తనాక్-జూడాయిజం

ఈనాటి యూదులు మరియు యూదామతప్రవిష్టులు క్రొత్తనిబంధన గ్రంథాన్ని దైవలేఖనాలుగా ఒప్పుకోరు విశ్వసించరు. వారిదృష్టిలో కేవళము క్రైస్తవులు పాతనిబంధన గ్రంథముగా పేర్కొనే 39 హిబ్రూ లేఖనగ్రంథాలు మాత్రమే దైవలేఖనాలు. దీన్నిబట్టి యూదులు/యూదామతప్రవిష్టులు తాము దైవలేఖనాలుగా విశ్వసించే 39 హిబ్రూ లేఖనగ్రంథాలను (పాతనిబంధన గ్రంథాన్ని) పాతనిబంధన గ్రంథము అని పేర్కొనకుండా “తనాక్” (TaNaK) అన్న ఒక క్రొత్తపేరుతో పిలుస్తారు. 

తనాక్ (TaNaK) అంటే యూదుల పరిభాషలో కేవళము 39 హిబ్రూ లేఖనగ్రంథాల సంపుటి అయిన పాతనిబంధన గ్రంథము. దీన్నే హిబ్రూ భాషలో మిక్రా (Mikra) అనికూడా సంబోధిస్తారు.తనాక్ లోని  39 హిబ్రూ లేఖనగ్రంథాలను యూదులు మూడు ప్రధాన భాగాలుగా విభజించారు–తోరా/Torah (మోషేద్వారా యివ్వబడిన పంచకాండాలు), నెవియిం/Nevi’im (ప్రవక్తలు), మరియు కెతువిం/K’etuvim (వ్రాతలు/లేఖనాలు). ఇవి పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాయబడిన దైవ సందేశముతో కూడిన గ్రంథాలు. ఈ 39 గ్రంథాలు 1000 సంవత్సరాల కాలంలో వ్రాయబడ్డాయి (1400 క్రీ.పూ.— 400 క్రీ.పూ.). మూడు హిబ్రూ పదాలలోని (Torah, Nevi’im, K’etuvim) మొదటి అక్షరాలను చేర్చి తనాక్ (TaNaK) అన్న పదాన్ని యేర్పరచుకున్నారు యూదులు. 

“తనాక్ ధార్మిక మార్గం” అన్న మతవిశ్వాసం కేవలం తనాక్ (పాతనిబంధన గ్రంథము) లోని దైవలేఖనాలపై మాత్రమే ఆధారపడిన మతవిశ్వాసం. ఈ మతవిశ్వాసాన్ని బైబిలు విశ్వాసము అనికూడా పేర్కొనవచ్చు. ఇది యెరూషలేములో హేరోదు కట్టించిన రెండవ మందిరము 70 క్రీ.శ. లో నాశనము/ద్వంసము చేయబడినతరువాత క్రమక్రమంగా వునికిని కోల్పోయింది. అంతకు పూర్వము తనాక్ ధార్మిక మార్గం లోని భక్తిపరులు చాలావరకు యేసును (యషువను) క్రీస్తుగా (మెస్సయ్యగా) గుర్తించి ఆయనను వెంబడించి క్రైస్తవులుగా మారిపోయారు. ఆరకంగా తనాక్ ధార్మిక మార్గం తన అస్తమయసమయానికంటే ముందే తనలో రూపుదిద్దుకున్న బైబిలు-క్రైస్తవ్యానికి పురుడుపోసి దేవుని ఆత్మీయ ప్రణాలికలో తన పాత్రను ముగించుకొని తన వారసుడైన “క్రొత్తనిబంధన సమాజము”లో క్రొత్త పేరుతో చిరంజీవిగా నిలిచిపోయింది (యెషయా 65:15).

తనాక్-జూడాయిజం ప్రధానంగా మోషేనిబంధనలో భాగమైన మోషేధర్మశాస్త్రములోని ఆజ్ఙలు, విధులు, గుడారము/దేవాలయము లోని అర్చనాదులు, బలులు, నైవేధ్యాలు, శిక్షలు మొదలైనవాటిచుట్టు కేంద్రీకృతమైనది. అయితే, 70 క్రీ.శ.లో రోమాసైన్యము యెరూషలేములోని దేవుని మందిరాన్ని నాశనముచేసి యూదులమతకేంద్రాన్ని ద్వంసం చేయడముతో తనాక్-జూడాయిజం తన అంతిమదశకు చేరుకున్నది. నిజానికి 40 సంవత్సరాలకుముందే అంటే దాదాపు 30 క్రీ.శ.లో దేవుని ప్రణాలికలోని మానవనిర్మిత మందిరముకుండిన ప్రధాన వుద్దేశము నెరవేర్చబడి సంపూర్ణము చేయబడింది. దేవుని సన్నిధిలో సర్వకాలాలకు సరిపోయిన దైవసుతుని బలియాగము సృష్టిలో దైవసాక్షిగా అర్పించబడింది. దానికి సాదృశ్యంగా పరిశుద్ధస్థలానికి మరియు అతిపరిశుద్ధస్థలానికి మధ్యలో వుండిన తెర తొలగి ప్రతిసంవత్సరము ఒకసారిమాత్రమే దేవుని ప్రజల పాపాలప్రాయశ్చిత్తార్థమై ప్రధానయాజకుడు పశువుల రక్తముతో దేవునిమందిరములోని అతిపరిశుద్ధస్థలములోకి ప్రవేశించే ఆగత్యానికి తెరపడింది. ఈరకంగా తనాక్-జూడాయిజం యొక్క అంతిమదశకు నాంది పడింది. అక్కడే క్రొత్తనిబంధనాసమాజానికి అంకురార్పణ జరిగింది. అయితే, అదేసమయంలో తనాక్-జుడాయిజం కు వేరుగా మరియు ప్రతికూలంగా తాల్మూద్-జూడాయిజం అనే ఒక క్రొత్త జూడాయిజం మొలకెత్తింది. దాన్నే రబ్బీలజూడాయిజం అనికూడా పేర్కోంటారు. అదే ఇనాటి ప్రపంచములో యూదుమతంగా పేరొంది విస్తరిస్తున్నది.

“బైబిల్-క్రైస్తవ్యం” లేక “క్రొత్తనిబంధనాసమాజం” అన్నది మోషేనిబంధన కాలములోనే దేవుడు వాగ్ధానం చేసిన వేరొక నిబంధనకు చెందిన దేవునిప్రజలు (ద్వి.కాం.32:21; కీర్తన.82:8). ఆ వేరొకనిబంధననే “క్రొత్తనిబంధన” అని లేఖనాలు అభివర్ణించాయి. కొందరు తప్పుగా అభిప్రాయపడుతున్నట్లు ఇది నూతనపరచబడిన మోషేనిబంధన కాదు. అసలు యిది మోషేనిబంధనవంటిదేమాత్రము కాదు. “అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు” అంటూ దేవుడే విస్పష్టముగా సెలవిచ్చినవిధంగా ఆ “క్రొత్తనిబంధన” మోషేనిబంధనవంటిది కాదు అన్నది గమనార్హమైన విశయము. అంతేకాక దేవుడే ఈ నిబంధనకు ‘నిత్యనిబంధన’ అంటూ మోషేనిబంధనకులేని ఉత్కృష్టస్థానాన్ని గుర్తింపును తనముద్రగా యిచ్చాడు (యిర్మీయ 31:31-34, 32:37-40).

పాత/పూర్వ నిబంధనగా వున్న మోషేనిబంధనలో భాగంగా యివ్వబడిన మోషేధర్మశాస్త్రము గుడారము/దేవాలయము మరియు దాని ఆచారాలతో విధులతో ముడిపడివుంది. అయితే, క్రొత్తనిబంధనలో భాగంగా అక్షరార్థముగా అలాంటి ఆచారాలు విధులు ఎవీ లేని క్రొత్తధర్మశాస్త్రము లేక క్రీస్తుధర్మశాస్త్రము (Law of Christ—యెషయా.42:4; గలతీ.6:2) యివ్వబడింది (యోహాను 13:34, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6). ఈ క్రొత్తనిబంధనాప్రజలే క్రీస్తు అనబడిన యేసు యొక్క శిష్యులు లేక క్రైస్తవులు. 30 క్రీ.శ.తరువాత ప్రారంభమైన క్రైస్తవ్యం మొదట్లో ఒక దశాబ్ధానికిపైగా కేవళము యూదులతో ప్రారంభమై యూదులమధ్యే విస్తరించింది. ఆ సమయములో కొన్ని వేల యూదులు సత్యాన్ని గ్రహించి జూడాయిజంను వదిలి క్రైస్తవ్యాన్ని స్వీకరించారు (అపో.కా.21:20).

క్రైస్తవుడు (Christian) అంటే ‘క్రీస్తును వెంబడించే వాడు’ (follower of Christ)అని భావం. ప్రారంభములో ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల యొక్క ప్రత్యేకమైన విశ్వాసము మరియు అబ్బురపరచే జీవనవిధానాలు అన్యులను/అవిశ్వాసులను కదిలించివేసాయి. శిష్యులకున్న ఆ విశిష్ట గుణలక్షణాలే వారు క్రీస్తును వెంబడించే వారని అన్యులు/అవిశ్వాసులు గుర్తించేందుకు తోడ్పడ్డాయి. దాంతో అన్యులు/అవిశ్వాసులు శిష్యులను ఆ పేరుతో అంటే ‘క్రైస్తవులు’ అంటూ పిలవడం మొదలుబెట్టారు (అపో.కాం.11:26). యేసుక్రీస్తునందు విశ్వాసముద్వారా దేవుని పిల్లలైనవారికి క్రైస్తవులు (Christians) అన్న పేరు దైవలేఖనాలు ప్రమాణీకరించడాన్ని క్రొత్తనిబంధనలో చూడగలము (1పేతురు 4:16).

3 comments

  • Ravi kumar

    I want to study more about the Holy Bible . Do you have been providing any bible courses.?

    If yes then guide me or choose the best way to know the courses.

    • Admin

      Dear brother Ravi Kumar,

      Greetings in Jesus’ precious name! We greatly appreciate your desire to study the Holy Bible more. Unfortunately, we do not provide any regular Bible Course at the moment. However, we love to help you in your desire by providing inputs through this website and also some WhatsApp groups. If you are interested please send your whatsapp number to our email ID: [email protected]

      God bless you!

  • I am read more bible and I m instead bible course

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *