేశము యొక్క నేపథ్యాన్ని, కాలసందర్భాన్ని, సాంస్కృతిక వాతావరణాన్ని, సాహిత్య శైలులను పరిగణాలోకి తీసుకోవాలి. ఈ సందర్భంగా ప్రపంచభాషలలోకి అనువదించబడిన బైబిలు యొక్క అనువాదాల విశయములో గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యాంశాలు:

1. లేఖనాల అనువాదాలన్నవి ఏభాషలోకూడా నూటికి నూరుశాతం పరిపూర్ణత కలిగి ఉండవు.
2. లేఖనాలు దైవాత్మచేత ప్రేరేపించబడినవారిచేత వ్రాయబడ్డాయి. అలాగే, లేఖనాలను ఒక భాషలోనుండి మరొక భాసలోనికి దైవాత్మచేత ప్రేరేపించబడినవారు అనువదించిన సందర్భాలలోనే వాటి అనువాదం నూటికి నూరుశాతం పరిపూర్ణతన కలిగి ఉంటాయి. 
3. అనువాదాలను పట్టుకొని మూలభాషలోని అర్థాన్ని నిర్ధారించడం తర్కవిరుద్ధం. 
4. మూలభాషలోని అర్థాన్నిబట్టి అనువాదాలలోని అర్థాన్ని గ్రహించగలగాలి అవసరమైతే అనువాదాన్ని సరిచేసుకోవాలి. 
5. పాతనిబంధన (యూదు లేఖనాలు) లోని వాక్యాలకు క్రొత్తనిబంధన (క్రైస్తవ లేఖనాలు) లో యివ్వబడ్డ వివరణలు మరియు భాష్యాలు మాత్రమే నూటికి నూరుశాతం సరియైనవి.

బైబిలులోని సత్యాలను అందరూ గ్రహించలేకపోవడానికిగల కారణాలు

1) కొందరు బైబిలును అసలు చదవకుండానే లేక ఆసాంతము చదవకుండానే లేక దాన్ని చదవాల్సినవిధంగా చదవకుండానే యెవరో చెప్పిన మాటలు విని వాటిని నమ్మి బైబిలుగురించి తప్పుడు అవగాహనను యేర్పరచుకొని ఆ అజ్ఙానములో కొనసాగుతుంటారు. ఆ విధానము వారిని నాశనమార్గము వైపుకు నడుపుతుంది. అలాంటివారికి దైవసత్యం యెప్పటికీ అందదు. (మత్తయి 22:29)

2) కొందరు అబద్దికులును మరియు మోసగాండ్రులై యుండి యితరులను దురాత్మల బోధలలోనికి తీసుకొనివెళ్ళే ప్రయత్నంలో భాగంగా బైబిలులో తప్పులు వెదికేందుకే దాన్ని పఠిస్తారు. అలాంటివారికి అందులోని సత్యం ససేమిరా అవగతం కాదు. (1తిమోతి 4:1-2)

3) కొందరు తమ మూర్ఖత్వాన్నిబట్టి మోసపోయిన కారణంగా వారి మనోనేత్రాలకు సాతానుడు అంధకారం కలుగజేశాడు. అలాంటివారికి బైబిలులోని సత్యాన్ని వీక్షించడము అన్నది అసాధ్యమైన విశయం. (2 కొరింథీ 4:4)

4) కొందరు అహంకారంతో దైవసత్యాన్ని తిరస్కరించి అవిధేయతతో స్వనీతిపై ఆధారపడుతూ తమ స్వంత ప్రయత్నాలతో ముక్తిని సంపాదించుకునే ప్రయత్నాలను చేస్తుంటారు. అలాంటివారి హృదయాలను సృష్టికర్తే కఠిన పరచడం జరుగుతుంది. కనుక అలాంటివారు సత్యాన్ని గ్రహించలేక అసత్యములోనే కొనసాగుతుంటారు (కీర్తనలు 81:11-12; యెషయా 6:9-10; మత్తయి 13:13-15; 2 థెస్సలోనీకయులకు 2:9-12). అలాంటివారికికూడా బైబిలులోని దైవసత్యం సుదూరం.

5) చివరగా, కొందరికి అజ్ఙనాన్నిబట్టి అలాగే మందమతినిబట్టి హృదయాలు మూయబడివుంటాయి. ఈ కారణాన్నిబట్టికూడ లేఖనసత్యాన్ని గ్రహించలేరు. అయితే అలంటివారు యదార్థ హృదయాలతో దేవున్ని ప్రేమిస్తూ సత్యాన్ని అన్వేశిస్తున్నట్లయితే వారు లేఖనాలలోని దైవసత్యాన్ని గ్రహించేందుకు వీలుగా వారి హృదయాలను దేవుడే తెరవడం జరుగుతుంది (లూకా 24:25-32, 45).

బైబిలులోని ప్రవచనాలు మరియు వాటిని ఉటంకించిన విధానం

బైబిలులోని 66 [39 O.T. + 27 N.T.] గ్రంథాలన్నీకూడా దైవావేశముతో లిఖించబడిన లేఖనాలే. బైబిలు దేవుని గ్రంథము అని నిర్ధారణగా విశ్వసించటానికి గల అనేక ప్రాముఖ్యమైన కారణాలలోని ఒక ప్రాముఖ్యమైన కారణం అందులోని ప్రవచన పలుకులు మరియు వాటి నెరవేర్పులు.   

బైబిలు గ్రంథము దాదాపుగా 1500 సంవత్సరాల కాలవ్యవధిలో యివ్వబడింది. ఈ సుధీర్ఘకాల ప్రక్రియనుబట్టి బైబిలులో యివ్వబడిన కొన్ని భవిష్యవాణుల నెరవేర్పుకూడా బైబిలునందే గ్రంథస్థం చేయబడటాన్ని గమనించగలము.   

రెండవదిగా, బైబిలునందున్న కొన్ని ప్రవచన పలుకులు ఈనాటి ప్రపంచములో నెరవేరుతుండటాన్నికూడా సత్యసంధులు గుర్తించగలరు.  

చివరగా, బైబిలునందున్న మరికొన్ని ప్రవచనపలుకులు ఇంకా నెరవేరక రాబోవు దినాలలో నేరవేరబోతుండటాన్ని సూచిస్తున్నాయి.  

ఈ సందర్భంగా మొదటి వర్గానికి చెందిన బైబిలు ప్రవచనాలను మరియు వాటి నెరవేర్పులను బైబిలులోనే భద్రపరచిన విధానాన్ని లోతుగా పరిశీలించి సరియైనవిధంగా గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతగానో వుంది. 

దైవావేశముతో దైవసందేశాలను లిఖితరూపములో భద్రపరచిన పాతనిబంధనగ్రంథకర్తలు మరియు క్రొత్తనిబంధనగ్రంథకర్తలు యిరువురుకూడా పూర్వ ప్రవచనలేఖనాలను లేక వాటి నెరవేర్పులను గ్రంథస్థం చేయటములో మూడు విధానాలను అవలంబించారు:

1. ప్రవచనాలను వున్నదున్నట్లుగా ఎత్తివ్రాసారు [ద్వి.కాం.6:16 = మత్తయి.4:7; ద్వి.కాం.6:4 = మార్కు.12:29]  

2. ప్రవచనాల సారాంశాన్ని/వివరణను/అసలు భావాన్ని వ్రాసారు [ని.కాం.20:19 = ద్వి.కాం.18:16; నిర్గమాకాండము 9:22-28 = కీర్తన.105:32; నిర్గమాకాండము 32:4-8 = కీర్తన.106:19-20; సంఖ్యాకాండము 14:24 = ద్వితీయోపదేశకాండము 1:36; సంఖ్యాకాండము 25:1-3 = కీర్తన.106:28; 2సమూయేలు.24:1 = 1ది.వృ.21:1 ; కీర్తన.40:6-8 = హెబ్రీ.10:5-7; యెషయా.29:13 = మత్తయి.15:8-9; యెషయా.59:20 = రోమా.11:26 ]

3. ప్రవచనాల పదజాలాన్ని మార్చి వేరే పదాలలో వాటిని వ్యక్తపరచారు [ద్వితీయోపదేశకాండము 32:17 = కీర్తన.106:37; ద్వి.కాం.1:36 = యెహోషువ.14:9 ; సం.కాం.11:4 = కీర్తన.78:19; ద్వి.కాం.6:5 = మార్కు.12:30; జెకర్యా 9:9 = మత్తయి.21:5; కీర్తన.40:6 = హెబ్రీయులకు 10:5]  

పై విధానాలన్నీకూడా దేవుని ఆత్మ ప్రేరణలోనే [Inspiration] జరిగిన ప్రక్రియలు. 

Permalink to single post

యేసు క్రీస్తు మరణపునరుత్థాన వివరాల మధ్య పొందిక

అవిశ్వాసుల అపోహలు మరియు అభ్యంతరాలు

– ఆదివారము తెల్లవారుజామున యేసుసమాధి వద్దకు వచ్చింది ఎంతమంది స్త్రీలు? ఒక్కరా అంటే మగ్ధలేనే మరియనా (యోహాను.20:1)? ఇద్దరా (మత్తయి.28:1)? ముగ్గురా (మార్కు.16:1)? లేక అనేకులా (లూకా.24:1)?
– యేసు సమాధిలో స్త్రీలు చూసింది ఒక వ్యక్తినా/దేవదూతనా (మత్తయి.28:2-7; మార్కు.16:4-7) లేక యిద్దరు వ్యక్తులనా/దేవదూతలనా (లూకా.24:4-8)?
– యేసు సిలువ వేయబడింది లేక మరణించింది యేరోజు?
– యేసు పునరుత్థానుడైన తరువాత మొట్టమొదట ఎవరికి కనిపించాడు? మగ్ధలేనే మరియకా (మార్కు.16:9) లేక యితర స్త్రీలకా (మత్తయి.28:8)?
– యేసు సమాధిలోనుండి లేచింది యేరోజు?
– యేసు సమాధిలో ఎన్ని గంటలు మరియు రోజులు వున్నాడు?
– యేసు మరణపునరుత్థానములో యోనా సూచక క్రియ ఏవిధంగా నేరవేర్చబడింది (మత్తయి.12:39-40)?

అవిశ్వాసులు మరియు బైబిలు వ్యతిరేకులు క్రొత్తనిబంధన గ్రంథములోని దైవసత్యాలను తిరస్కరించే తమ వ్యర్థ ప్రయత్నాలాలో భాగంగా పై ప్రశ్నలను లేవనెత్తడం సహజంగా జరిగే విశయమే. అయితే, సత్యం అన్ని వేళల సరళంగానే అందించబడాలి అన్న నియమమేదీ లేదు. మరిముఖ్యంగా, దైవ సత్యం అన్నది మానవాళికి చాలామట్టుకు మర్మఘర్బితంగా యివ్వబడింది అన్నది గమనములో వుంచుకోవాలి. 

క్రొత్తనిబంధన గ్రంథములోని వివరణలు సత్యాన్వేషకులకు మరియు సత్యద్వేషులకు వేరువేరుగా అగుపించే అవకాశాలు ఎక్కువ. బైబిలును తప్పు బట్టి తమ వక్రవ్యాఖ్యానాలద్వారా అమాయకులను తప్పు మార్గం పట్టించే సత్యద్వేషులకు బైబిలులోని ప్రతి సత్యం ఒక అసత్యంగా ప్రతి మర్మం పరస్పర వ్యతిరిక్తంగా కనిపించడం సర్వసాధారణమైన విశయం. అలాంటివారి అజ్ఙానాన్ని దుష్టప్రయత్నాలను ప్రక్కకు పెట్టి సహృదయముతో సత్యాన్ని స్వీకరించే సత్యాన్వేషకులకు సహకరించే సదుద్దేశముతో క్రింది వివరాలను మీముందు వుంచడమైనది. సత్యాన్వేషకులు, సహృదయులు, మరియు విజ్ఙులు అయిన వారిని క్రింది వివరాలను పరిశీలించి సత్యాన్ని స్వీకరించాల్సిందిగా సగౌరవంగా అహ్వానిస్తున్నాము.

నలుగురు సువార్తికులద్వారా యివ్వబడిన యేసు క్రీస్తు మరణపునరుత్థానాల వివరాల సమగ్ర సారాంశము

యూదులు దినాన్ని లెక్కించే విధానము ప్రకారము యేసు క్రీస్తును బుధవారము నిస్సాను 14వ తారీఖునాడు మధ్యరాత్రి తరువాత రోమా సైనికులు బంధించి తీసుకువెళ్ళారు. ప్రాతఃకాలము 6 గంటలకుముందే రోమా అధిపతి పొంతిపిలాతు అతనికి తీర్పుతీర్చి సిలువ వేయబడుటకు అప్పగించాడు (యోహాను.18:28; 19:14).

అదేదినము ఉదయము 9 గంటల ప్రాంతములో ఆయనను సిలువవేసారు (మార్కు.15:25). ఆరోజు మధ్యాహానము 12 గంటలనుండి 3 గంటలవరకు ఆదేశమంతా చీకటికమ్మింది (మత్తయి.27:45; మార్కు.15:33; లూకా.23:44). 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు (మార్. 15:33-37).

అదేరోజు సాయంత్రము 6 గంటలలోపే ఆయన దేహాన్ని దగ్గరిలోనే వున్న ఒక తోటలోని రాతి సమాధిలో వుంచారు (మార్కు.15:42-47; యోహాను.19:41-42). ఇదంతా దగ్గరలోనే నిలుచుండి ఆయనను వెంబడించిన స్త్రీలు (యాకోబు మరియు యోసేపుల తల్లి మరియ, జెబదీ కుమారుల తల్లి, మగ్దలేనె మరియ, మరియు సలోమి) చూసి తమ యిళ్ళకు వెళ్ళి ఆ దినమంతా (బుధవారము సాయంత్రము మొదలుకొని గురువారము సాయంత్రమువరకు) విశ్రమించారు. అది ప్రత్యేకమైన లేక మహావిశ్రాంతిదినం (యోహాను.19:31). అదేదినం ఆ రాతిసమాధిని అధికారులు భద్రంచేసారు (మత్తయి.27:62-66). 

ఆ ప్రత్యేక లేక మహావిశ్రాంతిదినముగడిచిన తరువాత శుక్రవారమునాడు స్త్రీలు సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను కొని సిద్దపరచి (మార్కు 16:1) మరునాడు అంటే శనివారము సాధారణ విశ్రాంతిదినము గనుక తిరిగి ఆ దినమంతా విశ్రమించారు (లూకా.23:56).

శనివారము సాయంకాలము 6 గంటల ప్రాంతములో ఆయన సమాధినుండి తిరిగి లేచాడు! ఇది ఆయన చనిపోకముందు చెప్పిన ప్రవచనాల ఆధారంగా మూడు పగళ్ళు మూడు రత్రుళ్ళు గడచాయి (మత్తయి.12:40) గనుక ఆయన మరణాన్ని జయించి తిరిగిలేచింది శనివారపు చివరిలో లేక ఆదివారపు ప్రారంభములో (బైబిలు లెక్క ప్రకారము ఒక దినము అంటే సాయంత్రము మొదలుకొని మరుసటి సాయంత్రము వరకు) నన్నది గ్రహించవచ్చు.

 ఆదివారము పెందరాళ్ళే యింకా చాలా చీకటిగానున్నప్పుడే యేసు క్రీస్తును వెంబడించిన స్త్రీలు తాము శుక్రవారమునాడు సిద్దపరచిన సుగంధ ద్రవ్యాలను పరిమళ తైలాలను తీసుకొని ఆయన దేహానికి పూయడానికి సమాధివైపు బయలుదేరారు (మార్కు.16:1-2; లూకా.24:1). మగ్దలేనె మరియ వారిలో ఒకతి (మత్తయి.28:1; యోహాను.20:1). అయితే సమాధి ద్వారానికి అడ్డంగా వుంచబడిన రాతినిగురించి ఆ స్త్రీలు కొంత చింతనచేయాల్సి వచ్చింది (మార్కు.16:3).

ఆ స్త్రీలు సమాధిని సమీపించడానికి ముందే ఆదివారము తెల్లవారుజామున భూకంపము రావడము, పరలోకమునుండి దేవదూత వచ్చి సమాధికి అడ్డుగా వుంచబడిన రాతిని తొలగించి దానిపై కూర్చోవడం జరిగింది (మత్తయి.28:2). ఇదంతా చూసిన కావలివారు భయముతో స్పృహతప్పి పడిపోయారు (మత్తయి.28:4). అటుతరువాత దేవదూత సమాధిలోకి ప్రవేశించి యేసు దేహముంచబడిన స్థలములో ఆయన తల వుంచబడిన కుడిభాగములో కూర్చున్నాడు (మార్కు 16:5). మరికొంత సమయములోనే మరొక దేవదూత వచ్చి యేసు కాళ్ళు వుంచబడిన యెడమభాగములో కుర్చోవడము జరిగింది (లూకా.24:4).

స్త్రీలు యింకా సమాధికి దూరంగా వుండగానే సమాధి రాతి తొలగించబడినట్లు (మార్కు.16:4; లూకా 24:2; యోహాను 20:1) అక్కడే కావలివాళ్ళు నేలపై మృతజీవులలా నిశ్ఛలంగా పడివున్నట్లు గమనించారు (మత్తయి.28:5). ఆ దృశ్యాన్ని చూసిన స్త్రీలు యేసు శరీరాన్ని యెవరో యెత్తుకొనిపోయారన్న తీర్మానానికి వచ్చారు. దాంతో మగ్దలేనె మరియ పేతురుకు మరియు ఇతర శిష్యులకు ఆ విశయాన్ని తెలియచేయడానికి వెంటనే మిగతా స్త్రీలను వదిలి అక్కడినుండే వెనుదిరిగి తిరిగి నగరమువైపు వెళ్ళింది (యోహాను.20:2). 

మగ్దలేనే మరియ తమను విడిచి వెనక్కు వెళ్ళినతదుపరి తతిమా స్త్రీలు ధైర్యం కూడగట్టుకొని తెరచి వుంచిన సమాధిలోనికి ప్రవేశించి అక్కడ యేసు శరీరము లేకుండుట గమనించారు. అంతలోనే మొదట అక్కడ కుడివైపున ఆసీనుడైవున్న దేవదూత వారికి ప్రత్యక్షమయ్యాడు (మార్కు.16:5) ఆ దేవదూత వారిని చూసి లేచి మాట్లాడుతున్నప్పుడు రెండవదూత కూడ వారికి ప్రత్యక్షమై నిలబడ్డాడు (లూకా.24:4). కుడివైపునున్న దేవదూత యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి వారికి ప్రకటించి ఆ వార్తను యేసు శిష్యులకు తెలుపవలసినదంటూ వారికి సూచించాడు (మత్తయి.28:6-7). అదివిన్న ఆ స్త్రీలు భయముతోను ఆనందముతోను సమాధిని విడిచి వెళ్ళిపోయారు (మత్తయి.28:8; మార్కు.16:8).

వారందరు తిరిగి నగరములోకి వచ్చారు కాని తాము చూసిన మరియు విన్న విశయాలను యితరులకు చెప్పడానికి తటపటాయిస్తూ వుండిపోయారు (మార్కు.16:8). స్త్రీలు సమాధిని విడిచివెళ్ళిన తరువాత యిద్దరుదేవదూతలు అదృశ్యమయిపోయారు. చివరికి ధైర్యం కూడగట్టుకొని అ స్త్రీలు శిష్యులదగ్గరకు వెళ్ళి తాము చూసిన విశయాలను తెలియచేసారు (లూకా.24:9-12). 

రమారమి అదేసమయములో మగ్దలేనే మరియ యేసు శిష్యులను కలిసి యేసు దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారన్న వార్త అందించింది (యోహాను 20:2). మగ్దలేనే మరియ మరియు మిగత స్త్రీలు ఆశ్చర్యపరిచే అసాధారణవిశయాలను చెప్పడం శిష్యులు విని వారి మాటలను నమ్మలేక పోయారు (లూకా.24:11). పేతురు మరియు యోహానులు స్త్రీలు చెప్పినది వాస్తవమో కాదోనని తేల్చుకోవడానికి పరుగెత్తి సమాధివద్దకు వెళ్ళారు (లూకా.24:12; యోహాను.20:3). మగ్దలేనే మరియ వారివెంబడే బయలుదేరింది కాని వారిలా పరుగెత్త లేక వారికి చాలా దూరంగా వెనుకబడిపోయింది.

మొదటగా సమాధిని చేరుకున్న యోహాను తరువాత అతని వెనుకే వచ్చిన పేతురు ఇరువురూ కలిసి సమాధిలోనికి ప్రవేశించారు. వారికి యేసు శరీరానికుండిన వస్త్రాలు తప్ప యేసు దేహం కనిపించలేదు సమాధిలో. దాంతో ఆశ్చర్యచకితులై వారిద్దరూ తిరిగి తాముంటున్న ఇంటికి వచ్చేసారు (యోహాను.20:4-4-10). 

ఆ తరువాత అక్కడికి చేరుకున్న మగ్దలేనే మరియ సమాధిలోనికి ప్రవేశించింది. ఆమె ప్రవేశించడానికి ముందే యిద్దరు దేవదూతలు తిరిగి దృశ్యరూపులయ్యారు. సమాధిలోనికి ప్రవేశించిన మరియ ఆ యిద్దరు దేవదూతలను చూసింది. అందులోని కుడివైపుననున్న దూత ఆమెతో మాట్లాడాడు (యోహాను.20:11-13). అదివిని వెనుకకు తిరిగిన మరియకు అక్కడే నిలుచున్న యేసు కనిపించాడు, కాని ఆ ప్రాతఃకాల మసకచీకటిలో ఆమె అది యేసు అని గుర్తించలేక అతన్ని అక్కడి తోటమాలి అని భ్రమించింది. అయితే, అప్పుడే “మరియా” అంటూ యేసు ఆమెను సంబోధిస్తూ పిలవడంతో ఆమె అతన్ని గుర్తుపట్టింది (యోహాను.20:14-16).

యేసు ఆమెతో సంభాశించి తన శిష్యులకు తెలుపమంటూ ఒక సందేశాన్ని యిచ్చి ఆమెను వారిదగ్గరకు పంపించాడు (మార్కు.16:9; యోహాను.20:17). పునరుత్థానుడైన యేసు ప్రభువును మొట్టమొదట చూసింది మగ్దలేనే మరియ (మార్కు.16:9). దీని తరువాత సమాధిలో తాము చూసిన విన్న విశయాలను శిష్యులకు చెప్పి అక్కడినుండి తమలోని ఒకరి ఇంటికి వెళ్ళిన స్త్రీలకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. వారు పునరుత్థానుడైన ప్రభువును చూసి ఆయనను పూజించారు. వారి ఆరాధనను స్వీకరించిన యేసు వారితో మాట్లాడి వారికో సందేశాన్ని యిచ్చి తన శిష్యులదగ్గరకు తిరిగి పంపించాడు (మత్తయి 28:9-10). 

పై సంఘటనలన్నీ జరుగుతున్న సమయములో కావలివారు స్పృహలోకివచ్చి లేచి నగరములోకి పరిగెత్తుకొనిపోయి యూదామతనాయకులకు తాము చూసినవి తమకు జరిగినవి అన్నీ వివరించి చెప్పారు (మత్తయి.28:11-15). 

ఈసమయానికంతా తోమా తప్ప మిగతా శిష్యులంతా చేరి తప్పిపోయిన ప్రభువు శరీరమును గురించి చర్చించసాగారు. అంతలో ప్రభువైన యేసు మరణములోంచి లేచి సజీవునిగా కనిపించాడంటూ వారిని ఆశ్చర్యముతో తలమునకలుచేసే వార్తను మగ్దలేనే మరియ మోసుకొచ్చింది (మార్కు.16:11; లూకా.24:10; యోహాను.20:18). ఇదే వార్తను నిర్ధారిస్తూ తతిమా స్త్రీలు కూడా శిష్యుల వద్దకు వచ్చి తమకు ప్రభువు తమకు కనిపించి చెప్పిన విశయాలన్నిటిని వారికి పూసగుచ్చినట్లు వివరించి చెప్పారు (లూకా.24:9). 

ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినతరువాత మూడు సంపూర్ణదినాలు అంటే 72 గంటల సమయం భూగర్భములో (పాతాళములో) వున్నాడు అనటానికి మూడు లేఖన ఆధారాలు

1. “ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము [μεγάλη=గొప్ప; పెద్ద;] గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.” యోహాను.19:31)

పాతనిబంధన గ్రంథములో వివరించిన ప్రకారము సబ్బాతు లేక విశ్రాంతిదినము అన్నది ఒక ప్రత్యేకమైన దినము. ఆ దినములో ఇశ్రాయేలీయులు సమాజముగా దేవుని ఎదుట కూడాలి మరియు వారు ఆదినము జీవనోపాధియైన ఏపనీ చేయకూడదు. విశ్రాంతిదినము రెండు రకాలు. ఒకటి, వారాంతములో వచ్చే సాధారణ విశ్రాంతిదినము (ఏడవదినము లేక శనివారము). రెండు, సంవత్సరములో ఒకేసారి వచ్చే యేడు ప్రత్యేకమైన పండుగ దినాలు. ఈ ప్రత్యేకమైన మహావిశ్రాంతిదినాలు వారములోని ఏదినమైనా రావచ్చు. అవి క్రింద యివ్వబడిన పండుగలు: 

(i) పులియనిరొట్టెల పండుగ యొక్క మొదటి దినము లేక “పెసహ్” ( ఆబీబు/నిసాను మాసము 15వ దినము)–లే.కాం.23:7; సం.కాం.28:17-18
(ii) పులియనిరొట్టెల పండుగ యొక్క చివరి/యేడవ దినము లేక “యోం తొవ్” ( ఆబీబు/నిసాను మాసము 21వ దినము)–ని.కాం.12:18, 13:6; లే.కాం.23:8; సం.కాం.28:25
(iii) పెంతెకోస్తు పండుగ లేక “షవూత్” (సివాను మాసము 6వ దినము)–లే.కాం.23:15-21
(iv) బూరధ్వనుల పండుగ లేక “రోష్-హ షాన” (తిష్రీ మాసము మొదటి దినము)–లే.కాం.23:24-25; సం.కాం.29:1
(v) పాపప్రాయశ్చిత్తార్థదిన పండుగ లేక “యోం కిప్పూర్” (తిష్రీ మాసము 10వ దినము)–లే.కాం.23:23-32; సం.కాం.29:7-8
(vi) పర్ణశాలల పండుగ లేక “సుక్కోత్” (తిష్రీ మాసము 15వ దినము)–లే.కాం.23:33-35; సం.కాం.29:12
(vii)పర్ణశాలల పండుగ యొక్క చివరి దినము లేక “షెమిని అట్జెరెత్” (తిష్రీ మాసము 22వ దినము)–లే.కాం.23:36,39; సం.కాం.29:35 

పై ఏడు పండుగదినాలు మహావిశ్రాంతిదినాలు. ఆదినాలలో ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట కూడి సమాజముగా ఆరాధించాలి మరియు వారు ఆదినమంతటిలో జీవనోపదియైన ఏపని చేయకూడదు. యేసు ప్రభువు మరణించిన దినానికి మరుసటి దినము ఏడు ప్రత్యేకమైన మహావిశ్రాంతిదినాలలోని ఒక దినము (యోహాను.19:31). ఒకవేళ, యేసు ప్రభువు మరణించిన దినపు మరుసటి రోజు అయిన మహావిశ్రాంతిదినము కూడా సాధారణ విశ్రాంతిదినమైన శనివారమునాడే వస్తే అది ఒక అసాధారణమైన విశయముగా పరిగణించవచ్చు. అలాంటి అసాధారణ సంఘటన సంభవిస్తే నలుగురు సువార్తికులలో ఒక్కరైనా ఆవిశయాన్ని పేర్కొని వుండేవారు. కాని అలా జరుగలేదు అన్నది యిక్కడ గమనార్హమైన విశయము. 

2. “విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.” (మార్కు.16:1)
ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.” (లూకా.23:54-56) 

మర్కు 16:1 ప్రకారము స్త్రీలు విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత సుగంధద్రవ్యములను కొన్నారు (సిద్ధపరచారు). లూకా 23:56 ప్రకారము స్త్రీలు సుగంధద్రవ్యములను సిద్ధపరచి (కొని) విశ్రాంతిదినాచారము ప్రకారము విశ్రమించారు. ఈ రెండు వివరాలు వాస్తవమవటానికి రెండు విశ్రాంతిదినాలు వుండాలి–ఒకటి ప్రత్యేకమైన విశ్రాంతిదినము మరొకటి సాధారణమైన విశ్రాంతిదినము. దీన్ని సమర్థిస్తూ యోహాను 19:31లో యేసుక్రీస్తు మరణించిన మరుసటిదినము మహా విశ్రాంతిదినముగా పేర్కొనబడింది. అలాకాని పక్షములో అంటే శుక్రవారమే యేసు ప్రభువు చనిపోయిన దినము అయితే రెండు వివరాలలో ఒకటిమాత్రమే వాస్తవమవుతుంది! 

3. “యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.” (మత్తయి.12:40) 

పై వాక్యములో ఒకవేళ “మూడు దినాలు” అని వ్రాయబడితే యూదులు దినాన్ని లెక్కించే పద్దతిలో శుక్రవారములోని కొంత భాగము, శనివారము అంతా, మరియు ఆదివారములోని కొంతభాగము కలిపి “మూడుదినాలు” అని లెక్కించే అవకాశముంది. కాని, లేఖనము “మూడు రాత్రింబగళ్ళు” అంటూ చాలా విస్పష్టముగా మూడు సంపూర్ణదినాలను అంటే 72 గంటల సమయాన్ని నొక్కి వక్కాణిస్తున్నది. లేఖనములోని ఈ స్పష్టతను తిరస్కరిస్తున్నవారు ఒకవేళ లేఖనము మూడు సంపూర్ణ దినాల లేక 72 గంటల సమయపు స్పష్టతను వ్యక్తంచేయాల్సివస్తే ఏలాంటి పదజాలాన్ని వుపయోగించాలోనన్నది ఉదాహరణతో వివరించాలి. 

పాతనిబంధన గ్రంథము (తనాక్) ప్రకారము పస్కా పండుగను ఆచరించడములోని కొన్ని ప్రధాన ఆజ్ఙలు మరియు ఘట్టాలు

1. ఆబీబు/నిసాను మాసము 10వ దినాన నిర్దోషమైన ఏడాది వయసున్న పస్కా పశువును ఏర్పరచుకోవాలి (ని.కాం.12:3)
2. పస్కా పశువును ఆబీబు (నిసాను) మాసము 14వ దినము వరకు సిద్ధపరచాలి (ని.కాం.12:7)
3. నిసాను మాసము 14వ దినము సాయంకాలము పస్కా పశువును వధించాలి (ని.కాం.12:7; యెహోషువ 5:10)
4. ఆరాత్రే పస్కా పశువు మాంసమును కాల్చి పొంగని/పులియని రొట్టెలతో చేదు కూరలతో దాన్ని తినవలెను (ని.కాం.12:8)
5. పస్కా పండుగను ఇశ్రాయేలీయులు మాత్రమే పాటించాలి (ని.కాం.12:42-45)
6. పస్కా పండుగను యెరూషలేములోనే ఆచరించాలి (ద్వి.కాం.16:2-7)
7. పస్కా పశువు వధింపబడిన తరువాతే పులియనిరొట్టెలతోకూడిన పస్కా పండుగను ఆచరించాలి (ని.కాం.12:1-11; ద్వి.కాం.16:2-7)

క్రొత్తనిబంధన గ్రంథము ప్రారంభములో అంటే యేసుక్రీస్తు ఈలోకములో జీవించిన సమయములో నిసాను 14వ దినాన వచ్చే పస్కా పండుగను దానివెంటనే అదే మాసములో 15వ దినాన మొదలయ్యే పులియనిరొట్టెల పండుగను కలిపి పులియనిరొట్టెల పండుగ కాలముగా పరిగణించేవారు (లూకా.22:1). అయితే అదే పండుగ కాలాన్ని ఈనాటి యూదులు పస్కా పండుగ కాలంగా పరిగణించడం గత రెండువేల సంవత్సరాల పరిధిలో జరిగిన మార్పు అన్నది గ్రహించాలి. 

క్రీస్తుశకం రెండవ శతాబ్ధమునుండి పస్కా పండుగ/పులియనిరొట్టెల పండుగ జరుపుకునే విధానములో అనేక ఆచారాలను రబ్బీలు అంటే యూదా మతాధికారులు చొప్పించడము జరిగింది. ఇవేవీ మొదటి శతాబ్ధములోని యూదులు పాటించలేదు. ఈనాడు యూదులు పాటించే “పస్కా సెదెర్” (పస్కా పండుగను ఆచరించే క్రమము) కాలక్రమములో మార్పులు చేర్పులు చెందుతూ నేటి స్థాయికి చేరుకుంది. రెండువేల సంవత్సరాల క్రితం అనుసరించబడిన పస్కా సెదెర్ ఈనాడున్న పస్కా సెదెర్ లా విస్త్రుతమైన ఆచారాలతో కూడింది కాదు. ఈ కారణాన్నిబట్టి యేసు ప్రభువు మరియు ఆయన శిష్యులు పాటించిన పస్కా సెదెర్ కు ఈనాడు యూదులు పాటించే పస్కా సెదెర్ కు మధ్య వ్యత్యాసాలుండటం కద్దు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు/యూదులు మొదటి శతాబ్ధము వరకు పస్కా పశువును వధించి పండుగను ఆచరించేవారు (2ది.వృ.35:1; ఎజ్రా.6:19-21; మార్కు.14:12). ఈనాడు రబ్బీల-జూడాయిజమును అనుసరిస్తున్నవారు ఆ ఆచారమును పాటించడము లేదు. 

పాతనిబంధన గ్రంథములో (తనాక్) పస్కా పండుగను ఆచరించాల్సిన ప్రజలను గురించి, కారణాన్ని గురించి, విధానాన్ని గురించి, అలాగే ఆచరించాల్సిన స్థలమును గురించి దేవుడు వివరించడమేగాక రాబోవు తరాలు అనుసరించదగిన కొన్ని దృష్టాంతాలను కూడా పాతనిబంధన గ్రంథములో (తనాక్) అందించాడు. ఈ వాస్తవాన్ని బట్టి పాతనిబంధన గ్రంథ కాలములో అలాగే క్రొత్తనిబంధన గ్రంథ కాలములో అంటే 1400 క్రీ.పూ. నుండి 100 క్రీ.శ. వరకు దేవుని స్పష్టమైన ఆజ్ఙ ప్రకారము మోషేధర్మశాస్త్రాన్ని (పంచకాండాలను) అనుసరించిన ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దేవుడేర్పరచుకున్న యెరూషలేమునగరములోనే లేఖనాల క్రమములో జరుపుకునేవారు.

ఈనాడు యూదులమంటూ చెప్పుకుంటున్నవారు యూదుమతములో చేరినవారు తనాక్ (పాతనిబంధన) బోధలను ప్రక్కకుబెట్టి ఈ పండుగను ఆచరించే విశయములో దేవుడిచ్చిన స్పష్టమైన ఆజ్ఙలను తుంగలో తొక్కి రబ్బీల బోధల ప్రకారము అంటే రబ్బీల-జూడాయిజం ప్రకారము పస్కా పండుగను తాముంటున్న దేశములో తాము నివసిస్తున్న ఊరిలో రబ్బీలు నిర్దేశించిన క్రమమములో రబ్బీలు యేర్పరచిన ఆచారాలతో జరుపుకుంటున్నారు! 

ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) జీవితములోని చివరి వారములో జరిగిన ప్రధాన సంఘటనల సంక్షిప్త సూచిక

మూడవదినము/మంగళవారము: పగలు (ఆబీబు/నిసాను మాసము 13వ తారీఖు) — శిష్యులు వెళ్ళి యేసు చెప్పిన మాటల ప్రకారము మేడగదితో కూడిన ఇంటిని కనుగొనటము; 

మూడవదినము/మంగళవారము:రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిస్సాను మాసము 14వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు బుధవారపు ప్రారంభము) యేసు ప్రభువు మరియు శిష్యులు పస్కా పండుగ భోజనము చేయుట; గెత్సేమనే తోటలో ప్రార్థించటము; రోమా సైనికులచేత యేసు ప్రభువు బంధించబడటము; యూదు మతాదికారులముందు యేసు ప్రభువును నిలబెట్టడటము; మరునాడు అంటే నిస్సాను మాసము 15వ తారీఖునాడు పులియనిరొట్టెల పండుగ యొక్క మహావిశ్రాంతిదినము అనబడే మొదటిదినము. కనుక, ఈదినము మరుసటిదినానికి సిద్దపరచు దినము; 

నాలుగవదినము/బుధవారము: పగలు (ఆబీబు/నిసాను మాసము 14వ తారీఖు కొనసాగింపు) — రోమా అధికారి పిలాతుముందు యేసు ప్రభువును దోషిగా నిలబెట్టడము; ఉదయము 9:00 గంటలకు యేసు ప్రభువును సిలువపైకి ఎక్కించడము; మధ్యాహానము 3:00 గంటలకు యేసు ప్రభువు చివరి శ్వాస; ఆరోజు చివరలో యేసు ప్రభువు యొక్క ఆత్మ/ప్రాణము భూగర్భములోకి అంటే పాతాళములోకి వెళ్ళడము మరియు ఆయన మృతదేహము రాతిలో తొలచబడిన సమాధిలో వుంచబడటము; 

నాలుగవదినము/బుధవారము: రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 15వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు గురువారపు ప్రారంభము); యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మొదటిరాత్రిప్రారంభము; మహా విశ్రాంతిదినపు ప్రారంభము; యేసు ప్రభువును వెంబడించిన స్త్రీలు తమ ఇండ్లకు వెళ్ళి విశ్రమించారు; 

ఐదవదినము/గురువారము (బేస్తవారము): పగలు (ఆబీబు/నిసాను మాసము 15వ తారీఖు కొనసాగింపు) — యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మొదటిపగలు; మహా విశ్రాంతిదినపు కొనసాగింపు; స్త్రీలు విశ్రాంతిదినాన్ని పాటించారు; ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు పిలాతు అనుమతితో సమాధిని భద్రం చేసారు (మత్తయి.27:62-66); 

ఐదవదినము/గురువారము (బేస్తవారము): రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 16వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు శుక్రవారపు ప్రారంభము) యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన రెండవరాత్రి ప్రారంభము; మహా విశ్రాంతిదినము సమాప్తి; ఈదినం సాధారణ విశ్రాంతిదినానికి అంటే శనివారపు విశ్రాంతిదినానికి సిద్దపరచు దినము; 

ఆరవదినము/శుక్రవారము:పగలు (ఆబీబు/నిసాను మాసము 16వ తారీఖు కొనసాగింపు) — యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన రెండవపగలుకొనసాగింపు; సిద్దపరచు దినపు కొనసాగింపు; మరునాడు సాధారణ విశ్రాంతిదినము (శనివారము); యేసు ప్రభువును వెంబడించిన ఆ స్త్రీలు ఆయన దేహానికి పూయవలేనని సుగంధద్రవ్యములను కొన్నారు (మార్కు 16:1); 

ఆరవదినము/శుక్రవారము: రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 17వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు శనివారపు ప్రారంభము); సాధారణ విశ్రాంతిదినపు ప్రారంభము; ఇది యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మూడవరాత్రిప్రారంభము; యేసు ప్రభువును వెంబడించిన స్త్రీలు తిరిగి విశ్రాంతిదినాచారము ప్రకారము విశ్రమించారు (లూకా.23:56) 

ఏడవదినము/శనివారము: పగలు (ఆబీబు/నిసాను మాసము 17వ తారీఖు కొనసాగింపు); సాధారణ విశ్రాంతిదినపు కొనసాగింపు; యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మూడవపగలుకొనసాగింపు; స్త్రీలు విశ్రాంతిదినాచారాని కొనసాగించారు; 

ఏడవదినము/శనివారము: రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 18వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు ఆదివారము లేక మొదటిదినము ప్రారంభము); మూడు రాత్రింబగళ్ళు గడిచిపోయాయి; ప్రభువైన యేసు క్రీస్తు (ఆత్మ/ప్రాణము) తన శరీరముతో ఐక్యపరచబడి మృత్యుంజయుడై పునరుత్థానుడయ్యాడు, మరియు మహిమశరీరముతో సమాధిలోనుండి వెళ్ళిపోయాడు; 

మొదటిదినము/ఆదివారము: తెల్లవారుజామున (ఆబీబు/నిసాను మాసము 18వ తారీఖు కొనసాగింపు); స్త్రీలు తాము సిద్దపరచిన సుగంధద్రవాలతో సమాధి దగ్గరకు వచ్చారు; సమాధిలో యేసు ప్రభువు దేహము లేదు; 

Permalink to single post

మోషేనిబంధన

దేవుడు మోషేద్వారా చేసిన నిబంధనను మోషేనిబంధన [Mosaic Covenant] అని అలాగే పూర్వ/పాత నిబంధన [Previous/Old Covenant] అనికూడా సంబోధిస్తారు.

(1) ఈ నిబంధన దేవుడు ప్రధానంగా ఇశ్రాయేలు వంశస్తులతో చేసాడు (ని.కాం.19:3-6, 24:3-8; ద్వితీ.కాం.4:7-8, 5:1-5, 29:1; మలాకి 4:4; రోమా.2:11-12, 3:19, 9:4; ఎఫెసీ. 2:11-12; హెబ్రీ.8:9).

అయితే, వారితో మాత్రమే కాకుండా నిబంధన సమయములో వారిమధ్య జీవిస్తూ వారితోపాటు వాగ్దత్త దేశమైన కానానులో స్వాస్థ్యము పొందబోతున్న అన్యులతో/పరదేశులతో అలాగే ఆసమయములో అక్కడ వారితోకూడా లేని వారిసంబంధికులందరితో అంటే కనానుదేశములో స్వాస్థ్యము పొందబోతున్న రాబోవుతరాలతోకూడా (ద్వి.కాం.29:10-15, 29) చేశాడు. ఇది మానవులందరితో చేయబడిన ఆదాము-నిబంధన (ఆది.కాం.3:15-21) లేక నోవహు-నిబంధన (ఆది.కాం.9:1-17) వంటిది కాదు. 

(2) ఈ నిబంధనలో భాగంగా ఇవ్వబడిన నియమవిధులను (ధర్మశాస్త్రాన్ని) ఇశ్రాయేలీయులు పూర్తిగా పాటించాలి (ని.కాం.15:26; ద్వి.కాం.5:29, 6:2; 12:32; 13:18, 26:18, 27:1). ఈ నిబంధనలోనికి ప్రవేశించిన వ్యక్తి (ఇశ్రాయేలీయుడు/యూదుడు) తన జీవితకాలములో ధర్మశాస్త్రములోని యేవొక్కటి తప్పిపోకుండా పాటించాలి. నిబంధనలో పాలుపంపులున్న ప్రతి ఇశ్రాయేలీయుడు/యూదుడు తన జీవితకాలములో ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా పాటించకపోతే, అంటే ఎప్పుడైనా యేవొక్క ఆజ్ఙ లేక విధి విశయములోనైనా తప్పిపోతే, నిబంధన ప్రకారము అతడు శాపగ్రస్తుడు. (ద్వి.కాం.27:26; యిర్మీయా 11:1-4) 

(3) ఈ నిబంధనలోని నియమవిధుల ప్రకారము కొన్ని అతిక్రమాలకు మరణమే శిక్ష (సం.కాం.15:30-31). మరిముఖ్యంగా పదిఆజ్ఙలలోని ఆరు ఆజ్ఙలను మీరిన వారికి మరణశిక్ష (ద్వి.కాం.13:1-18; 17:2-5; లే.కాం.24:11-16; ని.కాం.31:14-15, 35:2; ద్వి.కాం.21:18-21; ని.కాం.21:17; ని.కాం.21:12-14; లే.కాం.20:10). అలాంటి అతిక్రమాలకు ధర్మశాస్త్ర ప్రకారము యేలాంటి విముక్తి లేదు. కాని, ధర్మశాస్త్రము తరువాత ఇవ్వబడిన ప్రవక్తల ఉపదేశము ప్రకారము దేవుడు తన మహా గొప్ప కృపాకనికరాల ఆధారంగా తాను సంకల్పించి యేర్పరచుకొన్న తన సేవకుని అపరాధపరిహారార్థబలినిబట్టి ధర్మశాస్త్రముద్వారా మరణశిక్షకు పాత్రులైన వారందరికి క్షమాపణను అందుబాటులోకి తీసుకొచ్చాడు (యెషయా 53:2-12; దానియేలు 9:24).

దైవచిత్తములోని ఈ నిత్యప్రణాలికయొక్క ఖచ్చితత్వాన్నిబట్టి దేవుడు పాతనిబంధన కాలములో సహితము మరణకరమైన పాపములను చేసినవారినికూడా క్షమించగలిగాడు. ఉదాహరణకు, దావీదు ఊరియా భార్య అయిన బత్షేబ విశయములో చేసిన పాపము దేవుడిచ్చిన పది ఆజ్ఙలలో మూడు ఆజ్ఙలను మీరడమే. ఈ మూడు ఆజ్ఙాతిక్రమాలలో ధర్మశాస్త్ర ప్రకారము రెండింటికి మరణమే శిక్ష. అయినా, దావీదు దేవుని క్షమాపణను పొందగలిగాడు (2సమూయేలు.12:13). అందుకు కారణం ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తానే త్రొసివేయడముద్వారా దావీదును క్షమించాడని కాదు కాని, ధర్మశాస్త్రబద్దమైన మరణదండన అనే శిక్షను దేవుడు తానే సంకల్పించి యేర్పరచి నెరవేర్చబోతున్న తన కుమారుని అపరాధపరిహారార్థబలిలో నెరవేర్చాడు. అందునుబట్టే దావీదు విరిగినలిగిన హృదయంతో క్షమాపణను కోరినప్పుడు దేవుడతనిని క్షమించాడు (కీర్తన 51:1-19). 

(4) మోషేధర్మశాస్త్రమును తు.చ. తప్పకుండా తన జీవితకాలములో సంపూర్ణముగా పాటించిన వ్యక్తి పాత నిబంధన గ్రంథముగా పేర్కొనబడే యూదుల తనాఖ్ (Old Testament) లో ఎవరూ లేరు. 

ఈనాడు మోషేద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ, దాని ప్రకారం జీవిస్తున్నాము అంటూ భ్రమపడుతున్న వారు క్రింద ఇవ్వబడిన కొన్ని ధర్మశాస్త్ర విధులను పాటించే విశయములో తమ పరిస్తితిని పరిశీలించి చూసుకోవాలి:

i. మీరు ఇంతవరకు తిన్న ఆహారములో పశువుల (ఎద్దు/గొర్రె/మేక/కోడి మొదలైనవి) క్రొవ్వుకూడా వుండిందా? (లే.కాం.3:16) ఒక్కసారి వున్నా మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!! 

ii. తల్లిని లేక తండ్రిని దూశించిన మీ పిల్లలకు ఎప్పుడైనా మరణశిక్ష విధించారా? (లే.కాం.19:27) “మాదేశములో అలాంటిది చట్టపరంగా ఒప్పుకోరండీ” అంటూ సాకులు చెప్పకండి. అలా మీరు చెపితే దేవుని ధర్మశాస్త్రానికన్నా మీరు ఈలోక చట్టానికే గొప్పస్థానమిచ్చీ భయపడి దాసోహమంటున్నారనేగదా దాని భావం! మరోవిశయం, మీ పిల్లలపట్ల మీకున్న ప్రేమ దేవునిపట్లా అలాగే దేవుడు మోషేద్వారా యిచ్చిన ఆజ్ఙలపట్లా వుండాల్సిన ప్రేమకన్న గొప్పదనే కదా?! ఏకారణముచేతనైనా మీరు అలా చేయకపోతే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!  

iii. మీ తల చుట్టూ వెండ్రుకలను, గడ్డపు ప్రక్కలను కత్తిరింపకుండా జీవిస్తున్నారా? (లే.కాం.19:27; యిర్మియా 9:26) గడ్డాన్నే నున్నగా క్షవరం చేసికొని సోగ్గాల్లా తయారవుతుంటే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. తల చుట్టూ వెండ్రుకలను కత్తిరిస్తున్నట్లయితే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!! 

iv. మీరు వేసుకునే దుస్తులలో వున్ని మరియు జనుపనార (ప్రత్తి/cotton/linen/ఖాదీ) కలిసినవాటిని వేసుకుంటున్నారా? (ద్వి.కాం.22:11) అలా చెస్తే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!  

v. మీరు సంవత్సరానికి మూడుసార్లు యెరుషలేముకు వెళ్ళి అక్కడ బలులర్పించి పండుగలను ఆచరిస్ఫున్నారా? (ని.కాం.23:14) లేకపోతే  మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. 

vi. మీరెప్పుడైనా శనివారమునాడు ప్రయాణము చేసారా? (ని.కాం.16:29) అయితే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!

vii. మీరెప్పుడైనా శనివారమునాడు ఏపనియైనా చేసారా?(ని.కాం.20:10; లే.కాం.23:3) చేస్తే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!

viii. మీరెప్పుడైనా శనివారమునాడు వర్తకములో పాలుగొనడముగాని లేక సరకులు కొనడముగాని చేసారా? (నెహెమ్యా 10:31, 13:15,19; ఆమోసు 8:5) అలా చేసివుంటే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!

ix. విశ్రాంతిదినాచారాన్ని అంటే సబ్బాతు ఆచారాన్ని మీరినవారికి మీ సమాజములో మరణశిక్ష వేసార? (ని.కాం.31:14-15, 35:2) అలా వేయకపోతే మీరు మీసమాజమంతా మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మీసమాజమంతా శాపగ్రస్తులు అయినట్లే!!!  

x. మీ సమాజములో “హాని కలిగిన యెడల ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ” శిక్షగా నియమిస్తున్నారా?(ని.కాం.21:23-25; లే.కాం.24:19-20; ద్వి.కాం.19:21) అలా చేయకపోతున్నట్లయితే మీరు మీసమాజమంతా మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మీసమాజమంతా శాపగ్రస్తులు అయినట్లే!!!  

xi.  మీ తలంపులలో లేక హృదయములో మీదికానిది/యితరులది ఆశించిన సందర్భాలున్నాయా? (ని.కాం.20:17) వుంటే మీరు మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మోషేధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రస్తులు అయినట్లే!!!

xii. మీరు ఎప్పుడైనా వేరే దేవుని/దేవత పేరును ఉచ్చరించారా? (ని.కాం.23:13) అలా చేసి వున్నట్లయితే మీరు మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మోషేధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రస్తులు అయినట్లే!!!  

(5) మోషేధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు జనాంగమంతా తప్పిపోయిన కారణాన్నిబట్టి పూర్వ/పాత నిబంధన వీగిపోయింది (న్యాయాధిపతులు 2:20; 2రాజులు 17:15-18, 18:11-12; యెషయా 24:5; యిర్మీయ 11:8,10, 31:32; యెహెజ్కేలు 16:59, 44:7; హోషేయ 6:7, 8:1). 

(6) పూర్వ/పాత నిబంధనలో పాలుపంపులున్న వ్యక్తులంతా ఆ నిబంధనలోని నియమాల ప్రకారము శాపగ్రస్తులుగా తేలిపోయారు. నిజానికి, ఈ నిబంధనలోని నియమాల ప్రకారము మానవమాత్రులెవరూ నీతిమంతులుగా తీర్చబడలేరన్నది వెయ్యి సంవత్సరాల (క్రీ.పూ. 1400 – క్రీ.పూ. 400) ప్రవక్తలకాలంలో నిర్ధారణగా తేలిపోయింది (1రాజులు 8:46; కీర్తనలు 14:1-3, 53:1-3, 143:2; ప్రసంగి 7:20; రోమా.3:20; గలతీ.2:16, 3:10-11). 

(7) పై కారణాలను బట్టి దేవుడైన యెహోవా/యాహ్వే పాత నిబంధన స్థానములో నిత్యము వుండబోయే ఒక క్రొత్త నిబంధనను చేయబోతున్నట్లు ప్రవక్తల కాలంలోనే వాగ్ధానము చేసాడు (యెషయా 42:1-3,6, 55:1-5, 61:1-11; యిర్మీయ 31:31-34; యెహెజ్కేలు 16:59-60, 37:24-28). 

ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడుచేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీక రించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. ​నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.” (యెహెజ్కేలు 16:59-60)

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. ​అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ 31:31-32) 

(8) అబ్రహామును అలాగే ఆయన సంతానమైన ఇశ్రాయేలీయులను దేవుడు యెన్నుకొని వారితో చేసిన నిబంధనలద్వారా కేవళము వారిని మాత్రమే అశీర్వదించాలన్నది దేవుని వుద్దేశము కాదు. నిజానికి వారిని అశీర్వదించి వారిద్వారా భూలోకములోని వంశాలన్నిటిని అశీర్వదించాలన్నదే దేవుని నిత్యసంకల్పము (ఆది.కాం.12:1-3, 18:18, 22:18; కీర్తన 22:27-28, 86:9; యెషయా 9:1-2, 11:10, 42:1-4,6, 49:6, 55:1-5, 60:1-3; దానియేలు 7:14; ఆమోసు 9:11-12; హోషేయ 2:23). 

(9) పూర్వ/పాత నిబంధన కాలములోని భక్తులు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా పాటించలేక పోవడాన్ని బట్టి ధర్మశాస్త్ర మూలమైన నీతిని పొందలేకపోయారు. అయినా, వారందరూ ధర్మశాస్త్రానికి వేరుగా విశ్వాసమూలమైన నీతినిపొంది దేవుడిచ్చిన మోషే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ దాన్ని పాటించే విశయములో తమవంతు ప్రయత్నాలను చేశారు (ఆది.కాం. 15:5-6; హబక్కూకు 2:4; గలతీ.3:6-9; హెబ్రీ.11:13, 39). 

(10) పాత నిబంధనకాలం ప్రభువైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యొక్క సిలువ మరణము వరకు మాత్రమే అన్నది మరచిపోకూడదు. ఈ కారణమును బట్టే ప్రభువైన యేసు క్రీస్తు పవిత్రమైన అమూల్యమైన తన స్వరక్తాన్ని ధారపోయడముద్వారా అంటే తన మరణముద్వారా ప్రతిష్టించి ప్రారంభించబోయే క్రొత్త నిబంధన ఆరంభమువరకు పాత నిబంధన [మోషేద్వారా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన] యొక్క అసలు అర్థాన్ని తన చుట్టూ వున్నవారికి వివరించి చెప్పాడు, తాను పాటించి చూపాడు, మరియు దాని కోరికను తీర్చి కేవళము ఛాయగా మాత్రమే వుండిన దాని అసలు వుద్దేశాన్ని నెరవేర్చి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు బాలశిక్షకునిగా వుండిన దాని పాత్రను పూర్తి చేసాడు. తద్వారా క్రొత్త నిబంధనకు దానితోపాటే యివ్వబడే క్రొత్త నియమాలకు [క్రీస్తు ధర్మశాస్త్రానికి] మార్గం సుగమం చేసాడు (మత్తయి 5:17, 28:19-20; యోహాను 13:34-35, 14:25-26,16:12-13; లూకా 22:19-20, 24:44; రోమా.10:4; 1కొరింథీ.9:21; గలతీ.3:24-25).

కనుక, ఈ క్రొత్తనిబంధన కాలములో నిజక్రైస్తవులు అంటే ఆత్మలో తిరిగి జన్మించిన విశ్వాసులు మోషేధర్మశాస్త్రాన్ని కాదు క్రీస్తు (మెస్సయ్య) ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ జీవించాలి!

« Older Entries